గత కొన్ని రోజులుగా టాలీవుడ్లో ఎక్కడ చూసినా ‘పుష్ప-2’ గురించే చర్చ. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండగా.. ఎవ్వరూ ఊహించని విధంగా బ్యాగ్రౌండ్ స్కోర్ బాధ్యతల నుంచి దేవిశ్రీని తప్పించి ఆ పనిని వేరే సంగీత దర్శకులకు అప్పగిస్తున్నట్లుగా సమాచారం బయటికి రావడంతో అందరూ షాకైపోయారు. ఐతే ఇదంతా అనధికారిక సమాచారమే తప్ప.. టీం నుంచి ఎవ్వరూ దీని గురించి మాట్లాడింది లేదు.
ఈ వార్తలను ఖండించడం లేదంటే మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనని భావించాలి. ఐతే దేవి స్థానంలో బీజీఎం బాధ్యతలు ఎవరు తీసుకున్నారనే విషయంలో స్పష్టత కొరవడింది. కొందరేమో తమన్కు ఆ పని అప్పగించారని అంటుంటే.. ఇంకొందరేమో తనతో పాటు అజనీష్ లోక్నాథ్, సామ్ సీఎస్ కూడా రేసులో ఉన్నారని.. ఎవరికి వాళ్లు వేర్వేరుగా పని చేస్తున్నారని, ఎవరి ఔట్ పుట్ బాగుంటే వాళ్లది తీసుకుంటారని కూడా ఓ ప్రచారం నడుస్తోంది.
ఐతే మిగతా వాళ్ల సంగతేమో కానీ.. తమన్ మాత్రం ‘పుష్ప-2’ కోసం పని చేస్తున్న మాట నిజమే అని తేలిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా తమనే కన్ఫమ్ చేశాడు. తాజాగా హైదరాబాద్లో జరిగిన గాయకుడు కార్తీక్ మ్యూజికల్ కన్సర్ట్లో తమన్ పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా తమన్ ‘పుష్ప-2’ గురించి రెండు ముక్కలు మాట్లాడాడు. ‘‘We have pushpa-2. Waiting‘‘ అనేసి వేరే టాపిక్లోకి వెళ్లిపోయాడు తమన్. అతను పుష్ప-2 గురించి ప్రస్తావించగానే ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. తమన్ స్వయంగా పుష్ప-2కు పని చేస్తున్నట్లు వెల్లడించడంతో దేవిశ్రీని బ్యాగ్రౌండ్ స్కోర్ బాధ్యతల నుంచి తప్పించారనే భావించవచ్చు.
ఐతే తమన్ విషయంలో దేవిశ్రీ అభిమానులు మాత్రం చాాలా ఆగ్రహంతోనే ఉన్నారు. ఒక సినిమాకు వేర్వేరు సంగీత దర్శకులు పాటలు ఇవ్వడం, బ్యాగ్రౌండ్ స్కోర్ మరొకరితో చేయించడం గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు తమన్. పెళ్లి ఒకరితో చేసి శోభనం ఇంకొకరితో చేయడంతో దీన్ని పోల్చిన తమన్.. ఇప్పుడు దేవి సంగీతం అందిస్తున్న సినిమాకు నేపథ్య సంగీతం అడిగితే ఎలా చేస్తున్నాడని అతణ్ని ప్రశ్నిస్తున్నారు.
This post was last modified on November 10, 2024 5:46 pm
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…
అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…
వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…
కొన్నేళ్ల ముందు నందమూరి తారకరత్న ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండెపోటుకు గురి కావడం, కొన్ని రోజుల పాటు…