ఒకప్పుడు తెలుగు సినిమా ఏదైనా హిందీలో డబ్బింగ్ కు వెళ్లాలంటే అదో పెద్ద తతంగం. స్ట్రెయిట్ మూవీ చేసినా బలమైన మార్కెట్ ఏర్పడుతుందన్న గ్యారెంటీ లేదు. అందుకే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఎక్కువ రిస్కులు చేయకుండా 90 దశకం ప్రారంభంలోనే కొన్ని హిట్లు కొట్టి వెనక్కు వచ్చారు. ఇదంతా గతం.
ఇప్పుడు బాలీవుడ్ నే తలదన్నేలా ఆల్ టైం రికార్డు బ్లాక్ బస్టర్స్ సౌత్ నుంచి వస్తున్నాయి. బాహుబలి, కెజిఎఫ్, పుష్ప, కల్కిలను దాటేందుకు నార్త్ మేకర్స్ పడుతున్న తిప్పలు అన్ని ఇన్ని కావు. అయితే టాలీవుడ్ సినిమాలు ఎంత బంగారు గనులో అర్థం కావాలంటే మనీష్ షా మాటలు వినాలి.
గోల్డ్ మైన్స్ ప్రపంచంలోనే పదవ అతి పెద్ద యూట్యూబ్ ఛానల్,. 10 కోట్లకు పైగా చందాదారులతో ఏడాదికి 400 కోట్ల రెవిన్యూ చూపిస్తోంది. ఈయన పట్టిందల్లా బంగారం కావడానికి పునాది వేసింది తెలుగు సినిమాలే. 2004లో రిలీజైన మాస్ ని కేవలం 7 లక్షలకు కొని మేరీ జంగ్ పేరుతో డబ్బింగ్ చేస్తే కోట్ల రూపాయల కనకవర్షం కురిపించింది.
అల్లు అర్జున్ అల్ట్రా డిజాస్టర్ వరుడు కేవలం 10 లక్షలకు కొనుగోలు చేస్తే ఇప్పుడివి 20 కోట్లకు పైగానే విలువ చేస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ శక్తి ఇక్కడ దారుణంగా పోయినా హిందీలో ఆదరణ దక్కించుకుంది. సూర్య డబ్బింగ్ మూవీ అంజాన్ (సికందర్) సైతం డబ్బులు తెచ్చిన సినిమానే.
నార్త్ ప్రేక్షకులు కోరుకునే మాస్ కమర్షియల్ సినిమాలు ఇవ్వడంలో బాలీవుడ్ వెనుకబడటం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని మనీష్ వివరించారు. అనువదించేటప్పుడు చేయించే ఎడిటింగ్ లు చాలా ప్లస్ అవుతాయని అంజాన్, వరుడు నిరూపించాయట.
ముంబైలో ఉండే దర్శకులు రామ్ కామ్ పేరిట కేవలం సిటీ ఆడియన్స్ నే టార్గెట్ చేసుకుంటారని కానీ అసలైన బాక్సాఫీస్ సత్తా మాస్ లో ఉంటుందని అన్నారు. అల వైకుంఠపురములో, జెర్సి డబ్బింగులు చూసేయడం వల్లే రీమేకులు కనీస స్థాయిలో ఆడలేదనే లాజిక్ చెప్పుకొచ్చారు. చూశారుగా తెలుగు సినిమా ఆయనకు బంగారు బాతులా ఎలా మారాయో.
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రముఖ ప్రవచ కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను పాఠ్యాంశాలుగా ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి…
ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…
ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…
ఏపీ అభివృద్ధికి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్…