Movie News

లక్నోలో ‘గేమ్ ఛేంజర్’ మొదటి ప్రమోషన్

హీరో రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కలయికలో రూపొందిన భారీ ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ ప్రమోషన్లు టీజర్ లాంచ్ తో మొదలుకాబోతున్నాయి. నవంబర్ 9న ఈ ఈవెంట్ ని లక్నోలో ఘనంగా నిర్వహించబోతున్నట్టు సమాచారం. టీమ్ మొత్తం హాజరు కాబోతోంది. మొదటి నేషనల్ ఈవెంట్ కావడంతో ప్రత్యేకంగా డిజైన్ చేశారని తెలిసింది. కియారా అద్వానీ, ఎస్జె సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరాం తదితరులంతా రాబోతున్నారు. ఇప్పటికే జరిగిన విపరీతమైన జాప్యం కారణంగా అంచనాల త్రాసు అటుఇటు తిరుగుతున్న నేపథ్యంలో అందరి కళ్ళు టీజర్ ఎలా ఉండబోతోందనే దాని మీదే ఉన్నాయి.

థియేట్రికల్ గా టీజర్ ని విడుదల చేసే ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు. వాటికి సంబంధించిన వివరాలు ఇంకో రెండు రోజుల్లో వెల్లడి కాబోతున్నాయి. ప్రధాన రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో ఒక్కో ఈవెంట్ చేసేలా దిల్ రాజు టీమ్ సమాయత్తం అవుతోంది. చివరిది తిరుపతిలో చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. ఇంకా రెండు నెలల సమయం ఉంది కాబట్టి దానికి అనుగుణంగా షెడ్యూల్ చేయబోతున్నారు. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సైతం దిల్ రాజు బ్యానరే కావడంతో కార్యక్రమాల పరంగా క్లాష్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎస్విసి టీమ్ మీద ఉంది.

అభిమానులు మాత్రం ప్రమోషన్ స్పీడ్ మరింత పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కౌంట్ డౌన్ పోస్టర్స్ లాంటివి వదలమని కోరుతున్నారు. ఇప్పటిదాకా వచ్చిన రెండు పాటల్లో రా మచ్చా బాగా రీచ్ తెచ్చుకోగా జరగండి జరగండి మీద డాన్స్ పరంగా అంచనాలున్నాయి. మిగిలిన మూడు సాంగ్స్ ని టీజర్ తర్వాత రిలీజ్ చేస్తారు. పొలిటికల్ జానర్ లో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో తమన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. సరిపోదా శనివారం తర్వాత అంతకు మించిన ఇంటెన్స్ క్యారెక్టర్ ఎస్జె సూర్యకు దక్కింది. జనవరి 10 గేమ్ ఛేంజర్ థియేటర్లలో అడుగుపెడతాడు.

Satya

Recent Posts

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

46 minutes ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

3 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

3 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

5 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

7 hours ago

భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…

8 hours ago