నిన్న విడుదలైన కంగువలో కంటెంట్ సంగతి కాసేపు పక్కనపెడితే ఎక్కువ శాతం ప్రేక్షకులు కంప్లయింట్ చేసిన అంశం బ్యాక్ గ్రౌండ్ స్కోర్. పుష్ప 2 ది రూల్ బిజిఎం బాధ్యతలు తన స్థానంలో తమన్ తో పాటు మరో ఇద్దరికీ ఇచ్చారన్న వార్తలు వచ్చినప్పటి నుంచి దేవి ఫ్యాన్స్ చూపులన్నీ కంగువ మీదే ఉన్నాయి.
కానీ థియేటర్ లో చూశాక లౌడ్ సౌండ్, హోరెత్తిపోయే వాయిద్యాలతో నానా ఖంగాళీ జరిగిన ఫీలింగ్ కలిగింది. దర్శకుడు శివ తీసిన కథ అలా ఉంది కదాని కౌంటర్ ఇవ్వొచ్చు. కానీ బలహీనమైన సీన్లను సైతం నేపధ్య సంగీతంతో నిలబెట్టిన ఉదంతాలు దేవి నుంచి అనిరుధ్ దాకా ఎన్నో చూశాం కదా.
పైగా కంగువ పాటలకు సైతం యునానిమస్ గా ఛార్ట్ బస్టర్ రెస్పాన్స్ రాకపోవడం మరో మైనస్. క్యాచీగా లేవు. మళ్ళీ మళ్ళీ వినేలా వైరల్ కాలేదు. రీల్స్ చేసుకునేవాళ్ళకు అంతగా ఎక్కలేదు. ఈ మైనస్సులకు తోడు ఇప్పుడీ ఫీడ్ బ్యాక్. నిజానికి దేవికి తగినంత సమయమే దొరికింది. కంగువ పలుమార్లు వాయిదా పడింది.
ఫైనల్ కాపీ సిద్ధమయ్యాక కూడా నెల రోజులు పోస్ట్ పోన్ చేశారు. ఒకవేళ ఏదైనా కరెక్షన్లు చేయాలనుకుంటే ఇది మంచి సమయమే. కానీ అదే నెలలో హైదరాబాద్ లైవ్ కన్సర్ట్ లో దేవి చాలా బిజీగా ఉన్నాడు. అందుకే హడావిడిగా కంగువ పనులు పూర్తి చేశాడేమో తెలియదు.
ఏది ఏమైనా దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడీ ఫీడ్ బ్యాక్ ని పరిగణనలోకి తీసుకోవాలి. మరీ బ్యాడ్ అని అన్నా అనకపోయినా మ్యూజిక్ లవర్స్ ని సంతృప్తి పరచలేదన్నది వాస్తవం. ఒకవేళ పుష్ప 2 ది రూల్ బ్లాక్ బస్టర్ అయినా దాని క్రెడిట్ దేవికి కేవలం పాటలకు మాత్రమే పరిమితమవుతుంది. బీజీఎమ్ పేరు వేరొకరికి వెళ్ళిపోతుంది.
అదిరిపోయే ఆల్బమ్ తో దేవి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఇదంతా మింగుడుపడటం లేదు. కంగువ కనక సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని ఉంటే బహుశా ఇంతగా ఈ టాపిక్ మీద ఫోకస్ ఉండేది కాదేమో కానీ ఊగిసలాట ఫలితం వల్ల కామెంట్స్ తప్పలేదు.
This post was last modified on November 15, 2024 10:26 am
ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…