జాన్వీ కపూర్… కెరీర్ పరంగా తల్లి శ్రీదేవీ వారసత్వాన్ని మాత్రమే కాకుండా పాటు ఆచారాలను భక్తిని కూడా కంటిన్యూ చేస్తోంది. ఇక బాలీవుడ్ లో మొన్నటివరకు చాలా బిజీగా ఉన్న ఆమె ఇప్పుడు టాలీవుడ్ వాతావరణంకు మరింత దగ్గరవుతోంది. రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేసిన దేవర చిత్రం కమర్షియల్ గా హిట్ అయ్యింది.
ఆమె చేసిన తంగం పాత్ర ఎలా ఉన్నా కూడా తెలుగు జనాలకు మాత్రం జాన్వీ దగ్గరవుతోంది. ఇక రామ్ చరణ్ సినిమాకు హీరోయిన్గా ఎంపికైన జాన్వీ కపూర్ ప్రస్తుతం హైదరాబాద్లోనే ఎక్కువగా ఉంటూ షూటింగ్లో పాల్గొంటోంది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC16 సినిమా షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ పరిసరాల్లో జరుగుతోంది.
అయితే సినిమా షూటింగ్లో తీరిక దొరికినప్పుడల్లా జాన్వీ కపూర్ హైదరాబాద్ సిటీలోని గుళ్లను సందర్శింస్తోంది. ఈరోజు హైదరాబాద్ అమీర్ పేట దగ్గరలోని మధురానగర్ ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేసింది. గురువారం (నవంబర్ 07) న ఆ ఆలయాన్ని సందర్శించి, సుమారు అరగంట పాటు పూజలు చేసిన జాన్వీకి అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు.
జాన్వీ రాకతో ఆలయం వద్ద అభిమానుల జనం భారీగా గుమికూడారు, ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జాన్వీ ప్రస్తుతం టాలీవుడ్ బిజీ అయ్యేలా అడుగులు వేస్తోంది. త్వరలోనే ఆమె మరికొన్ని మీడియం రేంజ్ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందట. ఇక లిస్టులో నాగచైతన్య, నాని ప్రాజెక్టులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆ ప్రాజెక్టులపై మరింత క్లారిటీ రానుంది.
This post was last modified on November 7, 2024 2:08 pm
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకు చూసింది ఒక లెక్క.. ఇక నుంచి మరో…
ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారిన 'డీజే సౌండ్' వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. తాజాగా అనంతపురంలో నిర్వహించిన వినాయక నిమజ్జన…
ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమా.. ది ప్యారడైజ్. క్వాలిటీ సినిమాలతో పెద్ద స్టార్గా…
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడు అనే బ్రాండ్ నుంచి బయట పడి స్వంతంగా ఇమేజ్ సృష్టించుకునేందుకు కష్టపడుతున్న ఆనంద్…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హుడేనంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ విషయాన్ని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్…