Movie News

నిధి అగర్వాల్ మూడు ప్యాన్ ఇండియా బ్లాస్టులు

హీరోయిన్లకు ఒక్కోసారి కెరీర్ లో స్పీడ్ బ్రేకర్ లాంటి దశ వస్తుంది. అప్పుడు ఎంత బ్లాక్ బస్టర్ సాధించినా అవకాశాలు వెల్లువెత్తవు. ఇస్మార్ట్ శంకర్ లో నటించాక నిధి అగర్వాల్ కు ఇది అనుభవమయ్యింది. తర్వాత రెండు మూడు తమిళ సినిమాల్లో నటించినా పెద్దగా పేరు రాలేదు. అశోక్ గల్లా సరసన హీరో లాంటి పెద్ద బడ్జెట్ చిత్రంలో జోడి కట్టినా లాభం లేకపోయింది. సరే అయిందేదో అయ్యిందని పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టుని ఎగిరి గంతేసి ఒప్పుకుంటే అదేమో షూటింగ్ వాయిదాల వల్ల ఏళ్ళ తరబడి నిర్మాణంలో ఉండిపోయింది. అలాని నిరాశపడే అవసరం పడలేదు.

ప్రభాస్ ది రాజా సాబ్ లో ఆఫర్ మరో మెట్టు ఎక్కించింది. మాళవిక మోహనన్ ఉన్నప్పటికీ నిధి అగర్వాల్ కు సైతం దర్శకుడు మారుతీ ప్రాధాన్యం ఉండేలా పాత్రను డిజైన్ చేయించాడు. కట్ చేస్తే 2025లో ఈ అమ్మడు అతి తక్కువ గ్యాప్ లో ఏకంగా మూడు ప్యాన్ ఇండియా సినిమాల్లో దర్శనం ఇవ్వబోతోంది. హరిహర వీరమల్లు మార్చి 28 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఆపై రెండు వారాలు తిరగడం ఆలస్యం ఏప్రిల్ 10న ది రాజా సాబ్ థియేటర్లకు వచ్చేస్తుంది. ఈ రెండింటికి ప్రధాన భాషలు అన్నింటిలోనూ గ్రాండ్ రిలీజ్ దక్కనుంది. వందల కోట్ల బిజినెస్ చేయబోతున్నారు.

బోనస్ ఏంటంటే తేజ సజ్జ మిరాయ్ స్పెషల్ సాంగ్ లోనూ నిధి అగర్వాల్ తళుక్కున మెరవనుంది. ఇప్పటికే షూట్ అయిపోయిందట. ఇది ఏప్రిల్ 18 ప్రేక్షకుల ముందు రానుంది. అంటే మొత్తం 20 రోజుల నిడివిలో మూడు సినిమాలంటే మాములు విషయం కాదు. రాజా సాబ్, మిరాయ్ రెండు సినిమాల నిర్మాతలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కావడం దీనికి దోహదపడి ఉండొచ్చు. ఇవి కాకుండా నిధి కొత్త కమిట్ మెంట్స్ ఇవ్వలేదు. పవన్, ప్రభాస్ లతో డబుల్ ప్రమోషన్ దక్కుతుందని ఎదురు చూస్తోంది. అదే జరిగితే ఒక్కసారిగా ఆఫర్ల వర్షం కురుస్తుందని ప్రత్యేకంగా వేరే చెప్పాలా.

This post was last modified on November 4, 2024 4:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రేమలు బ్యూటీకి సీనియర్ స్టార్ల ఛాన్సులు

గత ఏడాది మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగులోనూ మంచి విజయం నమోదు చేసుకుంది. ఎస్ఎస్ కార్తికేయ తీసుకున్న ప్రత్యేక…

5 hours ago

సునీతా విలియమ్స్ భారత పర్యటన.. ఎప్పుడంటే?

అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భారత్‌కు రానున్నారని సమాచారం. తొమ్మిది నెలల…

6 hours ago

IPL 2025: 13 ఏళ్ల కుర్రాడి ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడు?

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో అందరి దృష్టి ఒక చిన్న కుర్రాడిపై నిలిచింది. కేవలం 13 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లో అడుగుపెడుతున్న…

6 hours ago

DSP విలువ తెలిసినట్టు ఉందే

సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…

7 hours ago

ఆదివారం రిలీజ్ ఎందుకు భాయ్

సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మార్చి 30 వస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని…

7 hours ago

క్షేమంగా తిరిగొచ్చిన సునీత… అమెరికా, భారత్ లో సంబరాలు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుబడిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మంగళవారం సురక్షితంగా భూమిపైకి చేరారు. సునీతతో…

8 hours ago