టాలీవుడ్లో కొందరు దర్శకులు టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు. తమ ఆలోచనలను సరిగ్గా అర్థం చేసుకుని ఔట్ పుట్ ఇచ్చే టెక్నీషియన్లతోనే పని చేస్తుంటారు. రాజమౌళి, సుకుమార్ ఈ కోవకే చెందుతారు. వీళ్లిద్దరూ ఒక సెట్ ఆఫ్ టెక్నీషియన్లతోనే ఎక్కువ పని చేశారు. కెరీర్లో ఒక్కసారి కూడా ఈ ఇద్దరూ సంగీత దర్శకులను మార్చలేదు.
రాజమౌళి సినిమా అంటే కీరవాణే సంగీతం అందించాలి. సుకుమార్ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ ఫిక్స్. కీరవాణి ఒక దశలో రిటైర్మెంట్ తీసుకుంటాననడంతో రాజమౌళి వేరే ఆప్షన్ చూసుకుంటాడేమో అనిపించింది. కానీ ఆయన ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని జక్కన్నతో కలిసి సాగిపోతున్నాడు. ఇక సుకుమార్ విషయానికి వస్తే.. దేవిశ్రీ ఫామ్ కొంచెం దెబ్బ తిన్నాక కూడా తనతోనే సాగుతూ వచ్చాడు. ‘రంగస్థలం’ టైంలో దేవి జోరు కొంచెం తగ్గింది. కానీ అతడినే కొనసాగించాడు. తనూ మంచి మ్యూజిక్ ఇచ్చాడు.
‘పుష్ప’కు కూడా వీరి బంధం కొనసాగింది. మ్యూజిక్ విషయంలో మంచి అప్లాజే వచ్చింది. ఐతే పుష్ప-2 దగ్గరికి వచ్చేసరికి ఇద్దరి మధ్య సింక్ కుదరట్లేదని తెలుస్తోంది. దేవి ఇచ్చిన బీజీఎం నచ్చక వేరే సంగీత దర్శకుల వైపు సుకుమార్ చూస్తున్నాడన్న వార్త టాలీవుడ్లో దావానలంలా వ్యాపించింది. ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే చర్చ.
గతంలో త్రివిక్రమ్ సహా పలువురు దర్శకులకు దేవి మీద మంచి గురి ఉండేది. కానీ ఒక దశ దాటాక తన సంగీతంలో వాడి తగ్గడంతో ఒక్కొక్కరుగా అతణ్ని పక్కన పెట్టేశారు. కానీ సుకుమార్ మాత్రం ఒకప్పుడు తన సినిమాలకు అద్భుతమైన సంగీతం అందించి వాటి విజయంలో ముఖ్య పాత్ర పోషించిన దేవిని కొనసాగిస్తూ వచ్చాడు.
దేవిని కష్టపెట్టి, విసిగించి అయినా మంచి మ్యూజిక్ చేయించుకుంటూ వచ్చాడు. కానీ ఇప్పుడు సుకుమార్ కూడా దేవి మీద నమ్మకం కోల్పోయాడంటే తన సంగీతం ఏ స్థాయికి పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. గత కొన్నేళ్లలో దేవి స్థాయికి తగని సినిమాలు చాలానే వచ్చాయి.
కానీ ఇప్పుడు సుకుమార్ నమ్మకం కోల్పోయి విడుదల ముంగిట బీజీఎం కోసం ఆయన వేరే సంగీత దర్శకుల వైపు చూసే పరిస్థితి వచ్చిందంటే దేవికి ఇది మామూలు డ్యామేజ్ కాదు. దీన్ని అతనెలా తీసుకుంటాడు.. సుక్కుతో మున్ముందు తన ప్రయాణం ఉంటుందా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీకి జనసేనతో…
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…