Movie News

రెండు పండుగలు ‘రామాయణ’ తీసుకుంది

బాలీవుడ్ కాదు ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్నట్టు చెప్పబడుతున్న రామాయణ ఇంకా ఫస్ట్ లుక్ వదలకుండానే విడుదల తేదీలు బ్లాక్ చేసుకుంది. మొదటి భాగం 2026 దీపావళి, రెండో పార్ట్ 2027 దీపావళికి రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. రెండు సంవత్సరాల ముందే ఒక ప్యాన్ ఇండియా మూవీ ఎప్పుడు వస్తుందో అధికారికంగా చెప్పడం బహుశా ఇదే మొదటిసారి కావొచ్చు. ప్రస్తుతం కొంత భాగం ఆల్రెడీ పూర్తి చేసుకున్న ఈ ఇతిహాస గాధకు నితేశ్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. బడ్జెట్ కూడా వెయ్యి కోట్లని అంటున్నారు కానీ ఇంకా స్పష్టత లేదు.

రన్బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్న రామాయణలో యష్ రావణుడిగా నటించడమే కాక నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు. సన్నీ డియోల్ ని హనుమంతుడి పాత్రకు తీసుకుంటే రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖగా చేసిందనే ప్రచారం బలంగా ఉంది. అయితే ఇప్పటిదాకా క్యాస్టింగ్ కు సంబంధించి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ప్రమోషన్లు ఎప్పుడు మొదలుపెట్టాలనే దాన్ని బట్టి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆ మధ్య రన్బీర్, సాయిపల్లవిల లీక్ ఫోటోలు ఆన్లైన్ లో చక్కర్లు కొట్టాయి. టీమ్ అలెర్టయిపోయి తీయించేసింది.

ఆదిపురుష్ మీద వచ్చిన విమర్శలను దృష్టిలో పెట్టుకుని రామాయణ బృందం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. భవిష్యత్తులో ఎవరు తీయాలన్నా ఇంతకన్నా గొప్పగా చేయలేమనే రీతిలో ఉంటుందని నితేశ్ తివారి పలు సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు. అంత ఎగ్జైట్ మెంట్ ఇచ్చింది కాబట్టి యష్ విలన్ గా చేయడంతో పాటు పార్ట్ నర్ అయ్యేందుకు ఒప్పుకున్నాడు. యానిమల్ లాంటి వయొలెంట్ సబ్జెక్టు తర్వాత రన్బీర్ కపూర్ రాముడిగా ఎలా మెప్పిస్తాడనే ఆసక్తి జనంలో లేకపోలేదు.సీతగా సాయిపల్లవి కన్నా బెస్ట్ ఛాయస్ ఆలోచించనక్కర్లేదు. మరి రెండు సంవత్సరాలు రామాయణకి పోటీ వచ్చేదెవరో.

This post was last modified on July 7, 2025 11:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

33 minutes ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

2 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

2 hours ago

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

4 hours ago

చైతూ వివాహ వార్షికోత్సవం… దర్శకుడి పోస్టు వైరల్

ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌‌గా పెళ్లి చేసుకుంది ఈ…

4 hours ago

కోహ్లీ… 2,462 రోజుల సెంటిమెంట్ బ్రేక్

విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…

4 hours ago