Movie News

‘కథ అవసరం లేదు’ కామెంట్లపై వివరణ

ఇటీవల రకరకాల వివాదాస్పద కామెంట్లతో వార్తల్లో నిలిచాడు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో ఫైట్లు, డ్యాన్సులు, హీరో ఎలివేషన్లు ఉంటే సరిపోతుందని.. కథ, తొక్క, తోలు అంటూ ఎవరూ పట్టించుకోరని ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్లు చర్చనీయాంశం అయ్యాయి. దీనిపై చాలామంది వంశీని తప్పుబట్టారు.

నాగవంశీ ప్రొడ్యూస్ చేసిన ‘గుంటూరు కారం’ చిత్రాన్ని ఉదాహరణగా చూపించి.. కథ గురించి పట్టించుకోలేదు కాబట్టే ఆ సినిమా పోయిందని కౌంటర్లు వేశారు. ఐతే తన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో తాజాగా నాగవంశీ స్పందించారు.

తన వ్యాఖ్యల ఉద్దేశాన్ని వివరించే ప్రయత్నం చేశాడు. తన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. స్టార్ హీరోల సినిమాలంటే అభిమానులు కొన్ని మూమెంట్స్ కోసమే వస్తారని ఆయన చెప్పారు.

‘వార్’ సినిమాలో హృతిక్ రోషన్ హెలికాఫ్టర్ నుంచి జెండా ఊపే సన్నివేశం చూడగానే.. ఆ ఒక్కదానికి టికెట్ డబ్బులు గిట్టుబాటు అయిపోయినట్లు తనకు అనిపించిందని.. ఒక స్టార్ హీరో సినిమా నుంచి అంతకంటే ఏం కావాలని నాగవంశీ అన్నారు.

ఇక లేటెస్ట్ మూవీ ‘దేవర’ గురించి ప్రస్తావిస్తూ.. ఆ చిత్రంలో ఇంటర్వెల్ బ్లాక్‌లో ఎన్టీఆర్ అందరినీ చంపేశాక తన కత్తికి అంటుకున్న రక్తాన్ని నీటితో కడుగుతాడని.. ఆ సన్నివేశానికి అనిరుధ్ ఇంగ్లిష్ పాటతో ఆర్ఆర్ చేశాడని.. అది గూస్ బంప్స్ ఇచ్చిన మూమెంట్ అని.. అలాంటివి అభిమానులకు ఎంతగానో నచ్చుతాయని.. ఇలాంటి హై ఇచ్చే మూమెంట్స్ కోసమే ఫ్యాన్స్ సినిమాలకు వస్తారని నాగవంశీ అన్నారు.

అభిమానుల సంగతి పక్కన పెడితే కామన్ ఆడియన్స్ పరిస్థితి ఏంటి, వాళ్లు కథ గురించి ఆలోచించరా అని అడిగితే.. వాళ్లకు కూడా క్లారిటీ ఉంటుందని, కొన్ని లెక్కలు ఉంటాయని.. వాళ్లకు కావాల్సింది ఇస్తే సరిపోతుందని నాగవంశీ అన్నారు. మరి ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు ఎలా స్పందిస్తారో చూడాలి.

This post was last modified on October 30, 2024 6:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పాకిస్థాన్‌లో నో రిలీజ్… అయినా అక్క‌డ‌ బ్లాక్‌బ‌స్ట‌ర్

కొన్నేళ్ల నుంచి భార‌త్‌, పాకిస్థాన్ సంబంధాలు అంతంత‌మాత్రంగా ఉండ‌గా.. ఈ ఏడాది ఆరంభంలో ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడి త‌ర్వాత అవి పూర్తిగా…

4 hours ago

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

5 hours ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

7 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

8 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

8 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

9 hours ago