ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో చిత్రాలతో లోకేష్ కనకరాజ్ ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో తెలిసిందే. అతడి వల్లే సినిమాటిక్ యూనివర్శ్ అనే ట్రెండ్ పాపులర్ అయింది. ‘లియో’ సినిమా రిలీజైనపుడు ‘ఎల్సీయూ’ గురించి ఎంత చర్చ జరిగిందో తెలిసిందే. కానీ ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పుడు లోకేష్ నుంచి ‘కూలీ’ సినిమా రాబోతోంది.
సూపర్ స్టార్ రజినీకాంత్ ఇందులో హీరోగా నటించడంతో సినిమాపై మామూలు అంచనాలు లేవు. పైగా అక్కినేని నాగార్జున, ఉపేంద్ర లాంటి వేరే ఇండస్ట్రీల స్టార్లు ఇందులో ప్రత్యేక పాత్రలు పోషిస్తుండడంతో హైప్ ఇంకా పెరిగింది. వీరికి తోడు ఆమిర్ ఖాన్ సైతం ఈ చిత్రంలో స్పెషల్ రోల్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. కానీ దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు.
ఓ ఇంటర్వ్యూలో లోకేష్ కనకరాజ్ను ‘కూలీ’లో ఆమిర్ క్యామియో గురించి అడిగితే.. సూటిగా సమాధానం చెప్పలేదు. సినిమాకు సంబంధించి ఏ అప్డేట్ అయినా అధికారికంగా ప్రొడక్షన్ హౌస్ నుంచే రావాలని.. తాను రివీల్ చేయలేనని అతను చెప్పాడు. ఐతే వేరే రాష్ట్రం లేదా దేశానికి చెందిన ఒక స్పెషల్ వ్యక్తి ఈ చిత్రంలో నటిస్తుండొచ్చు అంటూ ఆమిర్ క్యామియో గురించి చెప్పకనే చెప్పాడు లోకేష్.
ఇక ‘కూలీ’ సినిమాలో ఇంత మంది పెద్ద నటులు నటించడం గురించి మాట్లాడుతూ.. ఇదేదో స్టార్లందరినీ తీసుకొచ్చి క్యామియోలు చేసి మసిబూసి మారేడుకాయను చేసే టైపు సినిమా కాదని.. ప్రతి ఒక్కరి పాత్రలూ కథకు అనుగుణంగానే ఉంటాయని.. ప్రాపర్ స్టోరీ ఉన్న సినిమా ఇదని లోకేష్ తెలిపాడు. ‘లియో’ సినిమా సెకండాఫ్ విషయంలో తన అంచనా తప్పిందని.. ఆ సినిమా నుంచి పాఠాలు నేర్చుకుని ‘కూలీ’ తీస్తున్నానని.. ఇది తన సినిమాటిక్ యూనివర్శ్లో భాగం కాదని.. స్టాండ్ అలోన్ ఫిలిం అని లోకేష్ క్లారిటీ ఇచ్చాడు.
This post was last modified on November 5, 2024 4:05 pm
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…