కంగువతో వరుణ్ తేజ్ మట్కా క్లాష్ అవుతుంటేనే అవసరమా అంటూ మెగా ఫ్యాన్స్ లోనే సవాలక్ష సందేహాలున్నాయి. కానీ టీమ్ చాలా నమ్మకంగా మెగా ప్రిన్స్ బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని చెబుతోంది. సరే ఇదంటే అంతో ఇంతో ఇమేజ్, మార్కెట్ ఉన్న హీరో కాబట్టి ఏమో అనుకోవచ్చు. కానీ అశోక్ గల్లా ఇంకా ప్రేక్షకుల్లో సరిగా రిజిస్టర్ కాలేదు. డెబ్యూ మూవీ హీరో సోసోగా ఆడింది. చాలా మంది మర్చిపోయారు. ఇప్పుడు రెండో సినిమా దేవకీనందన వాసుదేవ. నవంబర్ 14 కంగువ, మట్కాతో పాటుగా థియేటర్లలో అడుగు పెడుతోంది. ప్రమోషన్లు కూడా క్రమంగా పెంచుకుంటూ పోతున్నారు.
కథ ఇచ్చింది ప్రశాంత్ వర్మ. సో స్టోరీ పరంగా అనుమానం అక్కర్లేదు. దర్శకత్వం వహించింది అర్జున్ జంధ్యాల. ఈయన బోయపాటి శీను శిష్యుడు. ఇంతకు ముందు కార్తికేయతో గుణ 369 చేశాడు. కాన్సెప్ట్ బాగానే ఉన్నా నా పేరు శివ తరహా ట్రీట్ మెంట్ వల్ల రొటీన్ అనిపించి జనం నో అనేశారు. ఇప్పుడు దేవకీనందన వాసుదేవతో మరోసారి తన టాలెంట్ చూపించుకునే పనిలో ఉన్నాడు. ఫాంటసీ ఎలిమెంట్ తో పాటు కుటుంబం మొత్తం చూసే అంశాలు, మాస్ మెచ్చుకునే విషయాలు బోలెడు ఉంటాయని నటీనటులు ఊరిస్తున్నారు కానీ అసలు వాసుదేవ ధైర్యం కంటెంటా లేక మరొకటా అంతుచిక్కడం లేదు.
కొద్దిరోజుల క్రితం మహేష్ బాబు కొన్ని సెకండ్ల పాటు చిన్న క్యామియో చేశాడనే ప్రచారం జరిగింది దీని గురించే. ఇది నిజం కాదని అశోక్ తర్వాత క్లారిటీ ఇచ్చాడు. ఇది బజ్ కోసమే చేశారనే కామెంట్లున్నాయి కానీ ఒకరకంగా ఈ పబ్లిసిటీ బాగానే పని చేసి ఈ సినిమా ఒకటుందని తెలిసేలా చేసింది. ప్రశాంత్ వర్మ బ్రాండ్ ని బాగా వాడుకుంటున్న టీమ్ ఇంత ధీమాగా కంగువతో తలపడటం చూస్తుంటే మ్యాటరేదో బలంగానే ఉన్నట్టుండి. ఒకవేళ మేనల్లుడి కోసం మహేష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కొస్తే హైప్ ఇంకా పెరుగుతుంది. కానీ ఛాన్స్ తక్కువే. మానస వారణాసి హీరోయిన్ గా నటించగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు.
This post was last modified on November 8, 2024 12:18 pm
టాలెంట్, రూపం రెండూ ఉన్న నటుడు ఆది పినిశెట్టి. మొదట హీరోగా పరిచయమైనా సరైనోడులో విలన్ గా మెప్పించాక ఒక్కసారిగా…
ఇప్పుడు పాడటం లేదు కానీ ఇరవై సంవత్సరాల క్రితం తెలుగు సంగీతంలో పాప్ మ్యూజిక్ అనే ఒరవడి తేవడంలో గాయని…
ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కొనసాగుతోంది. దీనికి డెడ్లైన్ను మళ్లీ…
సంగీత దర్శకుడు తమన్ అఖండ 2 కోసం ఇచ్చిన సంగీతం మీద మిశ్రమ స్పందనే దక్కింది. ఆడియో శివ భక్తులకు…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…