ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో చిత్రాలతో లోకేష్ కనకరాజ్ ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో తెలిసిందే. అతడి వల్లే సినిమాటిక్ యూనివర్శ్ అనే ట్రెండ్ పాపులర్ అయింది. ‘లియో’ సినిమా రిలీజైనపుడు ‘ఎల్సీయూ’ గురించి ఎంత చర్చ జరిగిందో తెలిసిందే. కానీ ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పుడు లోకేష్ నుంచి ‘కూలీ’ సినిమా రాబోతోంది.
సూపర్ స్టార్ రజినీకాంత్ ఇందులో హీరోగా నటించడంతో సినిమాపై మామూలు అంచనాలు లేవు. పైగా అక్కినేని నాగార్జున, ఉపేంద్ర లాంటి వేరే ఇండస్ట్రీల స్టార్లు ఇందులో ప్రత్యేక పాత్రలు పోషిస్తుండడంతో హైప్ ఇంకా పెరిగింది. వీరికి తోడు ఆమిర్ ఖాన్ సైతం ఈ చిత్రంలో స్పెషల్ రోల్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. కానీ దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు.
ఓ ఇంటర్వ్యూలో లోకేష్ కనకరాజ్ను ‘కూలీ’లో ఆమిర్ క్యామియో గురించి అడిగితే.. సూటిగా సమాధానం చెప్పలేదు. సినిమాకు సంబంధించి ఏ అప్డేట్ అయినా అధికారికంగా ప్రొడక్షన్ హౌస్ నుంచే రావాలని.. తాను రివీల్ చేయలేనని అతను చెప్పాడు. ఐతే వేరే రాష్ట్రం లేదా దేశానికి చెందిన ఒక స్పెషల్ వ్యక్తి ఈ చిత్రంలో నటిస్తుండొచ్చు అంటూ ఆమిర్ క్యామియో గురించి చెప్పకనే చెప్పాడు లోకేష్.
ఇక ‘కూలీ’ సినిమాలో ఇంత మంది పెద్ద నటులు నటించడం గురించి మాట్లాడుతూ.. ఇదేదో స్టార్లందరినీ తీసుకొచ్చి క్యామియోలు చేసి మసిబూసి మారేడుకాయను చేసే టైపు సినిమా కాదని.. ప్రతి ఒక్కరి పాత్రలూ కథకు అనుగుణంగానే ఉంటాయని.. ప్రాపర్ స్టోరీ ఉన్న సినిమా ఇదని లోకేష్ తెలిపాడు. ‘లియో’ సినిమా సెకండాఫ్ విషయంలో తన అంచనా తప్పిందని.. ఆ సినిమా నుంచి పాఠాలు నేర్చుకుని ‘కూలీ’ తీస్తున్నానని.. ఇది తన సినిమాటిక్ యూనివర్శ్లో భాగం కాదని.. స్టాండ్ అలోన్ ఫిలిం అని లోకేష్ క్లారిటీ ఇచ్చాడు.
This post was last modified on November 5, 2024 4:05 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…