మొన్న విపరీతమైన పోటీలో విడుదలైన అమరన్ తమిళంలో భారీ వసూళ్లు సాధించడంలో ఆశ్చర్యం లేదు కానీ తెలుగులోనూ అదీ టైటిల్ మార్చకుండా రిలీజ్ చేసినా ఇంత స్థాయిలో స్పందన రావడం చూసి నిర్మాతలు సైతం షాక్ అవుతున్నారు. మొదటి రోజే మార్నింగ్ షోలకు అడ్వాన్స్ ఫుల్స్ పడటం చూసి ట్రేడ్ ఆశ్చర్యపోయింది. మూడు రోజులకే బ్రేక్ ఈవెన్ అయిపోతుందనే క్లారిటీ వచ్చేసింది. కాంపిటీషన్ లో క, లక్కీ భాస్కర్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్నప్పటికీ వాటికే మాత్రం తీసిపోకుండా ఇంకా చెప్పాలంటే కొన్ని సెంటర్లలో డామినేషన్ చూపించే స్థాయిలో అమరన్ అదరగొట్టాడు.
2022లో రిలీజైన ‘మేజర్’ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అడవి శేష్ టైటిల్ రోల్ పోషించిన ఈ రియల్ లైఫ్ బయోపిక్ మంచి విజయం సాధించింది. వసూళ్లు, ప్రశంసలు రెండూ దక్కాయి. మేజర్, అమరన్ రెండూ ఇద్దరు గొప్ప ఆర్మీ ఆఫీసర్ల కథలను అత్యున్నతంగా ఆవిష్కరించినవి. కాకపోతే ఒక తేడా ఏంటంటే మొదటిదాంట్లో హీరోయిన్ గా నటించిన సయీ మంజ్రేకర్ పెద్దగా ప్రభావం చూపించలేదు కానీ అమరన్ లో శివకార్తికేయన్ ని డామినేట్ చేసేలా సాయిపల్లవి కట్టిపడేసే పెర్ఫార్మన్స్ తో కన్నీళ్లు పెట్టించింది. మేజర్ లోనూ ఈ ఎమోషన్ ఉన్నప్పటికీ హీరో, దర్శకుడు ఇద్దరే దాన్ని పంచుకున్నారు.
అమరన్ లో మాత్రం థియేటర్ నుంచి బయటికి వచ్చాక కూడా వెంటపడే స్థాయిలో సాయిపల్లవి హృదయాలను బరువెక్కించింది. ఫైనల్ రన్ లో రెండు వందల కోట్ల గ్రాస్ సులభంగా దాటుతుందనే అంచనాలు బలంగా ఉన్నాయి. వీకెండ్ ని పూర్తిగా వాడుకోవడం ఖాయం. దెబ్బకు పోటీగా వచ్చిన జయం రవి బ్రదర్ ఎదురీదుతోంది. అమరన్ కు బ్లాక్ బస్టర్ ముద్ర పడిపోయింది. ఊహించని విషయం తెలుగులో దక్కుతున్న రన్. ఒకవేళ ఆశించిన స్థాయిలో స్పందన లేకపోయి ఉంటే లక్కీ భాస్కర్, కలకు అదనపు థియేటర్లు దక్కేవి కానీ సాయిపల్లవి, శివ కార్తికేయన్ లు ఆ ఛాన్స్ ఇవ్వకుండా దూసుకెళ్తున్నారు.
This post was last modified on November 2, 2024 2:47 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…