కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన పాన్ ఇండియా చిత్రం ‘కంగువా’ విడుదలకు ముందు అడ్డంకులు ఎదురవుతున్నాయి. శివ దర్శకత్వంలో యాక్షన్ ఫాంటసీగా తెరకెక్కిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాను పదికి పైగా భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, తాజాగా ఈ విడుదలకు అంబానీ సంస్థ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ అడ్డుపడింది.
స్టూడియో గ్రీన్ సంస్థ ఇదివరకే అప్పుగా తీసుకున్న మొత్తం చెల్లించకపోవడంతో, మద్రాసు హైకోర్టును ఆశ్రయించి సినిమా విడుదల నిలిపివేయాలని రిలయన్స్ సంస్థ కోరింది. కోలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం, స్టూడియో గ్రీన్ అధినేత కేఈ జ్ఞానవేల్ రాజా టెడ్డీ-2, ఎక్స్ మీట్స్ ఓయ్, తంగలాన్ వంటి చిత్రాలను నిర్మించేందుకు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ నుండి సుమారు రూ.99 కోట్లు రుణం తీసుకున్నారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అందులో సుమారు రూ.45 కోట్లు మాత్రమే తిరిగి చెల్లించారు.
బ్యాలెన్స్ రూ.55 కోట్లు ఇంకా చెల్లించాల్సి ఉందట, ఇప్పటికే ఇవ్వాల్సిన ఆ డబ్బు అందకపోవడంతో రిలయన్స్ సంస్థ ఈ చర్యకు దిగింది. ఈ నేపథ్యలో ‘కంగువా’ థియేట్రికల్ విడుదలను, అలాగే తంగలాన్ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయకుండా తాత్కాలిక ఆదేశాలు ఇవ్వాలని కోర్టును రిలయన్స్ కోరింది. ఈ కేసు జస్టిస్ కుమరేష్ బాబు ఎదుట విచారణకు రాగా, స్టూడియో గ్రీన్ నవంబర్ 7వ తేదీ వరకు సమయం కోరింది. అంతవరకు ‘కంగువా’ విడుదలను నిలిపి ఉంచాలని విన్నవించింది. కోర్టు నవంబర్ 7వ తేదీ వరకు విచారణను వాయిదా వేసింది.
This post was last modified on November 2, 2024 4:36 pm
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…
అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…
రోటీన్ కు తగ్గట్లు వ్యవహరిస్తే కిక్ ఏముంటుంది? వినూత్న ఆలోచనలకు వేదికగా హైదరాబాద్ మహానగరం సాగుతోంది. ఇందులో భాగంగా సరికొత్త…
వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…
నిన్న జరిగిన బ్యాండ్ మేళం సక్సెస్ మీట్ లో ఎక్కువ శాతం నటీనటులు, దర్శకుడు ఒక పాయింట్ మీద ఫిర్యాదు…