ఇటీవలే అబుదాబిలో నిర్వహించిన ఐఫా అవార్డుల వేడుకకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ స్టైల్ను అనుకరిస్తూ ఈ వేడుకకు యాంకర్లుగా వ్యవహరించిన రానా దగ్గుబాటి, తేజ సజ్జా తమ మీద తాము జోకులు వేసుకుంటూ ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖుల మీద కూడా పంచులు వేశారు.
ఐతే అందులో కొన్ని కౌంటర్లు ఆయా హీరోల అభిమానులకు నచ్చట్లేదు. సంక్రాంతికి మహేష్ బాబు సినిమా ‘గుంటూరు కారం’ మీద తేజ మూవీ ‘హనుమాన్’ పైచేయి సాధించిన విషయం మీద రానా, తేజ ప్రస్తావిస్తూ సెటైరికల్గా మాట్లాడ్డం మహేష్ ఫ్యాన్స్ను హర్ట్ చేసింది. నిన్నట్నుంచి వాళ్లు వీళ్లిద్దరి మీద సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మహేష్ అభిమానులకు రవితేజ ఫ్యాన్స్ కూడా తోడయ్యారు.
మిస్టర్ బచ్చన్ ఫెయిల్యూర్ గురించి రానా వేసిన పంచ్ మాస్ రాజా అభిమానులను బాధ పెట్టినట్లే కనిపిస్తోంది. దీని గురించి ప్రస్తావిస్తూ ఓ నెటిజన్ పోస్ట్ పెట్టాడు. మనల్ని చూసి నవ్వుకుంటున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. మరో అభిమాని ‘మిస్టర్ బచ్చన్’ దర్శకుడు హరీష్ శంకర్ను ట్యాగ్ చేస్తూ రవితేజతో మరో సినిమా తీసి అభిమానులు కాలర్ ఎగరేసుకునేలా చేయాలని కామెంట్ చేశాడు.
దీనిపై హరీష్ శంకర్ కూడా స్పందించాడు. “ఎన్నో విన్నాను తమ్ముడు. అందులో ఇదోటి. అన్ని రోజులూ ఒకలా ఉండవు. నాకైనా ఎవరికైనా” అంటూ వేదాంత ధోరణిలో రిప్లై ఇచ్చాడు హరీష్. మామూలుగా హరీష్ శంకర్ సోషల్ మీడియాలో మంచి టెంపర్ మీద ఉంటాడు. తన మీద పంచ్ వేస్తే తిరిగి గట్టిగా కౌంటర్ ఇస్తాడు. కానీ ‘మిస్టర్ బచ్చన్’ ఫెయిల్యూర్ తర్వాత ఆయన కొంచెం దూకుడు తగ్గించాడు. ఈ క్రమంలోనే ఇలా వేదాంత ధోరణిలో సమాధానం చెప్పినట్లు కనిపిస్తోంది.
This post was last modified on November 6, 2024 2:20 pm
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…