జాన్వీ కపూర్… కెరీర్ పరంగా తల్లి శ్రీదేవీ వారసత్వాన్ని మాత్రమే కాకుండా పాటు ఆచారాలను భక్తిని కూడా కంటిన్యూ చేస్తోంది. ఇక బాలీవుడ్ లో మొన్నటివరకు చాలా బిజీగా ఉన్న ఆమె ఇప్పుడు టాలీవుడ్ వాతావరణంకు మరింత దగ్గరవుతోంది. రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేసిన దేవర చిత్రం కమర్షియల్ గా హిట్ అయ్యింది.
ఆమె చేసిన తంగం పాత్ర ఎలా ఉన్నా కూడా తెలుగు జనాలకు మాత్రం జాన్వీ దగ్గరవుతోంది. ఇక రామ్ చరణ్ సినిమాకు హీరోయిన్గా ఎంపికైన జాన్వీ కపూర్ ప్రస్తుతం హైదరాబాద్లోనే ఎక్కువగా ఉంటూ షూటింగ్లో పాల్గొంటోంది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC16 సినిమా షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ పరిసరాల్లో జరుగుతోంది.
అయితే సినిమా షూటింగ్లో తీరిక దొరికినప్పుడల్లా జాన్వీ కపూర్ హైదరాబాద్ సిటీలోని గుళ్లను సందర్శింస్తోంది. ఈరోజు హైదరాబాద్ అమీర్ పేట దగ్గరలోని మధురానగర్ ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేసింది. గురువారం (నవంబర్ 07) న ఆ ఆలయాన్ని సందర్శించి, సుమారు అరగంట పాటు పూజలు చేసిన జాన్వీకి అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు.
జాన్వీ రాకతో ఆలయం వద్ద అభిమానుల జనం భారీగా గుమికూడారు, ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జాన్వీ ప్రస్తుతం టాలీవుడ్ బిజీ అయ్యేలా అడుగులు వేస్తోంది. త్వరలోనే ఆమె మరికొన్ని మీడియం రేంజ్ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందట. ఇక లిస్టులో నాగచైతన్య, నాని ప్రాజెక్టులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆ ప్రాజెక్టులపై మరింత క్లారిటీ రానుంది.
This post was last modified on November 7, 2024 2:08 pm
వాహనదారులకు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ట్రాఫిక్ రూల్స్కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ..…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…