Movie News

గుడ్ జోక్….బన్నీ మీద బఘీరా కోపం !

అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తే పనయ్యే రోజులు కావివి. అలా చేయొచ్చనుకోవడమే అసలు కామెడీ. ఇటీవలే కన్నడ, తెలుగుతో పాటు ప్యాన్ ఇండియా భాషల్లో బఘీరా రిలీజైన సంగతి తెలిసిందే. శ్రీమురళి హీరోగా నటించగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా మీద అంతో ఇంతో ఆసక్తి రేగడానికి కారణాలు రెండు. ఒకటి కెజిఎఫ్ – సలార్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కథను అందించడం. మరొకటి హోంబాలే ఫిలిమ్స్ గ్రాండ్ ప్రొడక్షన్. దీంతో సహజంగానే అంచనాలు రేగాయి. అయితే దీపావళి రోజు విడుదలైన బఘీరాకు యునానిమస్ ఫ్లాప్ టాక్ వచ్చింది. రివ్యూలు విషయం లేదంటూ తేల్చి పారేశాయి.

దీంతో సహజంగా మొదటి రోజు ఉన్న స్క్రీన్లు షోలు ఏపీ, తెలంగాణలో గణనీయంగా తగ్గించేశారు. మంచి టాక్ తెచ్చుకున్న క, అమరన్, లక్కీ భాస్కర్ లకు అవసరానికి తగ్గట్టు సర్దుబాటు చేశారు. దీంతో కొందరు శాండల్ వుడ్ ఫ్యాన్స్ కి కోపం వచ్చింది. బఘీరాని ఉద్దేశపూర్వకంగా కిల్ చేశారని, కావాలని వన్ టూ రేటింగ్స్ ఇచ్చి నెగటివ్ గా మార్చారని ఇలా ఏవేవో ఊహించేసుకుని డిసెంబర్ లో వచ్చే పుష్ప 2 మీద ప్రతీకారం తీర్చుకుంటామంటూ సోషల్ మీడియా వేదికగా శపథం చేస్తున్నారు. ఇంతకన్నా జోక్ మరొకటి ఉండదు. బఘీరాలో కంటెంట్ వీకని ఎవరైనా ఒప్పుకుంటారు. దానికింత రాద్ధాంతం అనవసరం.

వాళ్ళ మనసులో ఏమున్నా పుష్ప 2 బజ్ కంట్రోల్ చేయడం అసాధ్యం. అసలే అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. కర్ణాటకలో రికార్డు ఓపెనింగ్స్ తెస్తానని అక్కడి డిస్ట్రిబ్యూటర్ స్టేజి మీద ఆల్రెడీ సవాల్ చేశాడు. అల్లు అర్జున్ కి అక్కడ పెద్ద ఫాలోయింగ్ ఉంది. బయ్యర్లు తాముగా ముందుకొచ్చి పోటీపడి మరీ షోలు వేసుకుంటారు. అసలు దీనికి భయపడే కదా కన్నడనే కాదు ఇతర భాషల్లోనూ పుష్ప 2కి పోటీగా ఎవరూ కొత్త సినిమాలు రిలీజ్ చేయడం లేదు. అయినా బఘీరా బాగోకపోతే అది సినిమా సమస్య కానీ దాన్ని దేనికో ముడిపెడితే ఎలా. ఆ మాటకొస్తే ‘క’కు బెంగళూరులో షోలే సరిగా ఇవ్వలేదు. మరి దానికేం చేయాలో.

This post was last modified on November 4, 2024 4:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

7 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

9 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

1 hour ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

2 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

5 hours ago