Trends

చెట్ల వివాదంలో చిక్కుకున్న యష్ ‘టాక్సిక్’

కెజిఎఫ్ తర్వాత ఎన్ని ఆఫర్లు వచ్చినా, సుదీర్ఘ విరామం గురించి అభిమానుల వైపు నెగటివ్ కామెంట్స్ వినిపించుకోకుండా యష్ ఎంపిక చేసుకున్న ప్యాన్ ఇండియా మూవీ టాక్సిక్. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హై వోల్టేజ్ మాఫియా డ్రగ్ డ్రామాలో నయనతార కీలక పాత్ర పోషిస్తుండగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే ఈ ఇద్దరికీ సంబంధించిన అధికారిక ప్రకటన టీమ్ ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఇటీవలే ఒక బాలీవుడ్ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ప్రస్తావన వచ్చినా సరే యష్ దాటవేశాడు తప్పింది నిర్ధారణ చేయలేదు. ఇక్కడిదాకా బాగానే ఉంది కదా.

తాజాగా టాక్సిక్ ఒక వివాదంలో చిక్కుకుంది. బెంగళూరు పరిధిలోకి వచ్చే పీన్య ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ ని ప్లాన్ చేశారు. ఇటీవలే అక్కడి పర్యటనకు వచ్చిన అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే వేలాది చెట్లు నరికి వేయబడి ఉండటం చూసి అవాక్కయ్యారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇంతటి దుశ్చర్యకు ఎవరు పాల్పడ్డారని కనుక్కుంటే టాక్సిక్ సెట్ల కోసం ఆ ప్రాంతాన్ని చదును చేశారని తెలిసింది. 599 ఎకరాల్లో విస్తరించి ఉన్న పీన్య – జాలల్లి ప్రాంతం రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రభుత్వం గతంలో నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే హిందూస్తాన్ మెషీన్ టూల్స్ అనే సంస్థకు కట్టబెట్టారనే కాంట్రావర్సి ఇప్పటికే ఉంది.

ప్రస్తుతం దీని మీద విచారణ జరిపించాల్సిందిగా ఈశ్వర్ ఖండ్రే ఆదేశించారు. గతంలోనూ ప్రైవేట్ వ్యక్తులు ఈ భూమిని ఇతర అవసరాలకు, షూటింగులకు అద్దెకు ఇచ్చారని, టాక్సిక్ బృందం పెద్ద ఎత్తున చెట్లు నరకడం వల్ల బయట పడిందని శాండల్ వుడ్ రిపోర్ట్. శాటిలైట్ ఇమేజెస్ లో ఇది స్పష్టంగా కనిపించడంతో వ్యవహారం దూరం వెళ్లేలా ఉంది. నాలుగు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మాణం జరుపుకుంటున్న టాక్సిక్ వచ్చే ఏడాది ఏప్రిల్ 10 విడుదల చేయాలని తొలుత అనుకున్నారు కానీ తర్వాత వాయిదా వేసుకున్నారు. అదే డేట్ ప్రభాస్ ది రాజ్ సాబ్ కొన్ని వారాల క్రితం అఫీషియల్ గా తీసేసుకుంది.

This post was last modified on October 30, 2024 10:19 pm

Share

Recent Posts

రవితేజకు డబ్బులే డబ్బులు

మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…

3 hours ago

దృశ్యం 4… ఇంకెన్నిసార్లు సాగదీస్తారో

ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…

3 hours ago

హైదరాబాద్ వచ్చిన జాంబీరెడ్డి ఏం చేయబోతున్నాడు

కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…

4 hours ago

మహిళను చంపి…. బిర్యానీ వండి…

ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…

4 hours ago

బాలయ్య తీసుకునేది తెలివైన నిర్ణయమే

ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…

4 hours ago

హైదరాబాద్‌లో ఇంకా పెద్ద ఐమాక్స్?

దేశంలో సినీ అభిమానం పరంగా టాప్‌లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్‌లో ఈ…

5 hours ago