టెక్నాలజీ పెరిగిపోయాక సెట్లో లేదా పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోలో సినిమాకు సంబంధించిన పనులు జరుగుతున్నప్పుడు లీకులను అరికట్టడం పెద్ద సవాల్ గా మారిపోతోంది. సెల్ ఫోన్ తేకుండా కట్టడి చేసినా సరే ఏదో ఒక దొంగచాటు రూపంలో ఫోటోలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి. తాజాగా మంచు విష్ణు కన్నప్పలో ప్రభాస్ లుక్ కు సంబంధించిన పిక్ ఒకటి అనఫీషియల్ గా బయటికి వచ్చింది. చిత్రీకరణ సమయంలో కెమెరా ప్రివ్యూ స్క్రీన్ నుంచి దొంగతనంగా తీసిన వైనం అందులో కనిపించింది. ఫ్రేమ్ రేట్ తదితర వివరాలు అందులో ఉన్నాయి. దీంతో కన్నప్ప టీమ్ వేగంగా స్పందించింది.
ఎనిమిది సంవత్సరాలు స్క్రిప్ట్ కోసం వెచ్చింది రెండేళ్లుగా నిర్మాణం చేస్తున్న తమ ప్యాన్ ఇండియా మూవీలో ప్రభాస్ లుక్ ఇలా లీక్ కావడం బాధించిందని, కారకులని ఎవరైనా కనిపెట్టగలిగితే అయిదు లక్షల బహుమానం ఇస్తామని ప్రకటించింది. పోలీస్ కేసు పెడుతున్నామని ప్రకటించింది. ఇలా చేయడం ద్వారా విఎఫెక్స్ తో పాటు ఎందరో సాంకేతిక నిపుణుల జీవితాలు ప్రభావితం చెందుతాయని మంచు విష్ణు బహిరంగ లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది చూసి ఫ్యాన్స్ అసలు మూలం ఎక్కడుందో కనిపెట్టి చోరులను పట్టిస్తే ప్రభాస్, విష్ణులకు అంతకన్నా గిఫ్ట్ ఏముంటుంది.
కన్నప్పలో చాలా కీలకమైన ప్రభాస్ క్యామియో ఈ రూపంలో అనధికారికంగా బయటికి రావడం క్షమించరాని నేరం. ఒక మంచి సందర్భంలో ఫ్యాన్స్ ఎగ్ జైట్మెంట్ పెంచేలా ఇలాంటి పోస్టర్లు, లుక్స్ వదిలితే బాగుంటుంది తప్ప లీకు రూపంలో రావడం మాత్రం ఖండించాల్సిన తప్పు. విడుదల తేదీ ఇంకా ఖరారు కాని కన్నప్ప సరైన స్లాట్ కోసం ఎదురు చూస్తోంది. డిసెంబర్ లో అవకాశాలు తగ్గిపోతున్న తరుణంలో జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి వైపు చూడాల్సి ఉంటుంది. ఇంకొద్ది వారాల్లో దీనికి సంబంధించి మంచు విష్ణు టీమ్ నిర్ణయం తీసుకోబోతోంది. దానికి అనుగుణంగా ప్రమోషన్లు ఉంటాయి.
This post was last modified on November 9, 2024 2:50 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…