నిన్న విడుదలైన కంగువలో కంటెంట్ సంగతి కాసేపు పక్కనపెడితే ఎక్కువ శాతం ప్రేక్షకులు కంప్లయింట్ చేసిన అంశం బ్యాక్ గ్రౌండ్ స్కోర్. పుష్ప 2 ది రూల్ బిజిఎం బాధ్యతలు తన స్థానంలో తమన్ తో పాటు మరో ఇద్దరికీ ఇచ్చారన్న వార్తలు వచ్చినప్పటి నుంచి దేవి ఫ్యాన్స్ చూపులన్నీ కంగువ మీదే ఉన్నాయి.
కానీ థియేటర్ లో చూశాక లౌడ్ సౌండ్, హోరెత్తిపోయే వాయిద్యాలతో నానా ఖంగాళీ జరిగిన ఫీలింగ్ కలిగింది. దర్శకుడు శివ తీసిన కథ అలా ఉంది కదాని కౌంటర్ ఇవ్వొచ్చు. కానీ బలహీనమైన సీన్లను సైతం నేపధ్య సంగీతంతో నిలబెట్టిన ఉదంతాలు దేవి నుంచి అనిరుధ్ దాకా ఎన్నో చూశాం కదా.
పైగా కంగువ పాటలకు సైతం యునానిమస్ గా ఛార్ట్ బస్టర్ రెస్పాన్స్ రాకపోవడం మరో మైనస్. క్యాచీగా లేవు. మళ్ళీ మళ్ళీ వినేలా వైరల్ కాలేదు. రీల్స్ చేసుకునేవాళ్ళకు అంతగా ఎక్కలేదు. ఈ మైనస్సులకు తోడు ఇప్పుడీ ఫీడ్ బ్యాక్. నిజానికి దేవికి తగినంత సమయమే దొరికింది. కంగువ పలుమార్లు వాయిదా పడింది.
ఫైనల్ కాపీ సిద్ధమయ్యాక కూడా నెల రోజులు పోస్ట్ పోన్ చేశారు. ఒకవేళ ఏదైనా కరెక్షన్లు చేయాలనుకుంటే ఇది మంచి సమయమే. కానీ అదే నెలలో హైదరాబాద్ లైవ్ కన్సర్ట్ లో దేవి చాలా బిజీగా ఉన్నాడు. అందుకే హడావిడిగా కంగువ పనులు పూర్తి చేశాడేమో తెలియదు.
ఏది ఏమైనా దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడీ ఫీడ్ బ్యాక్ ని పరిగణనలోకి తీసుకోవాలి. మరీ బ్యాడ్ అని అన్నా అనకపోయినా మ్యూజిక్ లవర్స్ ని సంతృప్తి పరచలేదన్నది వాస్తవం. ఒకవేళ పుష్ప 2 ది రూల్ బ్లాక్ బస్టర్ అయినా దాని క్రెడిట్ దేవికి కేవలం పాటలకు మాత్రమే పరిమితమవుతుంది. బీజీఎమ్ పేరు వేరొకరికి వెళ్ళిపోతుంది.
అదిరిపోయే ఆల్బమ్ తో దేవి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఇదంతా మింగుడుపడటం లేదు. కంగువ కనక సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని ఉంటే బహుశా ఇంతగా ఈ టాపిక్ మీద ఫోకస్ ఉండేది కాదేమో కానీ ఊగిసలాట ఫలితం వల్ల కామెంట్స్ తప్పలేదు.
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…
నరాల్లో హార్పిక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీరు విన్నది నిజమే. బర్తను అకారణంగా చంపేస్తున్న భార్యల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.…
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఉరఫ్ PK .. ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రత్యక్ష…
తమిళంలో చాలా ఏళ్ల నుంచి మంచి మంచి సినిమాలు చేస్తున్నప్పటికీ.. తెలుగమ్మాయి గుత్తా జ్వాలను పెళ్లి చేసుకోవడం ద్వారానే ఎక్కువగా తెలుగు వాళ్ల దృష్టిని ఆకర్షించాడు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై…