Movie News

చైతూ-సాయిపల్లవి.. గ్రేట్ ఎస్కేప్

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటైన తండేల్ రిలీజ్ విషయంలో సస్పెన్స్ తొలగిపోయింది. ఈ చిత్రాన్ని క్రిస్మస్, సంక్రాంతి రెండు పండగలకూ కాదని.. ఫిబ్రవరి 7న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సినిమా షూట్ ఇంకా మిగిలి ఉండడం, సంక్రాంతికి పోటీ ఎక్కువగా ఉండడంతో ఈ రెండు సీజన్లనూ వదిలేసి ఫిబ్రవరి 7న రిలీజ్ చేయడానికి నిర్ణయించారు. దీని మీద పెద్ద ప్రెస్ మీట్ పెట్టి టీం వివరణ ఇచ్చింది.

ఈ ప్రెస్ మీట్‌ను చిన్న సైజ్ ఈవెంట్ లాగా చేసింది టీం. వేదిక మీద టీం సభ్యులందరూ మాట్లాడాక.. మీడియా వాళ్లతో క్వశ్చన్-ఆన్సర్ మీట్‌ను కూడా నిర్వహించింది చిత్ర బృందం. ఐతే ఈ కార్యక్రమంలో హీరో నాగచైతన్య, హీరోయిన్ సాయిపల్లవి పాల్గొనకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇందులో నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు.. దర్శకుడు చందూ మొండేటి మాత్రమే పాల్గొన్నారు.

చైతూ, సాయిపల్లవిలను మీరే పంపించేశారా అంటూ ఓ మీడియా ప్రతినిధి.. అల్లు అరవింద్‌ను ప్రశ్నించగా ఆయన నవ్వుతూ అవునని సమాధానం చెప్పారు. దీని మీద ఇంకేమీ మాట్లాడలేదు. ఐతే చైతూ, సాయిపల్లవిలకు ఏదో పని ఉండి వెళ్లిపోయినట్లు కనిపించడం లేదు. ఉద్దేశపూర్వకంగానే వాళ్లిద్దరూ సైడ్ అయిపోయారని తెలుస్తోంది. వీళ్లిద్దరినీ సినిమాయేతర ప్రశ్నలతో మీడియా వాళ్లు ఇబ్బంది పెట్టే అవకాశముండడంతో సినిమా ప్రమోషన్ పక్కకు వెళ్లిపోతుందన్న ఉద్దేశంతోనే పంపించేశారని భావిస్తున్నారు.

చైతూ ఇటీవలే శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. మరోవైపు అక్కినేని కుటుంబం, సమంత గురించి తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఇటీవల జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసింది. ఈ విషయాలపై చైతూను మీడియా వాళ్లు కచ్చితంగా ప్రశ్నించేవాళ్లు. మరోవైపు సాయిపల్లవి గతంలో ఓ ఇంటర్వ్యూలో ఇండియన్, పాకిస్థాన్ ఆర్మీల గురించి చేసిన వ్యాఖ్యలు ఇటీవల సోషల్ మీడియాలో తిరిగాయి. ఆమె సినిమాలను బాయ్‌కాట్ చేయాలంటూ ట్రెండ్స్ చేశారు. ఈ విషయం మీద మీడియా వాళ్లు ప్రశ్నించి ఉండేవాళ్లు. ఈ ఇబ్బందికర ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టమయ్యేది. దానికి అనుబంధంగా ఏం మాట్లాడినా మళ్లీ కాంట్రవర్శీ అయ్యేది. దీని వల్ల సినిమా గురించిన చర్చ పక్కకు వెళ్లిపోయేది. అందుకే అరవింద్ తెలివిగా చైతూ, సాయిపల్లవిలను ముందే పంపించేశారని భావిస్తున్నారు.

This post was last modified on November 6, 2024 2:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

2 hours ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

2 hours ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

3 hours ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

3 hours ago

నో డౌట్‌: కేసీఆర్‌తోనే క‌విత ఢీ!

తెలంగాణ‌లో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. త‌న‌య క‌విత.. నిన్న…

4 hours ago

త‌మిళ‌నాట మైకులు బంద్‌… ఎవ‌రి సత్తా ఎంత‌?

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసింది. ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల మేర‌కు మంగ‌ళ‌వారం సాయంత్రం 5 గంట‌లకే అన్ని పార్టీలు..…

6 hours ago