జాన్వీ కపూర్… కెరీర్ పరంగా తల్లి శ్రీదేవీ వారసత్వాన్ని మాత్రమే కాకుండా పాటు ఆచారాలను భక్తిని కూడా కంటిన్యూ చేస్తోంది. ఇక బాలీవుడ్ లో మొన్నటివరకు చాలా బిజీగా ఉన్న ఆమె ఇప్పుడు టాలీవుడ్ వాతావరణంకు మరింత దగ్గరవుతోంది. రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేసిన దేవర చిత్రం కమర్షియల్ గా హిట్ అయ్యింది.
ఆమె చేసిన తంగం పాత్ర ఎలా ఉన్నా కూడా తెలుగు జనాలకు మాత్రం జాన్వీ దగ్గరవుతోంది. ఇక రామ్ చరణ్ సినిమాకు హీరోయిన్గా ఎంపికైన జాన్వీ కపూర్ ప్రస్తుతం హైదరాబాద్లోనే ఎక్కువగా ఉంటూ షూటింగ్లో పాల్గొంటోంది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC16 సినిమా షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ పరిసరాల్లో జరుగుతోంది.
అయితే సినిమా షూటింగ్లో తీరిక దొరికినప్పుడల్లా జాన్వీ కపూర్ హైదరాబాద్ సిటీలోని గుళ్లను సందర్శింస్తోంది. ఈరోజు హైదరాబాద్ అమీర్ పేట దగ్గరలోని మధురానగర్ ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేసింది. గురువారం (నవంబర్ 07) న ఆ ఆలయాన్ని సందర్శించి, సుమారు అరగంట పాటు పూజలు చేసిన జాన్వీకి అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు.
జాన్వీ రాకతో ఆలయం వద్ద అభిమానుల జనం భారీగా గుమికూడారు, ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జాన్వీ ప్రస్తుతం టాలీవుడ్ బిజీ అయ్యేలా అడుగులు వేస్తోంది. త్వరలోనే ఆమె మరికొన్ని మీడియం రేంజ్ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందట. ఇక లిస్టులో నాగచైతన్య, నాని ప్రాజెక్టులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆ ప్రాజెక్టులపై మరింత క్లారిటీ రానుంది.
This post was last modified on November 7, 2024 2:08 pm
మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మీద మంచి బజ్ ఉంది. గత కొన్ని సినిమాలు ఎంత ఫ్లాప్ అయినా దీని…
తమిళ సినిమాల్లో నంబర్ వన్ స్థాయిలో ఉంటూ రాజకీయాల వైపు అడుగులేసిన విజయ్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…
మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…
ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…