ఇటీవల రకరకాల వివాదాస్పద కామెంట్లతో వార్తల్లో నిలిచాడు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో ఫైట్లు, డ్యాన్సులు, హీరో ఎలివేషన్లు ఉంటే సరిపోతుందని.. కథ, తొక్క, తోలు అంటూ ఎవరూ పట్టించుకోరని ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్లు చర్చనీయాంశం అయ్యాయి. దీనిపై చాలామంది వంశీని తప్పుబట్టారు.
నాగవంశీ ప్రొడ్యూస్ చేసిన ‘గుంటూరు కారం’ చిత్రాన్ని ఉదాహరణగా చూపించి.. కథ గురించి పట్టించుకోలేదు కాబట్టే ఆ సినిమా పోయిందని కౌంటర్లు వేశారు. ఐతే తన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో తాజాగా నాగవంశీ స్పందించారు.
తన వ్యాఖ్యల ఉద్దేశాన్ని వివరించే ప్రయత్నం చేశాడు. తన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. స్టార్ హీరోల సినిమాలంటే అభిమానులు కొన్ని మూమెంట్స్ కోసమే వస్తారని ఆయన చెప్పారు.
‘వార్’ సినిమాలో హృతిక్ రోషన్ హెలికాఫ్టర్ నుంచి జెండా ఊపే సన్నివేశం చూడగానే.. ఆ ఒక్కదానికి టికెట్ డబ్బులు గిట్టుబాటు అయిపోయినట్లు తనకు అనిపించిందని.. ఒక స్టార్ హీరో సినిమా నుంచి అంతకంటే ఏం కావాలని నాగవంశీ అన్నారు.
ఇక లేటెస్ట్ మూవీ ‘దేవర’ గురించి ప్రస్తావిస్తూ.. ఆ చిత్రంలో ఇంటర్వెల్ బ్లాక్లో ఎన్టీఆర్ అందరినీ చంపేశాక తన కత్తికి అంటుకున్న రక్తాన్ని నీటితో కడుగుతాడని.. ఆ సన్నివేశానికి అనిరుధ్ ఇంగ్లిష్ పాటతో ఆర్ఆర్ చేశాడని.. అది గూస్ బంప్స్ ఇచ్చిన మూమెంట్ అని.. అలాంటివి అభిమానులకు ఎంతగానో నచ్చుతాయని.. ఇలాంటి హై ఇచ్చే మూమెంట్స్ కోసమే ఫ్యాన్స్ సినిమాలకు వస్తారని నాగవంశీ అన్నారు.
అభిమానుల సంగతి పక్కన పెడితే కామన్ ఆడియన్స్ పరిస్థితి ఏంటి, వాళ్లు కథ గురించి ఆలోచించరా అని అడిగితే.. వాళ్లకు కూడా క్లారిటీ ఉంటుందని, కొన్ని లెక్కలు ఉంటాయని.. వాళ్లకు కావాల్సింది ఇస్తే సరిపోతుందని నాగవంశీ అన్నారు. మరి ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు ఎలా స్పందిస్తారో చూడాలి.
This post was last modified on October 30, 2024 6:54 pm
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…