ఊహించని స్థాయిలో తమిళంతో పాటు తెలుగులోనూ సెన్సేషనల్ హిట్ గా నిలిచిన అమరన్ బాక్సాఫీస్ వద్ద స్టడీగా ఉంది. వీక్ డేస్ లో కొంత నెమ్మదించినా రెండో వీకెండ్ లో మళ్ళీ వసూళ్ల తాకిడి ఖాయమని బయ్యర్లు చెబుతున్నారు. ఇక్కడ పెద్దగా ప్రమోషన్లు చేయకపోయినా, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సరిపెట్టినా టాలీవుడ్ ప్రేక్షకులు సినిమాను ఆదరించిన తీరు అనూహ్యం. లక్కీ భాస్కర్, క లాంటి స్ట్రెయిట్ సినిమాల పోటీని తట్టుకుని ఇంత స్పందన దక్కించుకోవడం ట్రేడ్ సైతం ఊహించలేదు. సాయిపల్లవి నటన, ఎమోషన్స్, మేజర్ సాహసం ఇవన్నీ ఫ్యామిలీ ఆడియన్స్ ని కట్టి పడేస్తున్నాయి.
అయితే చాలామంది మనసులో ఒక సందేహం ఉండిపోయింది. కథ ప్రకారం సాయిపల్లవి పోషించిన ఇందూ పాత్రని క్రిస్టియన్ గా స్పష్టంగా చూపించారు. ఆమె కుటుంబ బ్యాక్ గ్రౌండ్, ఆచార వ్యవహారాలు, చర్చికి వెళ్లడం లాంటివి చాలా ఉన్నాయి. కానీ మేజర్ ముకుంద్ ఏ కులమనేది చూపించలేదు. అంతగా హైలైట్ చేయకపోయినా కనీసం మాట వరసకైనా చెప్పి ఉండాల్సిందనేది కొందరు చేస్తున్న వాదన. దీని గురించి దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి క్లారిటీ ఇచ్చారు. అమరన్ కథను తెరకెక్కించాలని అనుకున్నప్పుడు మేజర్ తల్లితండ్రులు అసలు కుల ప్రస్తావనే వద్దని చెప్పారట.
దేశం కోసం ప్రాణాలు అర్పించిన కొడుకు ఒక ఇండియన్, తమిళుడిగానే ప్రజలు గుర్తించాలి తప్పించి కులం ఆధారంగా కాదని చెప్పడంతో రాజ్ కుమార్ ఆ అంశాన్ని సున్నితంగా హ్యాండిల్ చేశాడు. ఇందు వైపు నుంచి అభ్యంతరం రాకపోవడంతో వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ ని యధాతథంగా చూపించారు. ఇది గొప్ప విషయం. ముకుంద్ వరదరాజన్ దేశభక్తితో పాటు తన అమ్మానాన్నా ఉన్నతాశయాలు కూడా ప్రపంచానికి దీని ద్వారా పరిచయమయ్యాయి. హిందువుగా గుడిలో పెళ్లి చేసుకున్న సీన్ తప్ప ముకుంద్ కులానికి సంబంధించి ఇంకేం చూపించని రాజ్ కుమార్ అన్నమాట నిలబెట్టుకున్నారు.
This post was last modified on November 6, 2024 11:44 am
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…