న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శైలేష్ కొలను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హిట్ 3 ది థర్డ్ కేస్ షూటింగ్ ప్రస్తుతం ఒక అరుదైన లొకేషన్ లో జరుగుతోంది. అందులో విశేషం ఏంటో దాని గురించి తెలుసుకుంటే అర్థమవుతుంది. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ జిల్లాకు 80 కిలోమీటర్ల దూరంలో సంభార్ ఉప్పు సరస్సు ఉంది. ఇది భారతదేశంలోనే అతి పెద్ద లోతట్టు ఉప్పు సరస్సు. మొత్తం ఆరు నదుల నీరు దీంట్లో వచ్చి చేరుతుంది. మంథా, రూపన్ గడ్, ఖరీ, ఖండేలా, మొడ్తా, సమోద్ వాటి పేర్లు. సంభార్ పరివాహక ప్రాంతం 5700 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంటుంది. సరస్సు చుట్టుకొలత 96 కిలోమీటర్లు.
మరో విశేషం ఏంటంటే వేసవిలో 45 డిగ్రీలు ఉండే వాతావరణం శీతాకాలంలో 5 కంటే తక్కువకు పడిపోతుంది. అంటే అక్కడి చలిని తట్టుకోవడం అంత సులభం కాదు. ఇలాంటి ప్రాంతంలో హిట్ 3 ఏం చేస్తుందంటే సస్పెన్స్ అంటోంది టీమ్. శైలేష్ కొలను హిట్ సిరీస్ లోని మొదటి రెండు భాగాలూ తక్కువ బడ్జెట్ లో తీశాడు. అది కూడా హైదరాబాద్, వైజాగ్ లాంటి లొకేషన్లలో పూర్తి చేశాడు. బయటికి వెళ్లే ప్రసక్తే రాలేదు. కానీ హిట్ 3 విషయంలో అలా రాజీపడటం లేదు. సబ్జెక్టు పరంగా డిమాండ్ మేరకు అరుదైన ప్రాంతాలకు వెళ్తున్నారు. నిర్మాతగానూ ఉన్న నాని దేంట్లోనూ కాంప్రమైజ్ కావడం లేదు.
వేగంగా పూర్తి చేసుకునే లక్ష్యంతో పరుగులు పెడుతున్న హిట్ 3 తర్వాత నాని శ్రీకాంత్ ఓదెల ప్యాన్ ఇండియా మూవీ కోసం రెడీ అవుతున్నాడు. దసరాని మించిన మాస్, యాక్షన్ ఎలిమెంట్స్ ఈ రెండు సినిమాల్లో ఉంటాయని నాని సరిపోదా శనివారం ప్రమోషన్ ఇంటర్వ్యూలలో చెప్పడం గుర్తేగా. దానికి అనుగుణంగానే పెద్ద ఎత్తున ఇవి నిర్మాణం జరుపుకుంటున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ రిలీజ్ కు సిద్ధపడుతున్న హిట్ 3 ది థర్డ్ కేస్ ఏదైనా అనూహ్యంగా పోటీకి దిగితే తప్ప డేట్ మార్చుకునే ఉద్దేశంలో లేదు. సైంధవ్ ఫలితం పట్ల కసిగా ఉన్న శైలేష్ కొలను ఈసారి బ్లాక్ బస్టర్ కోసం బాగా కష్టపడుతున్నారు.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…