సీనియర్ దర్శకుడు గుణశేఖర్ చివరగా తెరకెక్కించిన ‘రుద్రమదేవి’ సినిమా విడుదలై ఐదేళ్లు దాటిపోయింది. కానీ ఇప్పటిదాకా అతడి తర్వాతి సినిమా మొదలే కాలేదు. మరోసారి భారీ కల కన్న గుణ.. హిరణ్యకశ్యప సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్నాడు. కానీ ఈ సినిమా పట్టాలెక్కడంలో చాలా ఆలస్యం జరుగుతోంది. కాగా అది మొదలయ్యే లోపు గుణ ఒక వెబ్ సిరీస్ చేయాలనుకున్నాడని.. నెట్ఫ్లిక్స్ వాళ్లతో ఒప్పందం కుదిరి దాని మీద వర్క్ చేశాడని.. ఐతే గుణ పనితీరు నచ్చక నెట్ఫ్లిక్స్ వాళ్లు ఆ ప్రాజెక్టును క్యాన్సిల్ చేశారని మీడియాలో వార్తలు వచ్చాయి.
దీనిపై ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఖండన ఇచ్చేశాడు గుణ. తాను నెట్ఫ్లిక్స్తో కానీ.. మరే ఓటీటీ ఫ్లాట్ఫామ్తో కానీ అసోసియేట్ కాలేదని.. తనకసలు వెబ్ సిరీస్లు చేసే ఆలోచన కానీ, ఆసక్తి కానీ ఎంతమాాత్రం లేవని.. కాబట్టి తన గురించి లేని పోని వార్తలు సృష్టించవద్దని అతను ఈ స్టేట్మెంట్లో పేర్కొన్నాడు.
ఇదిలా ఉండగా తన నుంచి అతి త్వరలోనే ఒక అప్డేట్ రాబోతోందని.. దాని కోసం ఎదురు చూడాలని గుణశేఖర్ చెప్పాడు. మరి ఇంత బలంగా చెప్పాడంటే గుణశేఖర్-నెట్ఫ్లిక్స్ వ్యవహారం ఉత్తుత్తిదే అనుకోవాలి. ఇక గుణ ఇచ్చే అప్ డేట్ ఏంటి అన్నది ఆసక్తికరం. బహుశా అది ‘హిరణ్యకశ్యప’కు సంబంధించిందే అయ్యుంటుందని భావిస్తున్నారు.
రానా ప్రధాన పాత్రలో సురేష్ బాబు ఈ మెగా ప్రాజెక్టును నిర్మించడానికి రెడీ అయినట్లు ఇంతకుముందు సంకేతాలందాయి. కానీ కరోనా దెబ్బకు లెక్కలన్నీ తారుమారైన పరిస్థితుల్లో రూ.200 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కించడం పెద్ద రిస్క్ అన్న ఉద్దేశంతో సురేష్ బాబు తటపటాయిస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు గురించి గుణ ఏం అప్డేట్ ఇస్తాడో చూడాలి.
This post was last modified on October 3, 2020 8:45 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…