కష్టపడితే అందలం ఎక్కించే టాలీవుడ్ పరిశ్రమలో దాన్ని సాధ్యం చేసుకునే వాళ్ళు కొందరే ఉంటారు. సరైన ప్లానింగ్ తో మంచి సినిమాలు చేస్తే ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకుంటారు. దానికి ఉదాహరణగా మొన్నా నిన్నటి స్టార్లలో చిరంజీవి, రవితేజ లాంటి పేర్లు గుర్తొస్తే ఇప్పటి జనరేషన్ లో న్యాచురల్ స్టార్ నాని ఫస్ట్ ఛాయస్ అవుతాడు. బాపు గారి రాధాగోపాళం టీమ్ లో అసిస్టెంట్ గా పని చేసి, అష్టా చెమ్మా లాంటి అంచనాలు లేని చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి ఇప్పుడు దసరా, సరిపోదా శనివారంతో వంద కోట్ల గ్రాసర్లు సాధించే దాకా తను అందుకున్న మైలురాళ్ళు అశేష అభిమానులను సంపాదించిపెట్టాయి.
మనకు నాని ఎలాగో కోలీవుడ్ కు శివ కార్తికేయన్ అలా అయిపోయాడు. ఇటీవలే విడుదలైన అమరన్ కేవలం మూడు రోజులకే వంద కోట్ల గ్రాస్ దాటే స్థాయిలో బ్లాక్ బస్టర్ కావడం చూసి ట్రేడ్ నివ్వెరపోయింది. ఎందుకంటే అతనికి గతంలో ఈ మార్కు చేరుకోవడానికి కనీసం పది రోజులు పట్టేది. కానీ ఇప్పుడు విజయ్, అజిత్ రేంజ్ లో ఇంత వేగంగా రికార్డులు నమోదు చేయడం చూసి ఫ్యాన్స్ చిన్న తలపతి అంటూ కొత్త బిరుదులు ఇచ్చేస్తున్నారు. శివకార్తికేయన్ సైతం యాంకర్, సైడ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభంలో చాలా ఎగుడుదిగుడులు చూసి ఆ స్థాయి నుంచి కమల్ హాసన్ నిర్మాతగా సినిమాలు చేసే రేంజుకు చేరుకున్నాడు.
నాని, శివకార్తికేయన్ ల మధ్య ఉన్న ప్రధాన సారూప్యత కష్టపడే మనస్తత్వం. ఇప్పుడిదే అందలం ఎక్కిస్తోంది. నాని ఇటీవలే సరిపోదా శనివారం రూపంలో ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సాధించగా ఇప్పుడు తన స్నేహితుడు కూడా అమరన్ తో అంతకు మించిన సక్సెస్ అందుకుంటున్నాడు. గత కొన్నేళ్లలో ఒక్క ప్రిన్స్ మాత్రమే శివ కార్తికేయన్ ని నిరాశపరిచింది. డాక్టర్, డాన్. మావీరన్ విజయం సాధించగా అయలన్ కమర్షియల్ గా తమిళనాడులో సక్సెసయ్యింది. ఇప్పుడు అన్నింటిని మించి అమరన్ ఎక్కడికో తీసుకెళ్ళిపోతోంది. ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటికి పిలిచి అభినందించేంత.
This post was last modified on November 4, 2024 12:01 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…