బాలీవుడ్ అతి పెద్ద మల్టీ స్టారర్ గా ప్రమోషన్లు చేసుకుంటూ భూల్ భులయ్యా 3 క్లాష్ వివాదం వల్ల ట్రేడ్ లో, ప్రేక్షకుల్లో హాట్ టాపిక్ గా నిలిచిన సింగం అగైన్ నిన్న థియేటర్లలో అడుగు పెట్టింది. టైటిల్ రోల్ అజయ్ దేవగనే అయినప్పటికీ బోలెడు హీరో హీరోయిన్లను జొప్పించడంతో మాస్ పరంగా దీని మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 2022లో సర్కస్ డిజాస్టర్ తర్వాత దర్శకుడు రోహిత్ శెట్టి గ్యాప్ తీసుకుని ఈ కథ రాసుకున్నాడు. బడ్జెట్ విపరీతంగా ఖర్చు పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సినిమాల నుంచి విపరీతమైన పోటీ ఉన్నప్పటికీ చెప్పుకోదగ్గ థియేటర్లు దక్కాయి.ఇక్కడిదాకా బాగానే ఉంది కదూ.
అసలు మ్యాటర్ మాత్రం తేలిపోయింది. రామాయణంని ఆధునిక పోలీస్ ఆఫీసర్ల హీరోయిజంతో ముడిపెట్టాలని చూసిన రోహిత్ శెట్టి బిర్యానిలో ఓ టన్ను మాసాలా వేస్తే చాలనుకున్నాడు కానీ అసలైన వంటకానికి అవసరమైన ఇతర దినుసులను సరిగా బ్యాలన్స్ చేయకపోవడంతో సింగం అగైన్ ఒక మాములు మూవీగా మారిపోయింది. శ్రీలంకలో ఉండే డేంజర్ లంక (అర్జున్ కపూర్) మాఫియాని కట్టడి చేయడానికి బాజీరావ్ సింగం (అజయ్ దేవగన్) పూనుకుంటాడు. ఇతను లంకకు స్వయానా తాత. దీంతో సింగం భార్య (కరీనా కపూర్) కిడ్నాప్ కు గురవుతుంది. ఆ తర్వాత జరిగేది ఈజీగా ఊహించుకోవచ్చు.
క్రమం తప్పకుండా ఎపిసోడ్స్ ప్రకారం అజయ్ దేవగన్, టైగర్ శ్రోఫ్, దీపికా పదుకునే, రణ్వీర్ సింగ్, అక్షయ్ కుమార్ భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో పరిచయం కావడం ఆ తర్వాత ఫైట్లు చేయడం, మధ్యలో విలన్ తాలూకు బిల్డప్ సీన్లు వచ్చి పోవడం, సింగం వేసే ఎత్తులు చిత్తులు ఇలా ఫార్ములా ప్రకారం ఎక్కడా కొత్తదనం అనే ప్రశ్నే లేకుండా పరమ రొటీన్ ట్రాక్ లోకి వెళ్ళిపోయాడు రోహిత్ శెట్టి. హోరెత్తిపోయే పాటలు, బీజీఎమ్ ఇవ్వడంలో తమన్, రవి బస్రూర్ కొంతవరకు తోడ్పడ్డారు కానీ క్రియేటివిటీ జాడే లేని సింగం అగైన్ ని ఎలాంటి కొత్తదనం ఆశించకుండా వెళ్తే తప్ప మచ్చుకు కూడా మెప్పించదు.
This post was last modified on November 2, 2024 10:20 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…