తెలుగులో తెరకెక్కుతున్న భారీ చిత్రాల్లో ‘కన్నప్ప’ ఒకటి. ఇది మంచు ఫ్యామిలీకి డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్పొచ్చు. మంచు విష్ణు ఎన్నో ఏళ్ల నుంచి ఈ ప్రాజెక్టు గురించి చెబుతూ వచ్చాడు. ఎట్లకేలకు గత ఏడాది ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లింది. వంద కోట్లకు పైగా బడ్జెట్లో, భారీ తారాగణంతో ఈ సినిమాను రూపొందిస్తోంది టీం. మంచు విష్ణుకు చాలా ఏళ్లుగా సరైన విజయం లేకపోయినప్పటికీ.. ఈ సినిమా తన కెరీర్ను గొప్ప మలుపు తిప్పుతుందని ఆశిస్తున్నాడు. మొత్తం విదేశాల్లోనే చిత్రీకరణ పూర్తి చేసి.. గట్టిగా సినిమాను ప్రమోట్ చేయడానికి కూడా ప్రణాళికలు వేసుకున్నాడు.
జూన్ 14న టీజర్ బాగా హడావుడి మధ్య రిలీజ్ చేశారు. ఆ తర్వాత కూడా ముఖ్య పాత్రల గురించి సోమవారం సోమవారం పోస్టర్లు రిలీజ్ చేస్తూ సినిమాను వార్తల్లో నిలిపే ప్రయత్నం చేసింది టీం. కానీ ఈ మధ్య ‘కన్నప్ప’ టీం నుంచి సౌండ్ లేదు. దాదాపు నెల రోజుల నుంచి ‘కన్నప్ప’ టీం నుంచి ఏ అప్డేట్ లేదు. ఈ చిత్రాన్ని డిసెంబరులో రిలీజ్ చేస్తామని మంచు విష్ణు గతంలో తెలిపాడు. అందుకు అనుగుణంగానే ప్రమోషన్లు చేస్తూ వచ్చారు.
రిలీజ్ దగ్గర పడుతుంటే ఇంకా ప్రమోషనల్ హడావుడి పెంచుతారనుకుంటే.. టీం ఉన్నట్లుండి సైలెంట్ అయిపోయింది. మరి సినిమాను విడుదలకు రెడీ చేసే క్రమంలో టీం దాని మీదే ఫోకస్ పెట్టి ప్రమోషన్లను పట్టించుకోవడం లేదా.. లేక డిసెంబరులో ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనను మానుకుని సైలెంట్ అయ్యారా అన్నది తెలియడం లేదు. డిసెంబరులో పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ‘కన్నప్ప’ రిలీజ్ గురించి టీం ఏదో ఒకటి త్వరగా తేల్చేయడం బెటర్.
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు గుప్పించారు.…
మార్క్ ఆంటోనీ, గత ఏడాది అజిత్ తో వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలతో తమిళ దర్శకుడు అధిక్ రవిచంద్రన్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యవహార తీరుపై ఇప్పటికే లెక్కలేనన్ని చర్చలు జరిగాయి. అటు సినిమాలు,…
ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని ఒక సామెత. కొందరు మాత్రం రచ్చ గెలిచి, తర్వాత ఇంటికి వస్తుంటారు. శోభిత…
పెద్ది ఇప్పుడు రామ్ చరణ్ కెరీర్లో మరో చాలెంజ్ లాంటి ప్రాజెక్టు. RRR తర్వాత వచ్చిన గ్లోబల్ ఇమేజ్ని నిలబెట్టుకోవాలి.…
ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా సినిమా అయినా దాన్ని జనంలోకి తీసుకెళ్లాలంటే ప్రచారం తప్పనిసరి. కంటెంట్ ఉంటే చాలు ఇంకేం…