నిన్న విడుదలైన కంగువలో కంటెంట్ సంగతి కాసేపు పక్కనపెడితే ఎక్కువ శాతం ప్రేక్షకులు కంప్లయింట్ చేసిన అంశం బ్యాక్ గ్రౌండ్ స్కోర్. పుష్ప 2 ది రూల్ బిజిఎం బాధ్యతలు తన స్థానంలో తమన్ తో పాటు మరో ఇద్దరికీ ఇచ్చారన్న వార్తలు వచ్చినప్పటి నుంచి దేవి ఫ్యాన్స్ చూపులన్నీ కంగువ మీదే ఉన్నాయి.
కానీ థియేటర్ లో చూశాక లౌడ్ సౌండ్, హోరెత్తిపోయే వాయిద్యాలతో నానా ఖంగాళీ జరిగిన ఫీలింగ్ కలిగింది. దర్శకుడు శివ తీసిన కథ అలా ఉంది కదాని కౌంటర్ ఇవ్వొచ్చు. కానీ బలహీనమైన సీన్లను సైతం నేపధ్య సంగీతంతో నిలబెట్టిన ఉదంతాలు దేవి నుంచి అనిరుధ్ దాకా ఎన్నో చూశాం కదా.
పైగా కంగువ పాటలకు సైతం యునానిమస్ గా ఛార్ట్ బస్టర్ రెస్పాన్స్ రాకపోవడం మరో మైనస్. క్యాచీగా లేవు. మళ్ళీ మళ్ళీ వినేలా వైరల్ కాలేదు. రీల్స్ చేసుకునేవాళ్ళకు అంతగా ఎక్కలేదు. ఈ మైనస్సులకు తోడు ఇప్పుడీ ఫీడ్ బ్యాక్. నిజానికి దేవికి తగినంత సమయమే దొరికింది. కంగువ పలుమార్లు వాయిదా పడింది.
ఫైనల్ కాపీ సిద్ధమయ్యాక కూడా నెల రోజులు పోస్ట్ పోన్ చేశారు. ఒకవేళ ఏదైనా కరెక్షన్లు చేయాలనుకుంటే ఇది మంచి సమయమే. కానీ అదే నెలలో హైదరాబాద్ లైవ్ కన్సర్ట్ లో దేవి చాలా బిజీగా ఉన్నాడు. అందుకే హడావిడిగా కంగువ పనులు పూర్తి చేశాడేమో తెలియదు.
ఏది ఏమైనా దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడీ ఫీడ్ బ్యాక్ ని పరిగణనలోకి తీసుకోవాలి. మరీ బ్యాడ్ అని అన్నా అనకపోయినా మ్యూజిక్ లవర్స్ ని సంతృప్తి పరచలేదన్నది వాస్తవం. ఒకవేళ పుష్ప 2 ది రూల్ బ్లాక్ బస్టర్ అయినా దాని క్రెడిట్ దేవికి కేవలం పాటలకు మాత్రమే పరిమితమవుతుంది. బీజీఎమ్ పేరు వేరొకరికి వెళ్ళిపోతుంది.
అదిరిపోయే ఆల్బమ్ తో దేవి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఇదంతా మింగుడుపడటం లేదు. కంగువ కనక సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని ఉంటే బహుశా ఇంతగా ఈ టాపిక్ మీద ఫోకస్ ఉండేది కాదేమో కానీ ఊగిసలాట ఫలితం వల్ల కామెంట్స్ తప్పలేదు.
This post was last modified on November 15, 2024 10:26 am
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…
అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…
వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…
కొన్నేళ్ల ముందు నందమూరి తారకరత్న ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండెపోటుకు గురి కావడం, కొన్ని రోజుల పాటు…