ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటైన ‘పుష్ప-2’ విడుదలకు ఇంకో 20 రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ సినిమా చిత్రీకరణ ఇంకా పూర్తి కాలేదు. ఐతే ఇప్పటికే రిలీజ్ చాలా ఆలస్యం అయిన నేపథ్యంలో ఈసారి మాత్రం అనుకున్న ప్రకారమే డిసెంబరు 5న ‘పుష్ప-2’ను విడుదల చేయాలని సుకుమార్ అండ్ టీం రేయింబవళ్లు కష్టపడుతోంది. షూట్కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే.. అల్లు అర్జున్-శ్రీలీల మీద ఐటెం సాంగ్ చిత్రీకరణ పూర్తయినట్లే. మరో పాట, కొంచెం ప్యాచ్ వర్క్ మిగిలి ఉంది. ఆ ప్యాచ్ వర్క్లో ‘పుష్ప-3’కు లీడ్ ఇస్తూ సినిమాను ముగించే సన్నివేశం కూడా ఉంది.
‘పుష్ప’ సినిమాకు, ఆ పాత్రకు ఉన్న క్రేజ్ దృష్ట్యా పార్ట్-3 తీసినా జనం ఎగబడి చూస్తారనడంలో సందేహం లేదు. ఐతే పుష్ప-1లో ‘పుష్ప-2’లో మెయిన్ విలన్గా నటించే ఫాహద్ ఫాజిల్ను పరిచయం చేసి తన మీద 20 నిమిషాల కథ నడిపి పార్ట్-2 మీద క్యూరియాసిటీ పెంచేలా చేశాడు సుకుమార్.
మరి పార్ట్-3కి కొత్త విలన్ని పరిచయం చేసి లీడ్ ఇస్తే దానికి హైప్ పెరిగేందుకు అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో మూడో ‘పుష్ప’లో విలన్ పాత్రధారిగా ఎవరిని పరిచయం చేస్తారా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది. ఐతే ఇందుకోసం కొన్ని పేర్లు పరిశీలించి ఒక బాలీవుడ్ నటుడిని దాదాపుగా ఓకే చేసిన సుకుమార్.. ఆ తర్వాత వెనక్కి తగ్గినట్లు సమాచారం.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ‘పుష్ప-3’ చేయడం అంత తేలిక కాదని.. తనకు, బన్నీకి ఉన్న కమిట్మెంట్ల దృష్ట్యా వచ్చే రెండు మూడేళ్లలో సినిమా పట్టాలెక్కకపోవచ్చని.. అలా అనిశ్చితి ఉన్న నేపథ్యంలో ముందే విలన్ని పరిచయం చేయాల్సిన అవసరం లేదని.. సినిమా చేయాలనుకున్నపుడు అప్పటి అవకాశాలను బట్టి విలన్ పాత్రకు ఆర్టిస్టును ఎంచుకోవచ్చని అనుకున్నారని.. అందుకే పార్ట్-3 లీడ్ సీన్లో ఏ నటుడినీ చూపించరని సమాచారం. కేవలం షాడోలో ఒక పాత్రధారిని చూపించి ప్రేక్షకుల ఊహలకు వదిలేస్తారని ‘పుష్ప-2’ యూనిట్ వర్గాల సమాచారం.
This post was last modified on November 15, 2024 6:18 am
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…