ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో చిత్రాలతో లోకేష్ కనకరాజ్ ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో తెలిసిందే. అతడి వల్లే సినిమాటిక్ యూనివర్శ్ అనే ట్రెండ్ పాపులర్ అయింది. ‘లియో’ సినిమా రిలీజైనపుడు ‘ఎల్సీయూ’ గురించి ఎంత చర్చ జరిగిందో తెలిసిందే. కానీ ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పుడు లోకేష్ నుంచి ‘కూలీ’ సినిమా రాబోతోంది.
సూపర్ స్టార్ రజినీకాంత్ ఇందులో హీరోగా నటించడంతో సినిమాపై మామూలు అంచనాలు లేవు. పైగా అక్కినేని నాగార్జున, ఉపేంద్ర లాంటి వేరే ఇండస్ట్రీల స్టార్లు ఇందులో ప్రత్యేక పాత్రలు పోషిస్తుండడంతో హైప్ ఇంకా పెరిగింది. వీరికి తోడు ఆమిర్ ఖాన్ సైతం ఈ చిత్రంలో స్పెషల్ రోల్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. కానీ దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు.
ఓ ఇంటర్వ్యూలో లోకేష్ కనకరాజ్ను ‘కూలీ’లో ఆమిర్ క్యామియో గురించి అడిగితే.. సూటిగా సమాధానం చెప్పలేదు. సినిమాకు సంబంధించి ఏ అప్డేట్ అయినా అధికారికంగా ప్రొడక్షన్ హౌస్ నుంచే రావాలని.. తాను రివీల్ చేయలేనని అతను చెప్పాడు. ఐతే వేరే రాష్ట్రం లేదా దేశానికి చెందిన ఒక స్పెషల్ వ్యక్తి ఈ చిత్రంలో నటిస్తుండొచ్చు అంటూ ఆమిర్ క్యామియో గురించి చెప్పకనే చెప్పాడు లోకేష్.
ఇక ‘కూలీ’ సినిమాలో ఇంత మంది పెద్ద నటులు నటించడం గురించి మాట్లాడుతూ.. ఇదేదో స్టార్లందరినీ తీసుకొచ్చి క్యామియోలు చేసి మసిబూసి మారేడుకాయను చేసే టైపు సినిమా కాదని.. ప్రతి ఒక్కరి పాత్రలూ కథకు అనుగుణంగానే ఉంటాయని.. ప్రాపర్ స్టోరీ ఉన్న సినిమా ఇదని లోకేష్ తెలిపాడు. ‘లియో’ సినిమా సెకండాఫ్ విషయంలో తన అంచనా తప్పిందని.. ఆ సినిమా నుంచి పాఠాలు నేర్చుకుని ‘కూలీ’ తీస్తున్నానని.. ఇది తన సినిమాటిక్ యూనివర్శ్లో భాగం కాదని.. స్టాండ్ అలోన్ ఫిలిం అని లోకేష్ క్లారిటీ ఇచ్చాడు.
This post was last modified on November 5, 2024 4:05 pm
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…