టెక్నాలజీ పెరిగిపోయాక సెట్లో లేదా పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోలో సినిమాకు సంబంధించిన పనులు జరుగుతున్నప్పుడు లీకులను అరికట్టడం పెద్ద సవాల్ గా మారిపోతోంది. సెల్ ఫోన్ తేకుండా కట్టడి చేసినా సరే ఏదో ఒక దొంగచాటు రూపంలో ఫోటోలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి. తాజాగా మంచు విష్ణు కన్నప్పలో ప్రభాస్ లుక్ కు సంబంధించిన పిక్ ఒకటి అనఫీషియల్ గా బయటికి వచ్చింది. చిత్రీకరణ సమయంలో కెమెరా ప్రివ్యూ స్క్రీన్ నుంచి దొంగతనంగా తీసిన వైనం అందులో కనిపించింది. ఫ్రేమ్ రేట్ తదితర వివరాలు అందులో ఉన్నాయి. దీంతో కన్నప్ప టీమ్ వేగంగా స్పందించింది.
ఎనిమిది సంవత్సరాలు స్క్రిప్ట్ కోసం వెచ్చింది రెండేళ్లుగా నిర్మాణం చేస్తున్న తమ ప్యాన్ ఇండియా మూవీలో ప్రభాస్ లుక్ ఇలా లీక్ కావడం బాధించిందని, కారకులని ఎవరైనా కనిపెట్టగలిగితే అయిదు లక్షల బహుమానం ఇస్తామని ప్రకటించింది. పోలీస్ కేసు పెడుతున్నామని ప్రకటించింది. ఇలా చేయడం ద్వారా విఎఫెక్స్ తో పాటు ఎందరో సాంకేతిక నిపుణుల జీవితాలు ప్రభావితం చెందుతాయని మంచు విష్ణు బహిరంగ లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది చూసి ఫ్యాన్స్ అసలు మూలం ఎక్కడుందో కనిపెట్టి చోరులను పట్టిస్తే ప్రభాస్, విష్ణులకు అంతకన్నా గిఫ్ట్ ఏముంటుంది.
కన్నప్పలో చాలా కీలకమైన ప్రభాస్ క్యామియో ఈ రూపంలో అనధికారికంగా బయటికి రావడం క్షమించరాని నేరం. ఒక మంచి సందర్భంలో ఫ్యాన్స్ ఎగ్ జైట్మెంట్ పెంచేలా ఇలాంటి పోస్టర్లు, లుక్స్ వదిలితే బాగుంటుంది తప్ప లీకు రూపంలో రావడం మాత్రం ఖండించాల్సిన తప్పు. విడుదల తేదీ ఇంకా ఖరారు కాని కన్నప్ప సరైన స్లాట్ కోసం ఎదురు చూస్తోంది. డిసెంబర్ లో అవకాశాలు తగ్గిపోతున్న తరుణంలో జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి వైపు చూడాల్సి ఉంటుంది. ఇంకొద్ది వారాల్లో దీనికి సంబంధించి మంచు విష్ణు టీమ్ నిర్ణయం తీసుకోబోతోంది. దానికి అనుగుణంగా ప్రమోషన్లు ఉంటాయి.
This post was last modified on November 9, 2024 2:50 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…