మాములుగా ఒక మీడియం రేంజ్ హీరో సినిమా ఒక వారం రోజులు స్ట్రాంగ్ గా నిలబడితే బ్లాక్ బస్టర్ గా నిర్ణయించే రోజులివి. అలాంటిది మూడో వారంలో అడుగు పెడుతున్న టైంకే 250 కోట్లు అందుకుంటే దాన్నేమంటారు. శివ కార్తికేయన్ ఈ ఫీట్ సాధించిన పదకొండో ఇండియన్ స్టార్ గా నిలవడం చిన్న విషయం కాదు. అయితే అమరన్ ఇంత ప్రేమను అందుకోవడానికి 5 ప్రధాన కారణాలు ఏంటో చూద్దాం. మొదటిది సాయిపల్లవి. మేజర్ ముకుంద్ వరదరాజన్ భార్యగా తనిచ్చిన పెర్ఫార్మన్స్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ముఖ్యంగా క్లైమాక్స్, ఫ్యామిలీ సన్నివేశాల్లో తనకు వేరెవరు సాటిరారని నిరూపించింది.
రెండోది మణిరత్నం, గౌతమ్ మీనన్ తరహాలో దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి చూపించిన టేకింగ్. ఎక్కడా కమర్షియల్ వాసన లేకుండా, అలాని విసుగు తెప్పించకుండా నిజాయితీగా స్క్రీన్ ప్లే రాసుకున్న తీరు ఎన్ని అవార్డులు తీసుకొస్తుందో ఇప్పుడే ఊహించడం కష్టం. మూడోది జివి ప్రకాష్ కుమార్ సంగీతం. ఇటీవలి కాలం తన స్థాయి అవుట్ ఫుట్ ఇవ్వలేక కొంత నిరాశ పరుస్తున్న ఇతను అమరన్ కు మాత్రం అద్భుతమైన స్కోర్ ఇచ్చాడు. కథలో ఆత్మను గొప్పగా ఆవిష్కరించాడు. నాలుగో కారణం నిర్మాత కమల్ హాసన్ కమిట్ మెంట్. నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా కంటెంట్ నమ్మి ఖర్చు పెట్టారు.
చివరిది మరియు అసలైన కారణం శివ కార్తికేయన్. ఇమేజ్ లెక్కలు వేసుకోకుండా, ఇలాంటి బయోపిక్కులు గతంలో మేజర్ లాంటివి వచ్చాయని భయపడకుండా ఒప్పుకోవడం గొప్ప ఫలితాన్ని ఇచ్చింది. సెటిల్డ్ గా చేసిన నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఒకప్పుడు తుపాకీ టికెట్ దొరికితేనే గర్వంగా ట్వీట్ చేసుకున్న ఇతను ఇప్పుడు తన సినిమాకు టికెట్లే దొరకని పరిస్థితుల్లో ఫ్యాన్స్ పెడుతున్న ట్వీట్లు చూసుకుని మురిసిపోతున్నాడు. ఏది ఏమైనా భాషతో సంబంధం లేకుండా అమరన్ ఇంత ప్రేమను దక్కించుకోవడం ఒక కేస్ స్టడీ లాంటిది. మరిన్ని రియల్ హీరో కథలకు స్ఫూర్తినిచ్చేది.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…