కెరీర్ ఆరంభం నుంచి పెద్ద బడ్జెట్లలో స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ.. పెద్ద పెద్ద హీరోయిన్లతో జట్టు కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే వస్తున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. కానీ తన తండ్రి బెల్లంకొండ సురేష్ ఎంత మంచి కాంబినేషన్లు సెట్ చేసినా, ఎన్ని కోట్లు ఖర్చు చేసినా.. ఇంకా కెరీర్ అనుకున్న స్థాయిలో ఊపందుకోలేదు. మధ్యలో కొంచెం గ్యాప్ కూడా వచ్చింది. హిందీలో చేసిన ‘ఛత్రపతి’ రీమేక్ దారుణంగా బోల్తా కొట్టడంతో శ్రీనివాస్ కొంచెం తగ్గాడు. కానీ ఇప్పుడు మళ్లీ వరుసగా సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఆల్రెడీ ‘భీమ్లా నాయక్’ దర్శకుడు సాగర్ చంద్రతో ‘టైసన్ నాయుడు’ అనే యాక్షన్ మూవీ చేస్తున్న శ్రీనివాస్.. తాజాగా ఒక మాస్ మూవీని అనౌన్స్ చేశాడు. ఆ సినిమా పేరు.. భైరవం.
‘నాంది’ చిత్రంతో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే బలమైన ముద్ర వేసిన విజయ్ కనకమేడల ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బేనర్ మీద కేకే రాధాకృష్ణ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పవర్ ఫుల్గా కనిపిస్తున్నాయి. విశేషం ఏంటంటే ఈ చిత్రంలో మంచు మనోజ్, నారా రోహిత్ కూడా ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. ఈ కాంబినేషన్ ఎంతో ఆసక్తి రేకెత్తించేదే. గత కొన్నేళ్లుగా పల్లెటూరి నేపథ్యంలో దేవుడితో ముడిపడ్డ మిస్టరీ సినిమాలు బాాగా ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ ట్రెండును అందిపుచ్చుకుంటూ ‘భైరవం’ టీం కొంచెం పెద్ద స్థాయిలోనే సినిమా చేస్తున్నట్లు కనిపిస్తోంది. శ్రీనివాస్ రగ్డ్ లుక్ ఈ సినిమాకు బాగానే సెట్ అయినట్లు కనిపిస్తోంది. ‘నాంది’ తర్వాత అల్లరి నరేష్తోనే ‘ఉగ్రం’ అనే మరో సినిమా చేశాడు విజయ్ కనకమేడల. కానీ ఆ సినిమా సరిగా ఆడలేదు. తర్వాత గ్యాప్ తీసుకుని ఇప్పుడు ‘భైరవం’తో రాబోతున్నాడు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మరికొందరు పేరున్న టెక్నీషియన్లే పని చేస్తున్నారు.
This post was last modified on November 4, 2024 11:00 pm
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…