న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శైలేష్ కొలను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హిట్ 3 ది థర్డ్ కేస్ షూటింగ్ ప్రస్తుతం ఒక అరుదైన లొకేషన్ లో జరుగుతోంది. అందులో విశేషం ఏంటో దాని గురించి తెలుసుకుంటే అర్థమవుతుంది. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ జిల్లాకు 80 కిలోమీటర్ల దూరంలో సంభార్ ఉప్పు సరస్సు ఉంది. ఇది భారతదేశంలోనే అతి పెద్ద లోతట్టు ఉప్పు సరస్సు. మొత్తం ఆరు నదుల నీరు దీంట్లో వచ్చి చేరుతుంది. మంథా, రూపన్ గడ్, ఖరీ, ఖండేలా, మొడ్తా, సమోద్ వాటి పేర్లు. సంభార్ పరివాహక ప్రాంతం 5700 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంటుంది. సరస్సు చుట్టుకొలత 96 కిలోమీటర్లు.
మరో విశేషం ఏంటంటే వేసవిలో 45 డిగ్రీలు ఉండే వాతావరణం శీతాకాలంలో 5 కంటే తక్కువకు పడిపోతుంది. అంటే అక్కడి చలిని తట్టుకోవడం అంత సులభం కాదు. ఇలాంటి ప్రాంతంలో హిట్ 3 ఏం చేస్తుందంటే సస్పెన్స్ అంటోంది టీమ్. శైలేష్ కొలను హిట్ సిరీస్ లోని మొదటి రెండు భాగాలూ తక్కువ బడ్జెట్ లో తీశాడు. అది కూడా హైదరాబాద్, వైజాగ్ లాంటి లొకేషన్లలో పూర్తి చేశాడు. బయటికి వెళ్లే ప్రసక్తే రాలేదు. కానీ హిట్ 3 విషయంలో అలా రాజీపడటం లేదు. సబ్జెక్టు పరంగా డిమాండ్ మేరకు అరుదైన ప్రాంతాలకు వెళ్తున్నారు. నిర్మాతగానూ ఉన్న నాని దేంట్లోనూ కాంప్రమైజ్ కావడం లేదు.
వేగంగా పూర్తి చేసుకునే లక్ష్యంతో పరుగులు పెడుతున్న హిట్ 3 తర్వాత నాని శ్రీకాంత్ ఓదెల ప్యాన్ ఇండియా మూవీ కోసం రెడీ అవుతున్నాడు. దసరాని మించిన మాస్, యాక్షన్ ఎలిమెంట్స్ ఈ రెండు సినిమాల్లో ఉంటాయని నాని సరిపోదా శనివారం ప్రమోషన్ ఇంటర్వ్యూలలో చెప్పడం గుర్తేగా. దానికి అనుగుణంగానే పెద్ద ఎత్తున ఇవి నిర్మాణం జరుపుకుంటున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ రిలీజ్ కు సిద్ధపడుతున్న హిట్ 3 ది థర్డ్ కేస్ ఏదైనా అనూహ్యంగా పోటీకి దిగితే తప్ప డేట్ మార్చుకునే ఉద్దేశంలో లేదు. సైంధవ్ ఫలితం పట్ల కసిగా ఉన్న శైలేష్ కొలను ఈసారి బ్లాక్ బస్టర్ కోసం బాగా కష్టపడుతున్నారు.
This post was last modified on November 6, 2024 2:21 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…