కెజిఎఫ్ తర్వాత ఎన్ని ఆఫర్లు వచ్చినా, సుదీర్ఘ విరామం గురించి అభిమానుల వైపు నెగటివ్ కామెంట్స్ వినిపించుకోకుండా యష్ ఎంపిక చేసుకున్న ప్యాన్ ఇండియా మూవీ టాక్సిక్. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హై వోల్టేజ్ మాఫియా డ్రగ్ డ్రామాలో నయనతార కీలక పాత్ర పోషిస్తుండగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.
అయితే ఈ ఇద్దరికీ సంబంధించిన అధికారిక ప్రకటన టీమ్ ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఇటీవలే ఒక బాలీవుడ్ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ప్రస్తావన వచ్చినా సరే యష్ దాటవేశాడు తప్పింది నిర్ధారణ చేయలేదు. ఇక్కడిదాకా బాగానే ఉంది కదా.
తాజాగా టాక్సిక్ ఒక వివాదంలో చిక్కుకుంది. బెంగళూరు పరిధిలోకి వచ్చే పీన్య ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ ని ప్లాన్ చేశారు. ఇటీవలే అక్కడి పర్యటనకు వచ్చిన అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే వేలాది చెట్లు నరికి వేయబడి ఉండటం చూసి అవాక్కయ్యారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇంతటి దుశ్చర్యకు ఎవరు పాల్పడ్డారని కనుక్కుంటే టాక్సిక్ సెట్ల కోసం ఆ ప్రాంతాన్ని చదును చేశారని తెలిసింది. 599 ఎకరాల్లో విస్తరించి ఉన్న పీన్య – జాలల్లి ప్రాంతం రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రభుత్వం గతంలో నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే హిందూస్తాన్ మెషీన్ టూల్స్ అనే సంస్థకు కట్టబెట్టారనే కాంట్రావర్సి ఇప్పటికే ఉంది.
ప్రస్తుతం దీని మీద విచారణ జరిపించాల్సిందిగా ఈశ్వర్ ఖండ్రే ఆదేశించారు. గతంలోనూ ప్రైవేట్ వ్యక్తులు ఈ భూమిని ఇతర అవసరాలకు, షూటింగులకు అద్దెకు ఇచ్చారని, టాక్సిక్ బృందం పెద్ద ఎత్తున చెట్లు నరకడం వల్ల బయట పడిందని శాండల్ వుడ్ రిపోర్ట్. శాటిలైట్ ఇమేజెస్ లో ఇది స్పష్టంగా కనిపించడంతో వ్యవహారం దూరం వెళ్లేలా ఉంది. నాలుగు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మాణం జరుపుకుంటున్న టాక్సిక్ వచ్చే ఏడాది ఏప్రిల్ 10 విడుదల చేయాలని తొలుత అనుకున్నారు కానీ తర్వాత వాయిదా వేసుకున్నారు. అదే డేట్ ప్రభాస్ ది రాజ్ సాబ్ కొన్ని వారాల క్రితం అఫీషియల్ గా తీసేసుకుంది.
This post was last modified on October 30, 2024 10:19 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…
ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…