Movie News

కన్నప్ప లీక్ పట్టుకుంటే 5 లక్షలు

టెక్నాలజీ పెరిగిపోయాక సెట్లో లేదా పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోలో సినిమాకు సంబంధించిన పనులు జరుగుతున్నప్పుడు లీకులను అరికట్టడం పెద్ద సవాల్ గా మారిపోతోంది. సెల్ ఫోన్ తేకుండా కట్టడి చేసినా సరే ఏదో ఒక దొంగచాటు రూపంలో ఫోటోలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి. తాజాగా మంచు విష్ణు కన్నప్పలో ప్రభాస్ లుక్ కు సంబంధించిన పిక్ ఒకటి అనఫీషియల్ గా బయటికి వచ్చింది. చిత్రీకరణ సమయంలో కెమెరా ప్రివ్యూ స్క్రీన్ నుంచి దొంగతనంగా తీసిన వైనం అందులో కనిపించింది. ఫ్రేమ్ రేట్ తదితర వివరాలు అందులో ఉన్నాయి. దీంతో కన్నప్ప టీమ్ వేగంగా స్పందించింది.

ఎనిమిది సంవత్సరాలు స్క్రిప్ట్ కోసం వెచ్చింది రెండేళ్లుగా నిర్మాణం చేస్తున్న తమ ప్యాన్ ఇండియా మూవీలో ప్రభాస్ లుక్ ఇలా లీక్ కావడం బాధించిందని, కారకులని ఎవరైనా కనిపెట్టగలిగితే అయిదు లక్షల బహుమానం ఇస్తామని ప్రకటించింది. పోలీస్ కేసు పెడుతున్నామని ప్రకటించింది. ఇలా చేయడం ద్వారా విఎఫెక్స్ తో పాటు ఎందరో సాంకేతిక నిపుణుల జీవితాలు ప్రభావితం చెందుతాయని మంచు విష్ణు బహిరంగ లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది చూసి ఫ్యాన్స్ అసలు మూలం ఎక్కడుందో కనిపెట్టి చోరులను పట్టిస్తే ప్రభాస్, విష్ణులకు అంతకన్నా గిఫ్ట్ ఏముంటుంది.

కన్నప్పలో చాలా కీలకమైన ప్రభాస్ క్యామియో ఈ రూపంలో అనధికారికంగా బయటికి రావడం క్షమించరాని నేరం. ఒక మంచి సందర్భంలో ఫ్యాన్స్ ఎగ్ జైట్మెంట్ పెంచేలా ఇలాంటి పోస్టర్లు, లుక్స్ వదిలితే బాగుంటుంది తప్ప లీకు రూపంలో రావడం మాత్రం ఖండించాల్సిన తప్పు. విడుదల తేదీ ఇంకా ఖరారు కాని కన్నప్ప సరైన స్లాట్ కోసం ఎదురు చూస్తోంది. డిసెంబర్ లో అవకాశాలు తగ్గిపోతున్న తరుణంలో జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి వైపు చూడాల్సి ఉంటుంది. ఇంకొద్ది వారాల్లో దీనికి సంబంధించి మంచు విష్ణు టీమ్ నిర్ణయం తీసుకోబోతోంది. దానికి అనుగుణంగా ప్రమోషన్లు ఉంటాయి.

This post was last modified on November 9, 2024 2:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

9 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

12 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

1 hour ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

2 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

5 hours ago