Movie News

చైతూ-సాయిపల్లవి.. గ్రేట్ ఎస్కేప్

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటైన తండేల్ రిలీజ్ విషయంలో సస్పెన్స్ తొలగిపోయింది. ఈ చిత్రాన్ని క్రిస్మస్, సంక్రాంతి రెండు పండగలకూ కాదని.. ఫిబ్రవరి 7న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సినిమా షూట్ ఇంకా మిగిలి ఉండడం, సంక్రాంతికి పోటీ ఎక్కువగా ఉండడంతో ఈ రెండు సీజన్లనూ వదిలేసి ఫిబ్రవరి 7న రిలీజ్ చేయడానికి నిర్ణయించారు. దీని మీద పెద్ద ప్రెస్ మీట్ పెట్టి టీం వివరణ ఇచ్చింది.

ఈ ప్రెస్ మీట్‌ను చిన్న సైజ్ ఈవెంట్ లాగా చేసింది టీం. వేదిక మీద టీం సభ్యులందరూ మాట్లాడాక.. మీడియా వాళ్లతో క్వశ్చన్-ఆన్సర్ మీట్‌ను కూడా నిర్వహించింది చిత్ర బృందం. ఐతే ఈ కార్యక్రమంలో హీరో నాగచైతన్య, హీరోయిన్ సాయిపల్లవి పాల్గొనకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇందులో నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు.. దర్శకుడు చందూ మొండేటి మాత్రమే పాల్గొన్నారు.

చైతూ, సాయిపల్లవిలను మీరే పంపించేశారా అంటూ ఓ మీడియా ప్రతినిధి.. అల్లు అరవింద్‌ను ప్రశ్నించగా ఆయన నవ్వుతూ అవునని సమాధానం చెప్పారు. దీని మీద ఇంకేమీ మాట్లాడలేదు. ఐతే చైతూ, సాయిపల్లవిలకు ఏదో పని ఉండి వెళ్లిపోయినట్లు కనిపించడం లేదు. ఉద్దేశపూర్వకంగానే వాళ్లిద్దరూ సైడ్ అయిపోయారని తెలుస్తోంది. వీళ్లిద్దరినీ సినిమాయేతర ప్రశ్నలతో మీడియా వాళ్లు ఇబ్బంది పెట్టే అవకాశముండడంతో సినిమా ప్రమోషన్ పక్కకు వెళ్లిపోతుందన్న ఉద్దేశంతోనే పంపించేశారని భావిస్తున్నారు.

చైతూ ఇటీవలే శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. మరోవైపు అక్కినేని కుటుంబం, సమంత గురించి తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఇటీవల జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసింది. ఈ విషయాలపై చైతూను మీడియా వాళ్లు కచ్చితంగా ప్రశ్నించేవాళ్లు. మరోవైపు సాయిపల్లవి గతంలో ఓ ఇంటర్వ్యూలో ఇండియన్, పాకిస్థాన్ ఆర్మీల గురించి చేసిన వ్యాఖ్యలు ఇటీవల సోషల్ మీడియాలో తిరిగాయి. ఆమె సినిమాలను బాయ్‌కాట్ చేయాలంటూ ట్రెండ్స్ చేశారు. ఈ విషయం మీద మీడియా వాళ్లు ప్రశ్నించి ఉండేవాళ్లు. ఈ ఇబ్బందికర ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టమయ్యేది. దానికి అనుబంధంగా ఏం మాట్లాడినా మళ్లీ కాంట్రవర్శీ అయ్యేది. దీని వల్ల సినిమా గురించిన చర్చ పక్కకు వెళ్లిపోయేది. అందుకే అరవింద్ తెలివిగా చైతూ, సాయిపల్లవిలను ముందే పంపించేశారని భావిస్తున్నారు.

Satya

Recent Posts

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

13 minutes ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

3 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

3 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

4 hours ago

చిరు దిగాడు… పంచాయితీ ముగిసింది

తెలుగు టాప్ కొరియోగ్రాఫ‌ర్ల‌యిన జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ ప‌ర‌స్ప‌రం అరుచుకుంటూ ఒక‌రి మీదికి ఒక‌రు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…

4 hours ago

పాజిటివ్ టాక్ ఉన్నా పనవ్వడం లేదా

బాక్సాఫీస్ వద్ద లెనిన్ తప్ప జనాలకు వేరే ఆప్షన్ కనిపించడం లేదు. ఇతర కొత్త సినిమాలు విడుదలైనా వాటి గురించి…

4 hours ago