మొన్నటి ఏడాది విక్రమ్ రూపంలో తిరుగులేని బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుని ఘనమైన కంబ్యాక్ ఇచ్చిన కమల్ హాసన్ ఊహించని స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించడం అభిమానులు మర్చిపోయే విషయం కాదు. అయితే ఇండియన్ 2 మీద గంపెడాశలు పెట్టుకుంటే ఆది దారుణంగా డిజాస్టర్ కావడం జీర్ణించుకోలేకపోయారు. లోకనాయకుడి మార్కెట్ తిరిగి వచ్చేసిందని ఆనంద పడుతున్న సమయంలో దర్శకుడు శంకర్ ఇచ్చిన షాక్ తీవ్ర నష్టాలు తీసుకొచ్చింది. ఇండియన్ 3 ఓటిటిలో నేరుగా వస్తుందనే ప్రచారం నేపథ్యంలో ఫ్యాన్స్ ఆశలన్నీ ధగ్ లైఫ్ మీద ఉన్నాయి. విడుదల కోసం ఎదురు చూస్తున్నారు.
కమల్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 2025 జూన్ 5 థియేటర్లలో అడుగు పెడుతుందని ఒక చిన్న టీజర్ ద్వారా రివీల్ చేశారు. షూటింగ్ పూర్తయిపోయి రెండు నెలలవుతున్నా అంత ఆలస్యంగా విడుదల చేయడం వెనుక ఆంతర్యం ఏమిటో కానీ విక్రమ్ సెంటిమెంట్ కనిపిస్తోంది. రెండేళ్ల క్రితం విక్రమ్ జూన్ 3 వచ్చింది. ఇప్పుడు అదే నెలలో ధగ్ లైఫ్ ని తీసుకొస్తున్నారు. నిజానికి సంక్రాంతి బరిలో ఉంటుందని కోలీవుడ్ ట్రేడ్ ఆశించింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్, విఎఫెక్స్ పనులు చాలా ఉండటంతో హడావిడి పడటం ఇష్టం లేని కమల్ హాసన్ వేసవిలో రావాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ ధగ్ లైఫ్ వెనుక ప్రధాన విశేషం ఒకటుంది. ఆల్ టైం కల్ట్ క్లాసిక్ నాయకుడు తర్వాత కమల్, దర్శకుడు మణిరత్నం చేతులు కలిపింది ఈ సినిమాతోనే. మూడు దశాబ్దాలకు పైగా ఉన్న సుదీర్ఘమైన గ్యాప్ కు తగ్గట్టు బెస్ట్ మూవీ ఇవ్వాలనే ఉద్దేశంతో భారీ బడ్జెట్ తో ధగ్ లైఫ్ తెరకెక్కిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చగా త్రిష హీరోయిన్ గా నటించింది. శింబు ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. రాజ్ కమల్ బ్యానర్ గత చిత్రాలు విక్రమ్, అమరన్ ని తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేసిన శ్రేష్ట్ మూవీస్ (నితిన్ ఫ్యామిలీ) కే దీని హక్కులు దక్కడం దాదాపు ఖరారు. ఇంకా అఫీషియల్ చేయలేదు.
This post was last modified on November 7, 2024 11:49 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…