Movie News

‘కథ అవసరం లేదు’ కామెంట్లపై వివరణ

ఇటీవల రకరకాల వివాదాస్పద కామెంట్లతో వార్తల్లో నిలిచాడు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో ఫైట్లు, డ్యాన్సులు, హీరో ఎలివేషన్లు ఉంటే సరిపోతుందని.. కథ, తొక్క, తోలు అంటూ ఎవరూ పట్టించుకోరని ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్లు చర్చనీయాంశం అయ్యాయి. దీనిపై చాలామంది వంశీని తప్పుబట్టారు.

నాగవంశీ ప్రొడ్యూస్ చేసిన ‘గుంటూరు కారం’ చిత్రాన్ని ఉదాహరణగా చూపించి.. కథ గురించి పట్టించుకోలేదు కాబట్టే ఆ సినిమా పోయిందని కౌంటర్లు వేశారు. ఐతే తన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో తాజాగా నాగవంశీ స్పందించారు.

తన వ్యాఖ్యల ఉద్దేశాన్ని వివరించే ప్రయత్నం చేశాడు. తన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. స్టార్ హీరోల సినిమాలంటే అభిమానులు కొన్ని మూమెంట్స్ కోసమే వస్తారని ఆయన చెప్పారు.

‘వార్’ సినిమాలో హృతిక్ రోషన్ హెలికాఫ్టర్ నుంచి జెండా ఊపే సన్నివేశం చూడగానే.. ఆ ఒక్కదానికి టికెట్ డబ్బులు గిట్టుబాటు అయిపోయినట్లు తనకు అనిపించిందని.. ఒక స్టార్ హీరో సినిమా నుంచి అంతకంటే ఏం కావాలని నాగవంశీ అన్నారు.

ఇక లేటెస్ట్ మూవీ ‘దేవర’ గురించి ప్రస్తావిస్తూ.. ఆ చిత్రంలో ఇంటర్వెల్ బ్లాక్‌లో ఎన్టీఆర్ అందరినీ చంపేశాక తన కత్తికి అంటుకున్న రక్తాన్ని నీటితో కడుగుతాడని.. ఆ సన్నివేశానికి అనిరుధ్ ఇంగ్లిష్ పాటతో ఆర్ఆర్ చేశాడని.. అది గూస్ బంప్స్ ఇచ్చిన మూమెంట్ అని.. అలాంటివి అభిమానులకు ఎంతగానో నచ్చుతాయని.. ఇలాంటి హై ఇచ్చే మూమెంట్స్ కోసమే ఫ్యాన్స్ సినిమాలకు వస్తారని నాగవంశీ అన్నారు.

అభిమానుల సంగతి పక్కన పెడితే కామన్ ఆడియన్స్ పరిస్థితి ఏంటి, వాళ్లు కథ గురించి ఆలోచించరా అని అడిగితే.. వాళ్లకు కూడా క్లారిటీ ఉంటుందని, కొన్ని లెక్కలు ఉంటాయని.. వాళ్లకు కావాల్సింది ఇస్తే సరిపోతుందని నాగవంశీ అన్నారు. మరి ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు ఎలా స్పందిస్తారో చూడాలి.

This post was last modified on October 30, 2024 6:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

3 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

3 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

4 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

6 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

6 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

7 hours ago