భారతీయుడు 2 రూపంలో అవమానం, ట్రోలింగ్ చవిచూడాల్సి వచ్చిన దర్శకుడు శంకర్ కు గేమ్ ఛేంజర్ వల్ల క్రమంగా తగ్గుతోంది. నిర్మాణంలో విపరీతమైన ఆలస్యం జరిగినప్పటికీ విడుదల తేదీ దగ్గర పడే కొద్దీ మెగా ఫ్యాన్స్ దీన్ని సొంతం చేసుకోవడం మొదలుపెట్టారు.
నిన్న వచ్చిన టీజర్ పట్ల కొంత మిశ్రమ స్పందన కనిపించినా అత్యధిక శాతం వింటేజ్ శంకర్ ఈజ్ బ్యాక్ అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రాండియర్, విజువల్స్, చిన్న చిన్న డీటెయిల్స్, పెట్టిన ఖర్చు తెరమీద కనిపించడం, మూడు షేడ్స్ లో రామ్ చరణ్ ని చూపించడం లాంటి పాజిటివ్ అంశాలు జనాలకు కనెక్ట్ అయ్యాయి.
నెక్స్ట్ శంకర్ ని నమ్మి ఏ నిర్మాతైనా వందల కోట్లు పెట్టాలంటే గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ కావాల్సిందే. దానికోసమే ఆయన రేయింబవళ్లు కష్టపడుతున్నాడు. చెన్నై నుంచి బయటికి రాకుండా ఎడిటింగ్ పనులు దగ్గరుండి చూసుకుంటున్నారు.
డిసెంబర్ మొదటి వారం లోపు తమన్ కు కాపీ ఇస్తే రీ రికార్డింగ్ పనులు మొదలుపెడతాడు. తన నుంచి బెస్ట్ స్కోర్ రాబట్టుకోవాలంటే తగినంత సమయం ఇవ్వాలి. హడావిడి చేసి ఒత్తిడి తెస్తే క్వాలిటీ తేడా కొట్టే ప్రమాదం లేకపోలేదు. పైగా తమన్ చాలా బిజీ ఉన్నాడు. గురువైన శంకర్ కోసం ఆల్ టైం బీజీఎమ్ ఇవ్వాలని తహతహలాడుతున్నాడు. దానికి సరైన సహకారం ఇవ్వాలి.
ట్రైలర్ వచ్చాక అనుమానాలన్నీ తీరిపోతాయి కానీ శంకర్ తనలో సత్తా తగ్గలేదని నిరూపించుకోవడానికి ఇంత కన్నా మంచి ఛాన్స్ దొరకదు. మూడు వందల కోట్ల బడ్జెట్ పెట్టినా సరే రికవరీ విషయంలో దిల్ రాజు ధీమాగా ఉండటానికి కారణం కంటెంట్ మీద నమ్మకమే.
ఫాంటసీ, మాఫియా, విఎఫెక్స్ లేకుండా ఒక పొలిటికల్ థ్రిల్లర్ ని హ్యాండిల్ చేశారు కనక అన్ని వర్గాల ప్రేక్షకులను చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. తమిళ వెర్షన్ ని సైతం పెద్ద స్థాయిలో విడుదల చేసేందుకు చూస్తున్నారు కానీ ఒకవేళ అజిత్ కనక సంక్రాంతి బరిలో ఉంటే పోటీ పరంగా ఇబ్బందులు తప్పవు. చూడాలి మరి.
This post was last modified on November 10, 2024 5:48 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…
ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…