Movie News

ఢిల్లీ గణేష్ అందుకే ప్రత్యేకం

ప్రముఖ కోలీవుడ్ నటుడు ఢిల్లీ గణేష్ నిన్న రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు అనారోగ్యం కారణంగా కన్ను మూయడం సినీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగులో చేసిన స్ట్రెయిట్ సినిమాలు తక్కువే అయినప్పటికీ అనువాద చిత్రాల ద్వారా ఈయన మనకు బాగా సూపరించితం. గణేష్ ప్రత్యేకత తెలియాలంటే కొంచెం గతం తెలుసుకోవాలి. ఈ విలక్షణ నటుడి అసలు పేరు గణేషన్. ఇండస్ట్రీకి రాకముందు పది సంవత్సరాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పని చేశారు. ఢిల్లీలో ఉండే దక్షిణ భారత నాటక సభలో కీలక సభ్యుడిగా ఉండేవారు. తొలి అవకాశం ఇచ్చిన బాలచందర్ ఢిల్లీని ఇంటిపేరుగా మార్చారు. 

1976లో పట్టిణ ప్రవేశంతో గణేష్ పరిశ్రమలో అడుగుపెట్టారు. ఎంగమ్మ మహారాణి (1980) లో హీరోగా నటించారు కానీ ఆడలేదు. కమల్ హాసన్ తో స్నేహం మొదలయ్యాక మంచి వేషాలు వచ్చి క్రమంగా మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు రావడం మొదలైంది. నాయకుడులో దాదాపు సినిమా మొత్తం హీరో పక్కన కనిపించేది ఢిల్లీ గణేష్ ఒక్కరే. ఆ తర్వాత మైఖేల్ మదన కామరాజు, తెనాలి, భామనే సత్యభామనే లాంటి ఎన్నో చిత్రాల్లో మెప్పించారు. విచిత్ర సోదరులులో విలన్ గా నటించింది కమల్ ప్రోత్సాహం వల్లే. 1994లో అప్పటి జయలలిత ప్రభుత్వం కలైమామణి అవార్డుతో ఢిల్లీ గణేష్ ప్రతిభను గుర్తించింది. 

తమిళంలోని అగ్రి హీరోలందరి సినిమాల్లోని నటించిన ఢిల్లీ గణేష్ టీవీ సీరియల్స్ లోనూ విస్తృతంగా కనిపించేవారు. టాలీవుడ్ ఎంట్రీ నాగార్జున జైత్రయాత్ర ద్వారా చేశారు కానీ తర్వాత డేట్ల సమస్య వల్ల ఆఫర్లు వచ్చినా సరే తెలుగు దర్శకులకు నో చెప్పేవారు. చాలా గ్యాప్ తర్వాత నాయుడమ్మ, పున్నమినాగులో చేశారు. 80 సంవత్సరాల వయసులోనూ ఢిల్లీ గణేష్ నటనే ప్రాణంగా బ్రతికారు. ఈ ఏడాది వచ్చిన భారతీయుడు 2, బాక్ అరణ్మయి 4, విశాల్ రత్నంలో కీలక పాత్రలు చేశారు. ఇంత సుదీర్ఘమైన ప్రయాణం ఉంది కాబట్టి భాషతో సంబంధం లేకుండా ఢిల్లీ గణేష్ ప్రేక్షకులకు మధ్యతరగతి తండ్రిగా గుర్తుండిపోయారు. 

This post was last modified on November 10, 2024 12:17 pm

Share

Recent Posts

పార్ల‌మెంటు డీలిమిటేష‌న్‌పై కాంగ్రెస్ భయం దేనికి?

దేశ‌వ్యాప్తంగా 543 పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న అంశంపై కాంగ్రెస్ పార్టీ మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌ను వ‌చ్చే 25 ఏళ్ల…

34 minutes ago

బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్‌… `ప‌ర్స‌న‌లైజ్` అవుతున్న పార్టీలు!

రెండు జాతీయ పార్టీలు.. బీజేపీ, కాంగ్రెస్‌లో గ‌తానికి భిన్న‌మైన `వ్య‌క్తిపూజ` సాగుతోందా?.. అంటే ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఇందిర‌మ్మ హ‌యాంలో…

2 hours ago

టీడీపీకి ఓట్ల `ప్రాజెక్టులు`… త‌మ్ముళ్లు హ్యాపీ.. !

కీల‌క‌మైన రెండు సాగు, తాగునీటి ప్రాజెక్టుల‌కు సీఎం చంద్ర‌బాబు శ్రీకారం చుట్టారు. నిజానికి ఇవి ఏళ్ల త‌ర‌బ‌డి సాగుతున్న ప్రాజెక్టుల‌నే…

7 hours ago

దేశ‌వ్యాప్తంగా 288 మంది.. ఏపీలో ఐదుగురు.. ఏమ‌య్యారు?

దేశ‌వ్యాప్తంగా 288 మంది నేపాల్ వ‌ర‌ద‌ల్లో గ‌ల్లంత‌య్యార‌ని కేంద్ర ప్ర‌భుత్వం అధికారికంగా ప్ర‌క‌టించింది. మొత్తం 532 మంది ఆచూకీ క‌నిపించ‌కుండా…

9 hours ago

మృతదేహాల నుంచి నగల అపహరణ… నేపాల్‌లో అమానవీయం

నేపాల్ ప్రకృతి విపత్తుతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయి, మరెందరో గల్లంతైన విషాద సమయంలోనూ కొందరి దుర్మార్గం వెలుగుచూసింది. వరదల్లో…

9 hours ago

ఒకే రోజు 10 మంది… మూడు వారాల్లో 60 మంది శిశువుల మృతి

దేశంలో ప్రజారోగ్యం గాలిలో దీపంలా మారింది. ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రైవేటు వైద్యుల దోపిడీ వెరసి సామాన్య ప్రజల ప్రాణాలకు గ్యారంటీ…

9 hours ago