నాలుగేళ్ల క్రితం 2021లో అల్లుడు అదుర్స్ తర్వాత బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మళ్ళీ తెలుగు సినిమాలో కనిపించలేదు. అనవసరంగా బాలీవుడ్ మార్కెట్ ఉచ్చులో పడి ఛత్రపతి హిందీ రీమేక్ కోసం విలువైన కాలాన్ని వృథా చేసుకున్నాడు కానీ లేదంటే కనీసం రెండు మూడు కొత్త రిలీజులు ఉండేవి. సరే జరిగిందేదో జరిగిపోయింది కానీ వచ్చే ఏడాది నుంచి మాత్రం కుర్రాడు స్పీడ్ పెంచబోతున్నాడు. భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న టైసన్ నాయుడుతో పాటు మరో రెండు ప్యాన్ ఇండియా మూవీస్ చేస్తున్నాడు. అయితే వీటికన్నా ముందు ఒక రీమేక్ సర్ప్రైజ్ సిద్దమవుతోంది.
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ – నారా రోహిత్ – మంచు మనోజ్ కలయికలో రూపొందుతున్న మల్టీస్టారర్ కు ‘భైరవం’ టైటిల్ ని ఖరారు చేస్తూ అధికారిక పోస్టర్ విడుదల చేశారు. రిలీజ్ డేట్ పేర్కొనప్పటికీ సంక్రాంతి లేదా ఫిబ్రవరి వైపు చూస్తున్నారని సమాచారం. కుదిరితే క్రిస్మస్ ఆప్షన్ కూడా పెట్టుకున్నారట. ఈ భైరవం తమిళ సూపర్ హిట్ గరుడన్ రీమేక్. సూరి ప్రధాన పాత్ర పోషించగా కమర్షియల్ గా కోలీవుడ్ లో మంచి సక్సెస్ అందుకుంది. ఇందులో మూడు అంశాలు కీలకంగా ఉంటాయి. స్నేహం, దేవుడి భూముల అన్యాక్రాంతం, మిత్రద్రోహం వీటి చుట్టే దురై సెంథిల్ కుమార్ ఒరిజినల్ వెర్షన్ కథను నడిపారు.
తెలుగు రీమేక్ కు నాంది – ఉగ్రం ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. ఇతర క్యాస్టింగ్, సాంకేతిక వర్గాలు వివరాలు వెల్లడించకుండా చకచకా కానిచ్చేస్తున్నారు. ఇలాంటి నేటివిటీ తెలుగులోనూ వర్కౌట్ అవుతుంది కానీ కొన్ని కీలకమైన మార్పులు అవసరమైన ఈ సబ్జెక్టులో వాటి మీద ఎంత మేరకు పని చేశారో సినిమా చూశాక కానీ క్లారిటీ రాదు. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూరుస్తున్న ఈ విలేజ్ యాక్షన్ డ్రామాలో కీలకమైన నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను మనోజ్ దక్కించుకున్నట్టు టాక్. సో విడుదల పరంగా ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
This post was last modified on November 4, 2024 5:14 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…