బాలీవుడ్ కాదు ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్నట్టు చెప్పబడుతున్న రామాయణ ఇంకా ఫస్ట్ లుక్ వదలకుండానే విడుదల తేదీలు బ్లాక్ చేసుకుంది. మొదటి భాగం 2026 దీపావళి, రెండో పార్ట్ 2027 దీపావళికి రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. రెండు సంవత్సరాల ముందే ఒక ప్యాన్ ఇండియా మూవీ ఎప్పుడు వస్తుందో అధికారికంగా చెప్పడం బహుశా ఇదే మొదటిసారి కావొచ్చు. ప్రస్తుతం కొంత భాగం ఆల్రెడీ పూర్తి చేసుకున్న ఈ ఇతిహాస గాధకు నితేశ్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. బడ్జెట్ కూడా వెయ్యి కోట్లని అంటున్నారు కానీ ఇంకా స్పష్టత లేదు.
రన్బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్న రామాయణలో యష్ రావణుడిగా నటించడమే కాక నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు. సన్నీ డియోల్ ని హనుమంతుడి పాత్రకు తీసుకుంటే రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖగా చేసిందనే ప్రచారం బలంగా ఉంది. అయితే ఇప్పటిదాకా క్యాస్టింగ్ కు సంబంధించి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ప్రమోషన్లు ఎప్పుడు మొదలుపెట్టాలనే దాన్ని బట్టి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆ మధ్య రన్బీర్, సాయిపల్లవిల లీక్ ఫోటోలు ఆన్లైన్ లో చక్కర్లు కొట్టాయి. టీమ్ అలెర్టయిపోయి తీయించేసింది.
ఆదిపురుష్ మీద వచ్చిన విమర్శలను దృష్టిలో పెట్టుకుని రామాయణ బృందం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. భవిష్యత్తులో ఎవరు తీయాలన్నా ఇంతకన్నా గొప్పగా చేయలేమనే రీతిలో ఉంటుందని నితేశ్ తివారి పలు సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు. అంత ఎగ్జైట్ మెంట్ ఇచ్చింది కాబట్టి యష్ విలన్ గా చేయడంతో పాటు పార్ట్ నర్ అయ్యేందుకు ఒప్పుకున్నాడు. యానిమల్ లాంటి వయొలెంట్ సబ్జెక్టు తర్వాత రన్బీర్ కపూర్ రాముడిగా ఎలా మెప్పిస్తాడనే ఆసక్తి జనంలో లేకపోలేదు.సీతగా సాయిపల్లవి కన్నా బెస్ట్ ఛాయస్ ఆలోచించనక్కర్లేదు. మరి రెండు సంవత్సరాలు రామాయణకి పోటీ వచ్చేదెవరో.
This post was last modified on July 7, 2025 11:25 pm
2026 వేసవి వృథా అయిపోతోందని బయ్యర్ వర్గాలు తెగ ఆందోళన చెందుతున్నాయి. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా యునానిమస్ బ్లాక్…
ఏడాదికి ఒక సినిమా విడుదల చేయడమే మహా కష్టమైపోతున్న ట్రెండ్ లో కేవలం వారం గ్యాప్ లో రెండు రిలీజులు…
టీడీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు పలు జాగ్రత్తలు చెప్పారు. వైసీపీని గొడ్డలి పార్టీగా అభివర్ణించిన ఆయన..…
ఐపీఎస్ అధికారిగా సుదీర్ఘ కాలం పాటు తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లోనే విధులు నిర్వర్తించిన సీనియర్ పోలీసు అధికారి సీవీ…
కేరళ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ కలిసి నటించడం అంటే కేవలం మలయాళ అభిమానులకే కాదు…
కండల వీరుడు సల్మాన్ ఖాన్, దర్శకుడు వంశీ పైడిపల్లి కలయికలో నిర్మాత దిల్ రాజు తీస్తున్న భారీ చిత్రం ఇటీవలే…