కెజిఎఫ్ తర్వాత ఎన్ని ఆఫర్లు వచ్చినా, సుదీర్ఘ విరామం గురించి అభిమానుల వైపు నెగటివ్ కామెంట్స్ వినిపించుకోకుండా యష్ ఎంపిక చేసుకున్న ప్యాన్ ఇండియా మూవీ టాక్సిక్. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హై వోల్టేజ్ మాఫియా డ్రగ్ డ్రామాలో నయనతార కీలక పాత్ర పోషిస్తుండగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.
అయితే ఈ ఇద్దరికీ సంబంధించిన అధికారిక ప్రకటన టీమ్ ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఇటీవలే ఒక బాలీవుడ్ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ప్రస్తావన వచ్చినా సరే యష్ దాటవేశాడు తప్పింది నిర్ధారణ చేయలేదు. ఇక్కడిదాకా బాగానే ఉంది కదా.
తాజాగా టాక్సిక్ ఒక వివాదంలో చిక్కుకుంది. బెంగళూరు పరిధిలోకి వచ్చే పీన్య ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ ని ప్లాన్ చేశారు. ఇటీవలే అక్కడి పర్యటనకు వచ్చిన అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే వేలాది చెట్లు నరికి వేయబడి ఉండటం చూసి అవాక్కయ్యారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇంతటి దుశ్చర్యకు ఎవరు పాల్పడ్డారని కనుక్కుంటే టాక్సిక్ సెట్ల కోసం ఆ ప్రాంతాన్ని చదును చేశారని తెలిసింది. 599 ఎకరాల్లో విస్తరించి ఉన్న పీన్య – జాలల్లి ప్రాంతం రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రభుత్వం గతంలో నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే హిందూస్తాన్ మెషీన్ టూల్స్ అనే సంస్థకు కట్టబెట్టారనే కాంట్రావర్సి ఇప్పటికే ఉంది.
ప్రస్తుతం దీని మీద విచారణ జరిపించాల్సిందిగా ఈశ్వర్ ఖండ్రే ఆదేశించారు. గతంలోనూ ప్రైవేట్ వ్యక్తులు ఈ భూమిని ఇతర అవసరాలకు, షూటింగులకు అద్దెకు ఇచ్చారని, టాక్సిక్ బృందం పెద్ద ఎత్తున చెట్లు నరకడం వల్ల బయట పడిందని శాండల్ వుడ్ రిపోర్ట్. శాటిలైట్ ఇమేజెస్ లో ఇది స్పష్టంగా కనిపించడంతో వ్యవహారం దూరం వెళ్లేలా ఉంది. నాలుగు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మాణం జరుపుకుంటున్న టాక్సిక్ వచ్చే ఏడాది ఏప్రిల్ 10 విడుదల చేయాలని తొలుత అనుకున్నారు కానీ తర్వాత వాయిదా వేసుకున్నారు. అదే డేట్ ప్రభాస్ ది రాజ్ సాబ్ కొన్ని వారాల క్రితం అఫీషియల్ గా తీసేసుకుంది.
This post was last modified on October 30, 2024 10:19 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…