Movie News

నిధి అగర్వాల్ మూడు ప్యాన్ ఇండియా బ్లాస్టులు

హీరోయిన్లకు ఒక్కోసారి కెరీర్ లో స్పీడ్ బ్రేకర్ లాంటి దశ వస్తుంది. అప్పుడు ఎంత బ్లాక్ బస్టర్ సాధించినా అవకాశాలు వెల్లువెత్తవు. ఇస్మార్ట్ శంకర్ లో నటించాక నిధి అగర్వాల్ కు ఇది అనుభవమయ్యింది. తర్వాత రెండు మూడు తమిళ సినిమాల్లో నటించినా పెద్దగా పేరు రాలేదు. అశోక్ గల్లా సరసన హీరో లాంటి పెద్ద బడ్జెట్ చిత్రంలో జోడి కట్టినా లాభం లేకపోయింది. సరే అయిందేదో అయ్యిందని పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టుని ఎగిరి గంతేసి ఒప్పుకుంటే అదేమో షూటింగ్ వాయిదాల వల్ల ఏళ్ళ తరబడి నిర్మాణంలో ఉండిపోయింది. అలాని నిరాశపడే అవసరం పడలేదు.

ప్రభాస్ ది రాజా సాబ్ లో ఆఫర్ మరో మెట్టు ఎక్కించింది. మాళవిక మోహనన్ ఉన్నప్పటికీ నిధి అగర్వాల్ కు సైతం దర్శకుడు మారుతీ ప్రాధాన్యం ఉండేలా పాత్రను డిజైన్ చేయించాడు. కట్ చేస్తే 2025లో ఈ అమ్మడు అతి తక్కువ గ్యాప్ లో ఏకంగా మూడు ప్యాన్ ఇండియా సినిమాల్లో దర్శనం ఇవ్వబోతోంది. హరిహర వీరమల్లు మార్చి 28 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఆపై రెండు వారాలు తిరగడం ఆలస్యం ఏప్రిల్ 10న ది రాజా సాబ్ థియేటర్లకు వచ్చేస్తుంది. ఈ రెండింటికి ప్రధాన భాషలు అన్నింటిలోనూ గ్రాండ్ రిలీజ్ దక్కనుంది. వందల కోట్ల బిజినెస్ చేయబోతున్నారు.

బోనస్ ఏంటంటే తేజ సజ్జ మిరాయ్ స్పెషల్ సాంగ్ లోనూ నిధి అగర్వాల్ తళుక్కున మెరవనుంది. ఇప్పటికే షూట్ అయిపోయిందట. ఇది ఏప్రిల్ 18 ప్రేక్షకుల ముందు రానుంది. అంటే మొత్తం 20 రోజుల నిడివిలో మూడు సినిమాలంటే మాములు విషయం కాదు. రాజా సాబ్, మిరాయ్ రెండు సినిమాల నిర్మాతలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కావడం దీనికి దోహదపడి ఉండొచ్చు. ఇవి కాకుండా నిధి కొత్త కమిట్ మెంట్స్ ఇవ్వలేదు. పవన్, ప్రభాస్ లతో డబుల్ ప్రమోషన్ దక్కుతుందని ఎదురు చూస్తోంది. అదే జరిగితే ఒక్కసారిగా ఆఫర్ల వర్షం కురుస్తుందని ప్రత్యేకంగా వేరే చెప్పాలా.

This post was last modified on November 4, 2024 4:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఓటమి చూడని జట్లతో భారత్ అసలైన ఫైట్

టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశ ముగిసి అసలైన మజా మొదలవ్వబోతోంది. ఈసారి సూపర్ 8 గ్రూపులు ఫైనల్…

1 hour ago

అమీర్ పేటలో భారీ అగ్ని ప్రమాదం.. విద్యార్ధులు సేఫేనా?

హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేట మైత్రీవనం చౌరస్తా వద్ద ఉన్న ఆదిత్య ఎన్‌క్లేవ్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.…

1 hour ago

ఫోన్‌పే ద్వారా లంచాలు.. ఎనిమిది మంది ఇంజనీర్లపై వేటు!

​విద్యుత్ శాఖలో అవినీతి ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. లంచాల వ్యవహారంపై విజిలెన్స్ జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు బయటపడటంతో…

3 hours ago

అన్వేషణ హద్దు దాటేస్తుందా?

నా అన్వేష్.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రతి ఒక్కరికి ఈ పేరు తెలిసే ఉంటుంది...! యూట్యూబర్‌గా అందరికీ సుపరిచితమే.…

3 hours ago

హ‌రీష్‌రావు కంచుకోట‌ను క‌విత బ‌ద్ద‌లు కొట్ట‌గ‌లదా?

బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి.. అంత‌కుమించి మాట‌ల మాంత్రీకుడు.. త‌న్నీరు హ‌రీష్ రావు గురించి చెప్ప‌డానికి ఇవి చాలు.…

3 hours ago

మాఫియా రాజ్యంలో ‘టాక్సిక్’ రక్తపాతం

కెజిఎఫ్ లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న యష్ వచ్చే నెల టాక్సిక్ తో రాబోతున్న…

4 hours ago