ఇంకో పది రోజుల్లో నవంబర్ 14 విడుదల కాబోతున్న కంగువ మీద ఎన్ని అంచనాలున్నాయో మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఏపీ, తెలంగాణలో సైతం తెల్లవారుఝామున 4 గంటలకే ప్రీమియర్లు వేసేందుకు సిద్ధపడుతున్నారంటే హైప్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నిర్మాత జ్ఞానవేల్ రాజా ఏకంగా రెండు వేల కోట్లు వసూలు చేసే సత్తా దీనికి ఉందని గతంలో స్టేట్ మెంట్ ఇవ్వడం ఎంత వైరలయ్యిందో చూశాం. నార్త్ నుంచి సౌత్ దాకా ఒక రౌండ్ ప్రమోషన్లు పూర్తి చేసిన సూర్య ఇప్పుడు రెండో స్పెల్ కు సిద్ధపడుతున్నాడు. హైదరాబాద్ లో ఒక గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు మరికొన్ని వేడుకలు ప్లాన్ చేస్తున్నారు.
సరే టాక్ ఎలా ఉండబోతున్నా కంగువకు చేతిలో ఇరవై రోజుల సమయం మాత్రమే ఉంటుంది. కారణం డిసెంబర్ 5 పుష్ప 2 ది రూల్ వచ్చేస్తుంది కాబట్టి ఆలోగానే వీలైనంత రాబట్టుకుని లాభాల పంట పండించాలి. అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా మూవీ మీద ఎంత హైప్ ఉందో చూస్తున్నాం. ఇప్పటినుంచే అడ్వాన్స్ బుకింగ్ టికెట్ల కోసం బయ్యర్లకు ఫోన్లు వస్తున్నాయటనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లందరూ కలిసి పుష్ప 2 ది రూల్ కి కనివిని ఎరుగని గ్రాండ్ రిలీజ్ ని రెడీ చేస్తున్నారు. కేరళ, కర్ణాటకలో మతిపోయే ఓపెనింగ్స్ రాబోతున్నాయి.
ఈ నేపథ్యంలో కంగువ బ్రహ్మాండంగా ఉన్నా సరే మూడో వారంలో అడుగు పెట్టే నాటికి ఫైనల్ రన్ కు దగ్గరవ్వాల్సి ఉంటుంది. బ్రేక్ ఈవెన్, లాభాలు వగైరా ఆ గ్యాప్ లోనే జరిగిపోవాలి. సిరుతై శివ దర్శకత్వం వహించిన కంగువలో దిశా పటాని హీరోయిన్ కాగా బాబీ డియోల్ విలన్ గా నటించాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మీద ఇప్పటికే పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఉంది. వందల సంవత్సరాల క్రితం ఒక అడవిలో రెండు జాతుల మధ్య జరిగిన ఆధిపత్య పోరుని బ్యాక్ డ్రాప్ గా తీసుకున్న శివ చివరి ఇరవై నిమిషాల్లో వర్తమానం చూపించబోతున్నాడు. కంగువ 2ని రెండు సంవత్సరాల తర్వాత రిలీజ్ చేస్తారు.
This post was last modified on November 4, 2024 2:51 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…