హీరోయిన్లకు ఒక్కోసారి కెరీర్ లో స్పీడ్ బ్రేకర్ లాంటి దశ వస్తుంది. అప్పుడు ఎంత బ్లాక్ బస్టర్ సాధించినా అవకాశాలు వెల్లువెత్తవు. ఇస్మార్ట్ శంకర్ లో నటించాక నిధి అగర్వాల్ కు ఇది అనుభవమయ్యింది. తర్వాత రెండు మూడు తమిళ సినిమాల్లో నటించినా పెద్దగా పేరు రాలేదు. అశోక్ గల్లా సరసన హీరో లాంటి పెద్ద బడ్జెట్ చిత్రంలో జోడి కట్టినా లాభం లేకపోయింది. సరే అయిందేదో అయ్యిందని పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టుని ఎగిరి గంతేసి ఒప్పుకుంటే అదేమో షూటింగ్ వాయిదాల వల్ల ఏళ్ళ తరబడి నిర్మాణంలో ఉండిపోయింది. అలాని నిరాశపడే అవసరం పడలేదు.
ప్రభాస్ ది రాజా సాబ్ లో ఆఫర్ మరో మెట్టు ఎక్కించింది. మాళవిక మోహనన్ ఉన్నప్పటికీ నిధి అగర్వాల్ కు సైతం దర్శకుడు మారుతీ ప్రాధాన్యం ఉండేలా పాత్రను డిజైన్ చేయించాడు. కట్ చేస్తే 2025లో ఈ అమ్మడు అతి తక్కువ గ్యాప్ లో ఏకంగా మూడు ప్యాన్ ఇండియా సినిమాల్లో దర్శనం ఇవ్వబోతోంది. హరిహర వీరమల్లు మార్చి 28 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఆపై రెండు వారాలు తిరగడం ఆలస్యం ఏప్రిల్ 10న ది రాజా సాబ్ థియేటర్లకు వచ్చేస్తుంది. ఈ రెండింటికి ప్రధాన భాషలు అన్నింటిలోనూ గ్రాండ్ రిలీజ్ దక్కనుంది. వందల కోట్ల బిజినెస్ చేయబోతున్నారు.
బోనస్ ఏంటంటే తేజ సజ్జ మిరాయ్ స్పెషల్ సాంగ్ లోనూ నిధి అగర్వాల్ తళుక్కున మెరవనుంది. ఇప్పటికే షూట్ అయిపోయిందట. ఇది ఏప్రిల్ 18 ప్రేక్షకుల ముందు రానుంది. అంటే మొత్తం 20 రోజుల నిడివిలో మూడు సినిమాలంటే మాములు విషయం కాదు. రాజా సాబ్, మిరాయ్ రెండు సినిమాల నిర్మాతలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కావడం దీనికి దోహదపడి ఉండొచ్చు. ఇవి కాకుండా నిధి కొత్త కమిట్ మెంట్స్ ఇవ్వలేదు. పవన్, ప్రభాస్ లతో డబుల్ ప్రమోషన్ దక్కుతుందని ఎదురు చూస్తోంది. అదే జరిగితే ఒక్కసారిగా ఆఫర్ల వర్షం కురుస్తుందని ప్రత్యేకంగా వేరే చెప్పాలా.
This post was last modified on November 4, 2024 4:03 pm
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…