ఇప్పుడు ఇండయా మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమా ఏది అంటే.. మరో ఆలోచన లేకుండా పుష్ప-2 అని చెప్పేయొచ్చు. మూడేళ్ల కిందట వచ్చిన పుష్ప-1 పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషనల్ హిట్ అయిన నేపథ్యంతో దీని సీక్వెల్ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.
విడుదలకు నెల రోజుల ముందే రకరకాల కారణాలతో పుష్ప-2 ఆన్ లైన్లో ట్రెండ్ అవుతూ వస్తోంది. ఐతే ఆ కారణాలు నెగెటివ్ కావడం ఒకింత ఆందోళన కలిగించే విషయం. కానీ త్వరలో పుష్ప-2 పాజిటివ్ కారణంతో సోషల్ మీడియాలో ట్రెండ్ కాబోతోంది. ఎందుకంటే ఈ సినిమా ట్రైలర్ రాబోతోంది. ట్రైలర్ రెడీ అవుతున్న విషయాన్ని ఇటీవలే పుష్ప-2 మేకర్స్ ట్విట్టర్లో ఒక పోస్టు ద్వారా వెల్లడించారు. త్వరలోనే అప్డేట్ ఇస్తామన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం పుష్ప-2 ట్రైలర్ లాంచ్కు ముహూర్తం కుదిరింది.
విడుదలకు సరిగ్గా రెండు వారాల క్రితం, అంటే నవంబరు 20న పుష్ప-2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది. సుకుమార్ ఇంకా చత్రీకరణలో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ ట్రైలర్ మాత్రం రెడీ చేసేశారు. కొన్ని రోజుల పాటు ఎడిటింగ్ రూంలో కూర్చుని బెస్ట్ షాట్స్, డైలాగ్స్తో సుకుమార్ ట్రైలర్ను స్ట్రైకింగ్గా తీర్చిదిద్దినట్లు సమాచారం. ఆల్రెడీ ట్రైలర్ లాక్ అయిపోవడంతో వచ్చే రెండు మూడు రోజుల్లో ట్రైలర్ డేట్ అనౌన్స్ చేయబోతున్నారట.
ఇండియాలోని వేర్వేరు నగరాల్లో ఒకేసారి టీజర్ లాంచ్ చేసేలా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయబోతున్నారని.. ట్రైలర్ను అదే సమయంలో థియేటర్లలో కూడా ప్రదర్శిస్తారని సమాచారం. ట్రైలర్ లాంచ్ కంటే ముందే షూట్ అంతా పూర్తి చేయాలని ముందు అనుకున్నారు కానీ.. అది సాధ్యపడేలా లేదు. అప్పటికి మిగిలిన రెండు పాటల చిత్రీకరణ పూర్తవుతుంది. కొంత టాకీ పార్ట్ మిగలొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో కొన్ని రోజులుగా బన్నీ-శ్రీలీల మీద ఐటెం సాంగ్ చిత్రీకరిస్తున్నారు.
This post was last modified on November 11, 2024 10:03 am
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…