ఇటీవలే జితేందర్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో రాకేష్ మాట్లాడుతూ సెలబ్రిటీల కోసం ఎంత ప్రయత్నించినా కుదరలేదని, వాళ్ళు వస్తేనే మీడియా అటెన్షన్ చిన్న సినిమాల వైపు ఉంటుందని, దీని మీద దృష్టి పెట్టడం కన్నా ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, డిస్ట్రిబ్యూషన్ ఎగ్జి బిషన్ లాంటి వ్యవహారాల పట్ల శ్రద్ధ పెట్టమని చెప్పిన వీడియో ఇండస్ట్రీలోనే కాదు సగటు ప్రేక్షకుల్లోనూ బాగానే వెళ్ళింది. ట్విట్టర్ లో పలువురు షేర్ చేసుకోవడంతో ఈ టాపిక్ మీద చర్చలు జరిగాయి. ఇదే తరహాలో కిరణ్ అబ్బవరం ‘క’ వేడుకలో ట్రోలింగ్ మీద తన ఆవేదనను నాగచైతన్య ముందు వ్యక్తపరచడం చూశాం.
ఇవాళ దిల్ రాజు క విజయోత్సవ వేడుకలో వీటికి స్పందించారు. ముందుగా రాకేష్ మాటలను ఉటంకిస్తూ ఇక్కడ ఎవరి కోసం ఎవరూ రారని, కంటెంట్ తో రుజువు చేసుకుని సక్సెస్ కొట్టాకే మాట్లాడాలి తప్పించి, రాలేదని కంప్లయింట్ చేయడం వల్ల లాభం లేదని హితవు పలికారు. ట్రోలింగ్ గురించి కిరణ్ అన్న మాటలు చూశానని, ఒకప్పుడు యాభై ఏళ్ళ క్రితం ఒక ఊరికే పరిమితమైన పుకార్లు వెక్కరింపులు ఇప్పుడు టెక్నాలజీ వల్ల ప్రపంచమంతా విస్తరించాయి తప్ప పెద్దగా మార్పేమి లేదని అన్నారు. ఇకపై అలా బాధపడుతూ మాట్లాడకుండా ‘క’ లాగా బ్లాక్ బస్టర్స్ కొట్టి నిరూపించుకోవాలని కిరణ్ కు సలహా ఇచ్చారు.
ఇవి చెప్పడానికే ‘క’ సక్సెస్ మీట్ కు వచ్చానని దిల్ రాజు చెప్పడం కొసమెరుపు. నిజానికి ఇలాంటి చొరవ తీసుకోవడం అవసరం. చిన్న సినిమాలు హైప్ లేక ఓపెనింగ్స్ కరువై బాధ పడుతున్న మాట వాస్తవమే కానీ అంతకన్నా ముందు కథా కథనాల మీద ఎక్కువ దృష్టి పెట్టి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా సినిమాలు తీస్తున్నామా లేదా చూసుకోవాలి. వాటిని కరెక్ట్ గా బ్యాలన్స్ చేసుకోగలిగితే బడ్జెట్, క్యాస్టింగ్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు సూపర్ హిట్ చేసి పెడతారు. నిన్నటిదాకా సోషల్ మీడియాలో టార్గెట్ అయిన కిరణ్ అబ్బవరం ఇప్పుడు ఉత్సాహంగా కనిపించడానికి కారణం క విజయమేగా.
This post was last modified on November 8, 2024 3:39 pm
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…
``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్కటే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. ఎవరు ఏం చేశారన్నది పార్టీ…
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…