ఇంకో ఇరవై రోజుల్లో విడుదల కాబోతున్న పుష్ప 2 ది రూల్ మీద అంచనాలు కొలవాలంటే తలలు పండిన ట్రేడ్ పండితుల వల్ల కూడా కాదేమో అనే స్థాయిలో బజ్ అమాంతం పెరిగిపోతోంది.
ఇంకా మూడు వారాలు టైం ఉన్నప్పటికీ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ కనివిని ఎరుగని స్థాయిలో 30 వేల టికెట్లకు దగ్గరగా వెళ్లడం చూస్తే ప్రీమియర్ల సమయానికి రికార్డుల ఊచకోత ఎంత ఉంటుందనేది ఊహించడం కష్టం. బెనిఫిట్ షో టికెట్ల కోసం ఏకంగా రాజకీయ నాయకుల ప్రమేయం అవసరమయ్యేలా ఉందంటే పుష్ప యుఫోరియాని అర్థం చేసుకోవచ్చు. ఇక అసలు ముచ్చటైన విలన్ల సంగతి చూద్దాం.
పుష్ప 1 ది రైజ్ లో ప్రతినాయకుడిగా ఎక్కువ హైలైట్ అయ్యింది భన్వర్ సింగ్ షెకావత్ అలియాస్ ఫహద్ ఫాసిల్. అజయ్ ఘోష్ కు స్కోప్ దక్కింది కానీ ఆ పాత్ర మొదటిభాగంలో చనిపోయింది కాబట్టి ఇప్పుడీ సీక్వెల్ లో సునీల్, అనసూయలకు ఎక్కువ ప్రాధాన్యం దక్కనుందని తెలిసింది.
మొదటి భాగంలో శ్రీవల్లి మీద కన్నేసిన డాలీ ధనుంజయకు కాళ్ళు విరిగిన తర్వాత అతని రివెంజ్ ఎపిసోడ్ ని సుకుమార్ విభిన్నంగా ప్లాన్ చేశారట. వీళ్ళతో పాటు ఈసారి జగపతిబాబు తోడవుతున్నాడు. ఫస్ట్ పార్ట్ లో కాసేపే కనిపించిన రావు రమేష్ కు ఈసారి పొలిటికల్ యాంగిల్ లో ఎక్కువ లెన్త్ దొరికిందట.
వీళ్ళందరూ ఒక ఎత్తయితే జపాన్ ఎపిసోడ్ లో ఎదురయ్యే కొత్త విలన్లతో పుష్ప క్లాష్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని సమాచారం.
విదేశీ నటుల ఎంపికలో సుకుమార్ మార్క్ కనిపిస్తుందని అంటున్నారు. మూడు గంటల సేపు నాన్ స్టాప్ గా షాక్ కు గురి చేసేలా కంటెంట్ ఉంటుందని, పాటలు ఒక్కదాన్ని మించి మరొకటి ఉంటాయని ఊరిస్తున్నారు. అల్లు అర్జున్ సినిమాల్లో ఇంత పెద్ద విలన్ గ్యాంగ్ ఉన్న సినిమా పుష్ప ఒక్కటే. ఎర్రచందనం స్మగ్లింగ్ లో కొత్త తరహా ఎత్తుగడలను చూపించేందుకు సుకుమార్ ప్రత్యేకంగా రీసెర్చ్ కూడా చేయించారట. సో అభిమానులు చాలా సర్ప్రైజులకు సిద్ధమవ్వాల్సిందే.
This post was last modified on November 14, 2024 11:58 am
మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం మొదటి రోజు ప్రీమియర్లతో…
వాహనదారులకు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ట్రాఫిక్ రూల్స్కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ..…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…