Movie News

ముగ్గురు హీరోలు కలిస్తే రచ్చే

కెరీర్ ఆరంభం నుంచి పెద్ద బడ్జెట్లలో స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ.. పెద్ద పెద్ద హీరోయిన్లతో జట్టు కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే వస్తున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. కానీ తన తండ్రి బెల్లంకొండ సురేష్ ఎంత మంచి కాంబినేషన్లు సెట్ చేసినా, ఎన్ని కోట్లు ఖర్చు చేసినా.. ఇంకా కెరీర్ అనుకున్న స్థాయిలో ఊపందుకోలేదు. మధ్యలో కొంచెం గ్యాప్ కూడా వచ్చింది. హిందీలో చేసిన ‘ఛత్రపతి’ రీమేక్ దారుణంగా బోల్తా కొట్టడంతో శ్రీనివాస్ కొంచెం తగ్గాడు. కానీ ఇప్పుడు మళ్లీ వరుసగా సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఆల్రెడీ ‘భీమ్లా నాయక్’ దర్శకుడు సాగర్ చంద్రతో ‘టైసన్ నాయుడు’ అనే యాక్షన్ మూవీ చేస్తున్న శ్రీనివాస్.. తాజాగా ఒక మాస్ మూవీని అనౌన్స్ చేశాడు. ఆ సినిమా పేరు.. భైరవం.

‘నాంది’ చిత్రంతో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే బలమైన ముద్ర వేసిన విజయ్ కనకమేడల ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బేనర్ మీద కేకే రాధాకృష్ణ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నాయి. విశేషం ఏంటంటే ఈ చిత్రంలో మంచు మనోజ్, నారా రోహిత్ కూడా ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. ఈ కాంబినేషన్ ఎంతో ఆసక్తి రేకెత్తించేదే. గత కొన్నేళ్లుగా పల్లెటూరి నేపథ్యంలో దేవుడితో ముడిపడ్డ మిస్టరీ సినిమాలు బాాగా ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ ట్రెండును అందిపుచ్చుకుంటూ ‘భైరవం’ టీం కొంచెం పెద్ద స్థాయిలోనే సినిమా చేస్తున్నట్లు కనిపిస్తోంది. శ్రీనివాస్ రగ్డ్ లుక్ ఈ సినిమాకు బాగానే సెట్ అయినట్లు కనిపిస్తోంది. ‘నాంది’ తర్వాత అల్లరి నరేష్‌తోనే ‘ఉగ్రం’ అనే మరో సినిమా చేశాడు విజయ్ కనకమేడల. కానీ ఆ సినిమా సరిగా ఆడలేదు. తర్వాత గ్యాప్ తీసుకుని ఇప్పుడు ‘భైరవం’తో రాబోతున్నాడు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మరికొందరు పేరున్న టెక్నీషియన్లే పని చేస్తున్నారు.

This post was last modified on November 4, 2024 11:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…

5 minutes ago

పవన్ ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్నారు

అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…

1 hour ago

అక్షయ్ కామెడీ… ఇప్పుడు పండుతుందా?

​బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…

2 hours ago

మార్కెటింగ్ అవసరం లేని కొత్త పాఠం

వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…

3 hours ago

తారకరత్న కుటుంబాన్ని పట్టించుకోవట్లేదా?

కొన్నేళ్ల ముందు నందమూరి తారకరత్న ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండెపోటుకు గురి కావడం, కొన్ని రోజుల పాటు…

3 hours ago

వారణాసి హీరోయిన్ విదేశీ రహస్యం

ప్రియాంకా చోప్రా మన ప్రేక్షకులకు కొత్త కాదు. హిందీ సినిమాలు రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళు, రామ్ చరణ్ జంజీర్…

4 hours ago