ఇంకా షూటింగ్ మొదలుకాకుండేనే కేవలం లొకేషన్ హంట్ తోనే తన సినిమా గురించి మాట్లాడుకునేలా చేయడం రాజమౌళికే సాధ్యం. ప్రస్తుతం ఆఫ్రికన్ సఫారీలో చక్కర్లు కొడుతున్న జక్కన్న అడవుల్లో రౌండ్లు వేస్తున్న వీడియోలు, జంతువుల ఫోటోలతోనే ఎక్కడ లేని ఎగ్జైట్ మెంట్ తీసుకొస్తున్నారు.
మహేష్ బాబు వెళ్లి ఉంటే ఎలా ఉండేదో ఊహించుకోవడం కష్టం కానీ రాజమౌళి, ఎస్ఎస్ కార్తికేయ పిక్స్ కే అభిమానులు ఊగిపోతున్నారు. ఇవాళ దర్శకధీర ఒక సింహం ఫోటో ముందు నిలబడి వెనుక నుంచి తాను కనిపించేలా దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఇక్కడ ఉంది అసలు ట్విస్ట్.
ఆ సింహం వెనుక ఒక ఆసక్తికరమైన స్టోరీ ఉంది. దీని పేరు బాబ్ జూనియర్. సుప్రసిద్ధ సెరెంగెటి నేషనల్ పార్క్ లో తిరుగుతూ సంవత్సరాల తరబడి సందర్శకులకు గొప్ప అనుభూతి ఇచ్చేది. అత్యంత ఆకర్షణీయమైన ఫోటో జెనిక్ ఫేస్ కలిగిన మృగరాజుగా దీని ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.
జమైకన్ గాయకుడు బాబ్ మార్లే స్మారకంగా దీనికా పేరు పెట్టారు. అయితే ఓ రోజు అనుకోకుండా శత్రువులుగా భావించే తన కన్నా చిన్నవైన సింహాల చేతుల్లో బాబ్ జూనియర్ హత్యకు గురయ్యింది. తమ్ముడిగా భావించే ట్రైగ్వె అనే మరో సింహం కూడా అదే ఘటనలో ప్రాణాలు వదిలింది.
ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఇప్పుడు నెటిజెన్లు సృష్టిస్తున్న స్టోరీ ఏంటంటే బాబ్ జజూనియర్ ప్రాణాలు వదిలాక దాని ఆత్మ మహేష్ బాబుని ఆవహిస్తుందట. తన చావుకు కారణమైన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ఒక నిధికి సంబంధించిన వేట కీలకంగా ఉంటుందట. క్రియేటివిటీ బాగుంది కదూ.
విజయేంద్ర ప్రసాద్ వింటే ఏమైపోతారో కానీ ఇప్పుడీ బాబ్ జూనియర్ ఫోటోని మహేష్ ఫ్యాన్స్ విపరీతంగా షేర్ చేసుకుంటున్నారు. ఇదే తమ హీరో ఫస్ట్ లుక్ అని, ఇకపై ఏదైనా విడుదల చేసే ముందు ప్రీ అనౌన్స్ మెంట్ ఇవ్వాలని ఎలివేషన్లు ఇస్తున్నారు. అంచనాలు అలా ఉన్నాయి మరి.
This post was last modified on October 30, 2024 6:44 pm
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…
అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…
వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…