Movie News

ముగ్గురు హీరోలు కలిస్తే రచ్చే

కెరీర్ ఆరంభం నుంచి పెద్ద బడ్జెట్లలో స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ.. పెద్ద పెద్ద హీరోయిన్లతో జట్టు కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే వస్తున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. కానీ తన తండ్రి బెల్లంకొండ సురేష్ ఎంత మంచి కాంబినేషన్లు సెట్ చేసినా, ఎన్ని కోట్లు ఖర్చు చేసినా.. ఇంకా కెరీర్ అనుకున్న స్థాయిలో ఊపందుకోలేదు. మధ్యలో కొంచెం గ్యాప్ కూడా వచ్చింది. హిందీలో చేసిన ‘ఛత్రపతి’ రీమేక్ దారుణంగా బోల్తా కొట్టడంతో శ్రీనివాస్ కొంచెం తగ్గాడు. కానీ ఇప్పుడు మళ్లీ వరుసగా సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఆల్రెడీ ‘భీమ్లా నాయక్’ దర్శకుడు సాగర్ చంద్రతో ‘టైసన్ నాయుడు’ అనే యాక్షన్ మూవీ చేస్తున్న శ్రీనివాస్.. తాజాగా ఒక మాస్ మూవీని అనౌన్స్ చేశాడు. ఆ సినిమా పేరు.. భైరవం.

‘నాంది’ చిత్రంతో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే బలమైన ముద్ర వేసిన విజయ్ కనకమేడల ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బేనర్ మీద కేకే రాధాకృష్ణ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నాయి. విశేషం ఏంటంటే ఈ చిత్రంలో మంచు మనోజ్, నారా రోహిత్ కూడా ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. ఈ కాంబినేషన్ ఎంతో ఆసక్తి రేకెత్తించేదే. గత కొన్నేళ్లుగా పల్లెటూరి నేపథ్యంలో దేవుడితో ముడిపడ్డ మిస్టరీ సినిమాలు బాాగా ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ ట్రెండును అందిపుచ్చుకుంటూ ‘భైరవం’ టీం కొంచెం పెద్ద స్థాయిలోనే సినిమా చేస్తున్నట్లు కనిపిస్తోంది. శ్రీనివాస్ రగ్డ్ లుక్ ఈ సినిమాకు బాగానే సెట్ అయినట్లు కనిపిస్తోంది. ‘నాంది’ తర్వాత అల్లరి నరేష్‌తోనే ‘ఉగ్రం’ అనే మరో సినిమా చేశాడు విజయ్ కనకమేడల. కానీ ఆ సినిమా సరిగా ఆడలేదు. తర్వాత గ్యాప్ తీసుకుని ఇప్పుడు ‘భైరవం’తో రాబోతున్నాడు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మరికొందరు పేరున్న టెక్నీషియన్లే పని చేస్తున్నారు.

Satya

Recent Posts

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

2 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

3 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

5 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

7 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

7 hours ago

పవన్ నోట మరోమారు ‘తెలంగాణ’ మాట

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…

8 hours ago