టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ ఒక దశలో ఫిదా, ఎఫ్-2 తొలి ప్రేమ లాంటి హిట్లతో మంచి ఊపు మీదే కనిపించాడు. కానీ రెండు మూడేళ్లుగా అతడికి అస్సలు కలిసి రావడం లేదు ఎఫ్-2కు కొనసాగింపుగా చేసిన ఎఫ్-3 అంచనాలను అందుకోలేకపోయింది. ఇక సోలో హీరోగా అతను నటించిన గని, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లు అయ్యాయి. దీంతో తన ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ మీద ప్రభావం కూడా గట్టిగానే పడ్డట్లు కనిపిస్తోంది.
వరుణ్ కొత్త చిత్రం మట్కా టీజర్, ట్రైలర్ ప్రామిసింగ్గా కనిపించినా సరే.. దీనికి అనుకున్న స్థాయిలో బజ్ క్రియేట్ కాలేదు. సినిమాకు బిజినెస్ పరమైన సమస్యలు కూడా ఎదురైనట్లు వార్తలు వచ్చాయి. బిజినెస్ సంగతేమో కానీ.. విడుదల ముంగిట హైప్ లేని విషయం అడ్వాన్స్ బుకింగ్స్లో స్పష్టంగా తెలిసిపోతోంది.
మట్కాకు రెండు రోజుల ముందే బుకింగ్స్ మొదలు కాగా.. టికెట్ల అమ్మకాలు మరీ డల్లుగా సాగుతున్నాయి. హైదరాబాద్ లాంటి మేజర్ సిటీల్లో ఏవో కొన్ని షోలకు మినహాయిస్తే ఆక్యుపెన్సీలు పెద్దగా లేవు. ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్లో ఉన్న షోలను వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు.
ప్రేక్షకులకు దీపావళి సినిమాలు మంచి కిక్కిచ్చాయి. వాటిని బాగా చూశారు. ఆ సినిమాలకు బాగా ఖర్చు పెట్టేయడం వల్లో ఏమో.. గత వారం సినిమాలను పెద్దగా పట్టించుకోలేదు. ఈ వారం కంగువ లాంటి భారీ చిత్రం రేసులో ఉంది. దానికి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ అంత గొప్పగా లేవు. అంత పెద్ద సినిమాతో పోటీ పడుతుండడం మట్కాకు సమస్యగా మారింది. మామూలుగానే వరుణ్ వరుస డిజాస్టర్లు ఎదుర్కోవడం మైనస్ కాగా.. దీపావళి సినిమాల ఎఫెక్ట్, కంగువతో పోటీ మట్కా మీద ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఐతే సినిమాకు టాక్ బాగుంటే ఆటోమేటిగ్గా పుంజుకుంటుందనే ఆశాభావంతో మేకర్స్ ఉన్నారు.
This post was last modified on November 12, 2024 11:00 pm
దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 విపరీతంగా నిరాశ పరచడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ ప్యాన్ ఇండియా…
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధిపతి విజయ్ రాజకీయ విమర్శలకు కేంద్రంగా మారారు. ఆయనను కార్నర్ చేస్తూ.. బీజేపీసహా ఇతర పార్టీలు…
ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను…
ఏపీ సీఎం చంద్రబాబు మత్స్యకారుల మనసు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన మత్సకార సేవలో కార్యక్రమంలో…
దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…