హీరో రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కలయికలో రూపొందిన భారీ ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ ప్రమోషన్లు టీజర్ లాంచ్ తో మొదలుకాబోతున్నాయి. నవంబర్ 9న ఈ ఈవెంట్ ని లక్నోలో ఘనంగా నిర్వహించబోతున్నట్టు సమాచారం. టీమ్ మొత్తం హాజరు కాబోతోంది. మొదటి నేషనల్ ఈవెంట్ కావడంతో ప్రత్యేకంగా డిజైన్ చేశారని తెలిసింది. కియారా అద్వానీ, ఎస్జె సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరాం తదితరులంతా రాబోతున్నారు. ఇప్పటికే జరిగిన విపరీతమైన జాప్యం కారణంగా అంచనాల త్రాసు అటుఇటు తిరుగుతున్న నేపథ్యంలో అందరి కళ్ళు టీజర్ ఎలా ఉండబోతోందనే దాని మీదే ఉన్నాయి.
థియేట్రికల్ గా టీజర్ ని విడుదల చేసే ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు. వాటికి సంబంధించిన వివరాలు ఇంకో రెండు రోజుల్లో వెల్లడి కాబోతున్నాయి. ప్రధాన రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో ఒక్కో ఈవెంట్ చేసేలా దిల్ రాజు టీమ్ సమాయత్తం అవుతోంది. చివరిది తిరుపతిలో చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. ఇంకా రెండు నెలల సమయం ఉంది కాబట్టి దానికి అనుగుణంగా షెడ్యూల్ చేయబోతున్నారు. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సైతం దిల్ రాజు బ్యానరే కావడంతో కార్యక్రమాల పరంగా క్లాష్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎస్విసి టీమ్ మీద ఉంది.
అభిమానులు మాత్రం ప్రమోషన్ స్పీడ్ మరింత పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కౌంట్ డౌన్ పోస్టర్స్ లాంటివి వదలమని కోరుతున్నారు. ఇప్పటిదాకా వచ్చిన రెండు పాటల్లో రా మచ్చా బాగా రీచ్ తెచ్చుకోగా జరగండి జరగండి మీద డాన్స్ పరంగా అంచనాలున్నాయి. మిగిలిన మూడు సాంగ్స్ ని టీజర్ తర్వాత రిలీజ్ చేస్తారు. పొలిటికల్ జానర్ లో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో తమన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. సరిపోదా శనివారం తర్వాత అంతకు మించిన ఇంటెన్స్ క్యారెక్టర్ ఎస్జె సూర్యకు దక్కింది. జనవరి 10 గేమ్ ఛేంజర్ థియేటర్లలో అడుగుపెడతాడు.
This post was last modified on November 5, 2024 11:10 am
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…