కెరీర్ ఆరంభం నుంచి పెద్ద బడ్జెట్లలో స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ.. పెద్ద పెద్ద హీరోయిన్లతో జట్టు కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే వస్తున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. కానీ తన తండ్రి బెల్లంకొండ సురేష్ ఎంత మంచి కాంబినేషన్లు సెట్ చేసినా, ఎన్ని కోట్లు ఖర్చు చేసినా.. ఇంకా కెరీర్ అనుకున్న స్థాయిలో ఊపందుకోలేదు. మధ్యలో కొంచెం గ్యాప్ కూడా వచ్చింది. హిందీలో చేసిన ‘ఛత్రపతి’ రీమేక్ దారుణంగా బోల్తా కొట్టడంతో శ్రీనివాస్ కొంచెం తగ్గాడు. కానీ ఇప్పుడు మళ్లీ వరుసగా సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఆల్రెడీ ‘భీమ్లా నాయక్’ దర్శకుడు సాగర్ చంద్రతో ‘టైసన్ నాయుడు’ అనే యాక్షన్ మూవీ చేస్తున్న శ్రీనివాస్.. తాజాగా ఒక మాస్ మూవీని అనౌన్స్ చేశాడు. ఆ సినిమా పేరు.. భైరవం.
‘నాంది’ చిత్రంతో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే బలమైన ముద్ర వేసిన విజయ్ కనకమేడల ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బేనర్ మీద కేకే రాధాకృష్ణ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పవర్ ఫుల్గా కనిపిస్తున్నాయి. విశేషం ఏంటంటే ఈ చిత్రంలో మంచు మనోజ్, నారా రోహిత్ కూడా ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. ఈ కాంబినేషన్ ఎంతో ఆసక్తి రేకెత్తించేదే. గత కొన్నేళ్లుగా పల్లెటూరి నేపథ్యంలో దేవుడితో ముడిపడ్డ మిస్టరీ సినిమాలు బాాగా ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ ట్రెండును అందిపుచ్చుకుంటూ ‘భైరవం’ టీం కొంచెం పెద్ద స్థాయిలోనే సినిమా చేస్తున్నట్లు కనిపిస్తోంది. శ్రీనివాస్ రగ్డ్ లుక్ ఈ సినిమాకు బాగానే సెట్ అయినట్లు కనిపిస్తోంది. ‘నాంది’ తర్వాత అల్లరి నరేష్తోనే ‘ఉగ్రం’ అనే మరో సినిమా చేశాడు విజయ్ కనకమేడల. కానీ ఆ సినిమా సరిగా ఆడలేదు. తర్వాత గ్యాప్ తీసుకుని ఇప్పుడు ‘భైరవం’తో రాబోతున్నాడు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మరికొందరు పేరున్న టెక్నీషియన్లే పని చేస్తున్నారు.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…