టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ ఒక దశలో ఫిదా, ఎఫ్-2 తొలి ప్రేమ లాంటి హిట్లతో మంచి ఊపు మీదే కనిపించాడు. కానీ రెండు మూడేళ్లుగా అతడికి అస్సలు కలిసి రావడం లేదు ఎఫ్-2కు కొనసాగింపుగా చేసిన ఎఫ్-3 అంచనాలను అందుకోలేకపోయింది. ఇక సోలో హీరోగా అతను నటించిన గని, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లు అయ్యాయి. దీంతో తన ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ మీద ప్రభావం కూడా గట్టిగానే పడ్డట్లు కనిపిస్తోంది.
వరుణ్ కొత్త చిత్రం మట్కా టీజర్, ట్రైలర్ ప్రామిసింగ్గా కనిపించినా సరే.. దీనికి అనుకున్న స్థాయిలో బజ్ క్రియేట్ కాలేదు. సినిమాకు బిజినెస్ పరమైన సమస్యలు కూడా ఎదురైనట్లు వార్తలు వచ్చాయి. బిజినెస్ సంగతేమో కానీ.. విడుదల ముంగిట హైప్ లేని విషయం అడ్వాన్స్ బుకింగ్స్లో స్పష్టంగా తెలిసిపోతోంది.
మట్కాకు రెండు రోజుల ముందే బుకింగ్స్ మొదలు కాగా.. టికెట్ల అమ్మకాలు మరీ డల్లుగా సాగుతున్నాయి. హైదరాబాద్ లాంటి మేజర్ సిటీల్లో ఏవో కొన్ని షోలకు మినహాయిస్తే ఆక్యుపెన్సీలు పెద్దగా లేవు. ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్లో ఉన్న షోలను వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు.
ప్రేక్షకులకు దీపావళి సినిమాలు మంచి కిక్కిచ్చాయి. వాటిని బాగా చూశారు. ఆ సినిమాలకు బాగా ఖర్చు పెట్టేయడం వల్లో ఏమో.. గత వారం సినిమాలను పెద్దగా పట్టించుకోలేదు. ఈ వారం కంగువ లాంటి భారీ చిత్రం రేసులో ఉంది. దానికి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ అంత గొప్పగా లేవు. అంత పెద్ద సినిమాతో పోటీ పడుతుండడం మట్కాకు సమస్యగా మారింది. మామూలుగానే వరుణ్ వరుస డిజాస్టర్లు ఎదుర్కోవడం మైనస్ కాగా.. దీపావళి సినిమాల ఎఫెక్ట్, కంగువతో పోటీ మట్కా మీద ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఐతే సినిమాకు టాక్ బాగుంటే ఆటోమేటిగ్గా పుంజుకుంటుందనే ఆశాభావంతో మేకర్స్ ఉన్నారు.
This post was last modified on November 12, 2024 11:00 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…