Movie News

సందీప్ వంగను ఏడిపించిన హీరోలెవరు?

సందీప్ రెడ్డి వంగ.. ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడు. తనతో సినిమా చేయడానికి టాప్ స్టార్లు ఎంతో ఆసక్తితో ఉన్నారు. ప్రభాస్ లాంటి టాప్ స్టార్ తనతో ‘స్పిరిట్’ మూవీ చేయబోతున్నాడు. సందీప్ ఇప్పటిదాకా తీసింది మూడు సినిమాలు, అందులో రెండు సినిమాలు ఒకే కథతో వేర్వేరు భాషల్లో తెరకెక్కాయి. అయినా తన క్రేజ్ మామూలుగా లేదు. తన పేరు మీద వందల కోట్ల బిజినెస్ జరుగుతోందిప్పుడు.

ఇంత క్రేజ్ సంపాదించుకున్న సందీప్.. తొలి చిత్రం రిలీజవడానికి ముందు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ‘అర్జున్ రెడ్డి’ కథతో అతను చాలా ఏళ్ల పాటు ట్రావెల్ చేసి.. దాన్ని సినిమాగా మలచడానికి పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వాటి గురించి సందీప్ మరీ ఎక్కువగా చెప్పుకుంది లేదు. ఐతే తాజాగా స్టార్ రైటర్ కోన వెంకట్.. సందీప్‌తో తనతో పంచుకున్న కష్టాల గురించి ఓ పాడ్ కాస్ట్‌లో మాట్లాడాడు.

‘అర్జున్ రెడ్డి’ కథ మీద సందీప్ ఐదేళ్లు పట్టుబట్టి కూర్చున్నా ఆ సినిమా పట్టాలెక్కలేదని కోన వెంకట్ వెల్లడించాడు. ముందు ఒక హీరోకు ఈ కథ నచ్చి సినిమా చేయడానికి ఆసక్తి చూపించాడని.. తన ఆఫీస్‌లో ఆ కథ మీద వర్క్ చేసే అవకాశం కల్పించాడని కోన తెలిపాడు. ఐతే తనకు పెద్దగా సౌకర్యాలేమీ కల్పించలేదని.. ఒక మూలన ఒక సీట్ ఇచ్చి కథ మీద వర్క్ చేయమన్నాడని.. రోజూ తనకు భోజనం మాత్రం పెట్టేవారని కోన చెప్పాడు. చూద్దాం చేద్దాం అంటూనే ఆ హీరో మూడేళ్లు గడిపేశాడని.. అతడికి సినిమా చేసే ఉద్దేశం లేదని చివరికి అర్థమయ్యాక సందీప్ అక్కడి నుంచి బయటికి వచ్చేశాడని తెలిపాడు.

ఆ తర్వాత ఇంకో హీరో ఆ కథ మీద ఆసక్తి చూపించాడని.. కానీ అతను కూడా రెండేళ్ల పాటు వెనుక తిప్పించుకున్నాడే తప్ప సినిమా చేయలేదని.. ఒక డాక్టర్ అయి ఉండి తన తమ్ముడు పడుతున్న కష్టం చూడలేక చివరికి సందీప్ అన్నయ్యే డబ్బులు పెట్టి సినిమా చేయడానికి ముందుకు వచ్చాడని.. ఆస్తులు అమ్మి సినిమా తీశాడని.. సందీప్ విజన్‌ను నమ్మి విజయ్ దేవరకొండ కూడా సపోర్ట్ చేయడంతో ఆ సినిమా బయటికి వచ్చిందని కోన వెంకట్ ఈ సినిమా వెనుక కథను వివరించాడు.

This post was last modified on November 5, 2024 4:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కాలర్ లాంటి కంటెంట్ ఉంటే చాలు

మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…

10 minutes ago

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…

59 minutes ago

కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…

1 hour ago

పవన్ ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్నారు

అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…

3 hours ago

అక్షయ్ కామెడీ… ఇప్పుడు పండుతుందా?

​బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…

3 hours ago

మార్కెటింగ్ అవసరం లేని కొత్త పాఠం

వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…

4 hours ago