హీరోయిన్లకు ఒక్కోసారి కెరీర్ లో స్పీడ్ బ్రేకర్ లాంటి దశ వస్తుంది. అప్పుడు ఎంత బ్లాక్ బస్టర్ సాధించినా అవకాశాలు వెల్లువెత్తవు. ఇస్మార్ట్ శంకర్ లో నటించాక నిధి అగర్వాల్ కు ఇది అనుభవమయ్యింది. తర్వాత రెండు మూడు తమిళ సినిమాల్లో నటించినా పెద్దగా పేరు రాలేదు. అశోక్ గల్లా సరసన హీరో లాంటి పెద్ద బడ్జెట్ చిత్రంలో జోడి కట్టినా లాభం లేకపోయింది. సరే అయిందేదో అయ్యిందని పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టుని ఎగిరి గంతేసి ఒప్పుకుంటే అదేమో షూటింగ్ వాయిదాల వల్ల ఏళ్ళ తరబడి నిర్మాణంలో ఉండిపోయింది. అలాని నిరాశపడే అవసరం పడలేదు.
ప్రభాస్ ది రాజా సాబ్ లో ఆఫర్ మరో మెట్టు ఎక్కించింది. మాళవిక మోహనన్ ఉన్నప్పటికీ నిధి అగర్వాల్ కు సైతం దర్శకుడు మారుతీ ప్రాధాన్యం ఉండేలా పాత్రను డిజైన్ చేయించాడు. కట్ చేస్తే 2025లో ఈ అమ్మడు అతి తక్కువ గ్యాప్ లో ఏకంగా మూడు ప్యాన్ ఇండియా సినిమాల్లో దర్శనం ఇవ్వబోతోంది. హరిహర వీరమల్లు మార్చి 28 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఆపై రెండు వారాలు తిరగడం ఆలస్యం ఏప్రిల్ 10న ది రాజా సాబ్ థియేటర్లకు వచ్చేస్తుంది. ఈ రెండింటికి ప్రధాన భాషలు అన్నింటిలోనూ గ్రాండ్ రిలీజ్ దక్కనుంది. వందల కోట్ల బిజినెస్ చేయబోతున్నారు.
బోనస్ ఏంటంటే తేజ సజ్జ మిరాయ్ స్పెషల్ సాంగ్ లోనూ నిధి అగర్వాల్ తళుక్కున మెరవనుంది. ఇప్పటికే షూట్ అయిపోయిందట. ఇది ఏప్రిల్ 18 ప్రేక్షకుల ముందు రానుంది. అంటే మొత్తం 20 రోజుల నిడివిలో మూడు సినిమాలంటే మాములు విషయం కాదు. రాజా సాబ్, మిరాయ్ రెండు సినిమాల నిర్మాతలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కావడం దీనికి దోహదపడి ఉండొచ్చు. ఇవి కాకుండా నిధి కొత్త కమిట్ మెంట్స్ ఇవ్వలేదు. పవన్, ప్రభాస్ లతో డబుల్ ప్రమోషన్ దక్కుతుందని ఎదురు చూస్తోంది. అదే జరిగితే ఒక్కసారిగా ఆఫర్ల వర్షం కురుస్తుందని ప్రత్యేకంగా వేరే చెప్పాలా.
This post was last modified on November 4, 2024 4:03 pm
కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన అనేక మందికి సర్కారు ఏర్పడిన తర్వాత.. నామినేటెడ్ పదవులతో సంతృప్తి కలిగిస్తున్నారు. ఎన్ని…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు వరుసగా కష్టాలు మొదలైపోతున్నాయి. మొన్నటి సార్వత్రిక…
ఏపీ ప్రతిపక్ష పార్టీ(ప్రధాన కాదు) వైసీపీకి తాజాగా భారీ ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2021లో అతి…
కిరణ్ అబ్బవరం ఫ్లాప్ స్ట్రీక్కు బ్రేక్ వేసిన సినిమా.. క. గత ఏడాది దీపావళికి విడుదలైన ఈ చిత్రం సూపర్…
సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే సంస్కృతి పెరిగిపోతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి విషయంలో…
త్రిభాషా విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రచ్చ రాజుకున్న సంగతి తెలిసిందే. జనసేన…