రాజమౌళి సినిమా అంటే కనీసం ఐదొందల కోట్ల బడ్జెట్.. వెయ్యి కోట్లకు పైగా బిజినెస్ జరిగే స్థాయి ఉంది ఇప్పటిదాకా. ఐతే ఆయన చివరి సినిమా ‘ఆర్ఆర్ఆర్’ గ్లోబల్ లెవెల్లో సంచలనం రేపి జేమ్స్ కామెరూన్ లాంటి లెజెండరీ హాలీవుడ్ దర్శకుడిని కూడా అబ్బురపరిచడం, జక్కన్న మార్కెట్ మరింత విస్తరించిన నేపథ్యంలో కొత్త చిత్రం రేంజ్ మారిపోనుందని అందరికీ తెలుసు.
ఐతే ట్రేడ్ పండిట్లు అంచనా వేసిన దాని కంటే మహేష్ బాబుతో రాజమౌళి చేయనున్న సినిమా స్థాయి ఎక్కువ అని తెలుస్తోంది. ఈ సినిమా గురించి తాను విన్న విషయాలను సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆ విషయాలు వింటే వావ్ అనుకోకుండా ఉండలేం.
మహేష్-రాజమౌళి సినిమా బడ్జెట్ కనీసం అంటే కనీసం రూ.1000 కోట్లు ఉంటుందని తమ్మారెడ్డి వెల్లడించారు. అంతర్జాతీయ నటీనటులు, టెక్నీషియన్లను ఈ సినిమా కోసం తీసుకుంటున్నారని.. ప్రపంచవ్యాప్తంగా అనేక భారీ లొకేషన్లలో సినిమాను షూట్ చేయబోతున్నారని.. బడ్జెట్ రూ.1200-1300 కోట్లకు కూడా చేరుకునే అవకాశాలున్నాయని తమ్మారెడ్డి తెలిపారు. ఇక ఈ చిత్రానికి బిజినెస్ కనీసం రూ.2000 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారని.. సినిమా రేంజిని బట్టి అది మూణ్నాలుగు వేల కోట్లకు పెరిగినా పెరగొచ్చని తమ్మారెడ్డి అన్నారు.
తనదైన విజన్తో బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు తీసి భారతీయ సినిమా స్థాయిని రాజమౌళి ఎంతో పెంచేశారని.. ఇప్పుడు మహేష్ బాబుతో తీయబోయే చిత్రంతో ఆయన మరోసారి ఇండియన్ సినిమా స్థాయిని పెంచబోతున్నారని.. ఇండియా గర్వించే స్థాయిలో ఈ సినిమా ఉంటుందని తమ్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఐతే బాహుబలి తర్వాత భారతీయ చిత్రాల బడ్జెట్లు అమాంతం పెరిగిపోవడం ఇబ్బందిగా మారిందని.. రాజమౌళి-మహేష్ సినిమా తర్వాత బడ్జెట్లు ఇంకా పెరిగి సమస్యగా మారుతుందేమో అని ఆయన ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.
This post was last modified on November 9, 2024 6:41 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…