భారతీయుడు 2 రూపంలో అవమానం, ట్రోలింగ్ చవిచూడాల్సి వచ్చిన దర్శకుడు శంకర్ కు గేమ్ ఛేంజర్ వల్ల క్రమంగా తగ్గుతోంది. నిర్మాణంలో విపరీతమైన ఆలస్యం జరిగినప్పటికీ విడుదల తేదీ దగ్గర పడే కొద్దీ మెగా ఫ్యాన్స్ దీన్ని సొంతం చేసుకోవడం మొదలుపెట్టారు.
నిన్న వచ్చిన టీజర్ పట్ల కొంత మిశ్రమ స్పందన కనిపించినా అత్యధిక శాతం వింటేజ్ శంకర్ ఈజ్ బ్యాక్ అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రాండియర్, విజువల్స్, చిన్న చిన్న డీటెయిల్స్, పెట్టిన ఖర్చు తెరమీద కనిపించడం, మూడు షేడ్స్ లో రామ్ చరణ్ ని చూపించడం లాంటి పాజిటివ్ అంశాలు జనాలకు కనెక్ట్ అయ్యాయి.
నెక్స్ట్ శంకర్ ని నమ్మి ఏ నిర్మాతైనా వందల కోట్లు పెట్టాలంటే గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ కావాల్సిందే. దానికోసమే ఆయన రేయింబవళ్లు కష్టపడుతున్నాడు. చెన్నై నుంచి బయటికి రాకుండా ఎడిటింగ్ పనులు దగ్గరుండి చూసుకుంటున్నారు.
డిసెంబర్ మొదటి వారం లోపు తమన్ కు కాపీ ఇస్తే రీ రికార్డింగ్ పనులు మొదలుపెడతాడు. తన నుంచి బెస్ట్ స్కోర్ రాబట్టుకోవాలంటే తగినంత సమయం ఇవ్వాలి. హడావిడి చేసి ఒత్తిడి తెస్తే క్వాలిటీ తేడా కొట్టే ప్రమాదం లేకపోలేదు. పైగా తమన్ చాలా బిజీ ఉన్నాడు. గురువైన శంకర్ కోసం ఆల్ టైం బీజీఎమ్ ఇవ్వాలని తహతహలాడుతున్నాడు. దానికి సరైన సహకారం ఇవ్వాలి.
ట్రైలర్ వచ్చాక అనుమానాలన్నీ తీరిపోతాయి కానీ శంకర్ తనలో సత్తా తగ్గలేదని నిరూపించుకోవడానికి ఇంత కన్నా మంచి ఛాన్స్ దొరకదు. మూడు వందల కోట్ల బడ్జెట్ పెట్టినా సరే రికవరీ విషయంలో దిల్ రాజు ధీమాగా ఉండటానికి కారణం కంటెంట్ మీద నమ్మకమే.
ఫాంటసీ, మాఫియా, విఎఫెక్స్ లేకుండా ఒక పొలిటికల్ థ్రిల్లర్ ని హ్యాండిల్ చేశారు కనక అన్ని వర్గాల ప్రేక్షకులను చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. తమిళ వెర్షన్ ని సైతం పెద్ద స్థాయిలో విడుదల చేసేందుకు చూస్తున్నారు కానీ ఒకవేళ అజిత్ కనక సంక్రాంతి బరిలో ఉంటే పోటీ పరంగా ఇబ్బందులు తప్పవు. చూడాలి మరి.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రముఖ ప్రవచ కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను పాఠ్యాంశాలుగా ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి…
ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…
ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…