ఊహించని స్థాయిలో తమిళంతో పాటు తెలుగులోనూ సెన్సేషనల్ హిట్ గా నిలిచిన అమరన్ బాక్సాఫీస్ వద్ద స్టడీగా ఉంది. వీక్ డేస్ లో కొంత నెమ్మదించినా రెండో వీకెండ్ లో మళ్ళీ వసూళ్ల తాకిడి ఖాయమని బయ్యర్లు చెబుతున్నారు. ఇక్కడ పెద్దగా ప్రమోషన్లు చేయకపోయినా, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సరిపెట్టినా టాలీవుడ్ ప్రేక్షకులు సినిమాను ఆదరించిన తీరు అనూహ్యం. లక్కీ భాస్కర్, క లాంటి స్ట్రెయిట్ సినిమాల పోటీని తట్టుకుని ఇంత స్పందన దక్కించుకోవడం ట్రేడ్ సైతం ఊహించలేదు. సాయిపల్లవి నటన, ఎమోషన్స్, మేజర్ సాహసం ఇవన్నీ ఫ్యామిలీ ఆడియన్స్ ని కట్టి పడేస్తున్నాయి.
అయితే చాలామంది మనసులో ఒక సందేహం ఉండిపోయింది. కథ ప్రకారం సాయిపల్లవి పోషించిన ఇందూ పాత్రని క్రిస్టియన్ గా స్పష్టంగా చూపించారు. ఆమె కుటుంబ బ్యాక్ గ్రౌండ్, ఆచార వ్యవహారాలు, చర్చికి వెళ్లడం లాంటివి చాలా ఉన్నాయి. కానీ మేజర్ ముకుంద్ ఏ కులమనేది చూపించలేదు. అంతగా హైలైట్ చేయకపోయినా కనీసం మాట వరసకైనా చెప్పి ఉండాల్సిందనేది కొందరు చేస్తున్న వాదన. దీని గురించి దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి క్లారిటీ ఇచ్చారు. అమరన్ కథను తెరకెక్కించాలని అనుకున్నప్పుడు మేజర్ తల్లితండ్రులు అసలు కుల ప్రస్తావనే వద్దని చెప్పారట.
దేశం కోసం ప్రాణాలు అర్పించిన కొడుకు ఒక ఇండియన్, తమిళుడిగానే ప్రజలు గుర్తించాలి తప్పించి కులం ఆధారంగా కాదని చెప్పడంతో రాజ్ కుమార్ ఆ అంశాన్ని సున్నితంగా హ్యాండిల్ చేశాడు. ఇందు వైపు నుంచి అభ్యంతరం రాకపోవడంతో వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ ని యధాతథంగా చూపించారు. ఇది గొప్ప విషయం. ముకుంద్ వరదరాజన్ దేశభక్తితో పాటు తన అమ్మానాన్నా ఉన్నతాశయాలు కూడా ప్రపంచానికి దీని ద్వారా పరిచయమయ్యాయి. హిందువుగా గుడిలో పెళ్లి చేసుకున్న సీన్ తప్ప ముకుంద్ కులానికి సంబంధించి ఇంకేం చూపించని రాజ్ కుమార్ అన్నమాట నిలబెట్టుకున్నారు.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…