ఇటీవల రకరకాల వివాదాస్పద కామెంట్లతో వార్తల్లో నిలిచాడు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో ఫైట్లు, డ్యాన్సులు, హీరో ఎలివేషన్లు ఉంటే సరిపోతుందని.. కథ, తొక్క, తోలు అంటూ ఎవరూ పట్టించుకోరని ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్లు చర్చనీయాంశం అయ్యాయి. దీనిపై చాలామంది వంశీని తప్పుబట్టారు.
నాగవంశీ ప్రొడ్యూస్ చేసిన ‘గుంటూరు కారం’ చిత్రాన్ని ఉదాహరణగా చూపించి.. కథ గురించి పట్టించుకోలేదు కాబట్టే ఆ సినిమా పోయిందని కౌంటర్లు వేశారు. ఐతే తన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో తాజాగా నాగవంశీ స్పందించారు.
తన వ్యాఖ్యల ఉద్దేశాన్ని వివరించే ప్రయత్నం చేశాడు. తన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. స్టార్ హీరోల సినిమాలంటే అభిమానులు కొన్ని మూమెంట్స్ కోసమే వస్తారని ఆయన చెప్పారు.
‘వార్’ సినిమాలో హృతిక్ రోషన్ హెలికాఫ్టర్ నుంచి జెండా ఊపే సన్నివేశం చూడగానే.. ఆ ఒక్కదానికి టికెట్ డబ్బులు గిట్టుబాటు అయిపోయినట్లు తనకు అనిపించిందని.. ఒక స్టార్ హీరో సినిమా నుంచి అంతకంటే ఏం కావాలని నాగవంశీ అన్నారు.
ఇక లేటెస్ట్ మూవీ ‘దేవర’ గురించి ప్రస్తావిస్తూ.. ఆ చిత్రంలో ఇంటర్వెల్ బ్లాక్లో ఎన్టీఆర్ అందరినీ చంపేశాక తన కత్తికి అంటుకున్న రక్తాన్ని నీటితో కడుగుతాడని.. ఆ సన్నివేశానికి అనిరుధ్ ఇంగ్లిష్ పాటతో ఆర్ఆర్ చేశాడని.. అది గూస్ బంప్స్ ఇచ్చిన మూమెంట్ అని.. అలాంటివి అభిమానులకు ఎంతగానో నచ్చుతాయని.. ఇలాంటి హై ఇచ్చే మూమెంట్స్ కోసమే ఫ్యాన్స్ సినిమాలకు వస్తారని నాగవంశీ అన్నారు.
అభిమానుల సంగతి పక్కన పెడితే కామన్ ఆడియన్స్ పరిస్థితి ఏంటి, వాళ్లు కథ గురించి ఆలోచించరా అని అడిగితే.. వాళ్లకు కూడా క్లారిటీ ఉంటుందని, కొన్ని లెక్కలు ఉంటాయని.. వాళ్లకు కావాల్సింది ఇస్తే సరిపోతుందని నాగవంశీ అన్నారు. మరి ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు ఎలా స్పందిస్తారో చూడాలి.
This post was last modified on October 30, 2024 6:54 pm
వాహనదారులకు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ట్రాఫిక్ రూల్స్కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ..…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…