ఇంకా షూటింగ్ మొదలుకాకుండేనే కేవలం లొకేషన్ హంట్ తోనే తన సినిమా గురించి మాట్లాడుకునేలా చేయడం రాజమౌళికే సాధ్యం. ప్రస్తుతం ఆఫ్రికన్ సఫారీలో చక్కర్లు కొడుతున్న జక్కన్న అడవుల్లో రౌండ్లు వేస్తున్న వీడియోలు, జంతువుల ఫోటోలతోనే ఎక్కడ లేని ఎగ్జైట్ మెంట్ తీసుకొస్తున్నారు.
మహేష్ బాబు వెళ్లి ఉంటే ఎలా ఉండేదో ఊహించుకోవడం కష్టం కానీ రాజమౌళి, ఎస్ఎస్ కార్తికేయ పిక్స్ కే అభిమానులు ఊగిపోతున్నారు. ఇవాళ దర్శకధీర ఒక సింహం ఫోటో ముందు నిలబడి వెనుక నుంచి తాను కనిపించేలా దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఇక్కడ ఉంది అసలు ట్విస్ట్.
ఆ సింహం వెనుక ఒక ఆసక్తికరమైన స్టోరీ ఉంది. దీని పేరు బాబ్ జూనియర్. సుప్రసిద్ధ సెరెంగెటి నేషనల్ పార్క్ లో తిరుగుతూ సంవత్సరాల తరబడి సందర్శకులకు గొప్ప అనుభూతి ఇచ్చేది. అత్యంత ఆకర్షణీయమైన ఫోటో జెనిక్ ఫేస్ కలిగిన మృగరాజుగా దీని ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.
జమైకన్ గాయకుడు బాబ్ మార్లే స్మారకంగా దీనికా పేరు పెట్టారు. అయితే ఓ రోజు అనుకోకుండా శత్రువులుగా భావించే తన కన్నా చిన్నవైన సింహాల చేతుల్లో బాబ్ జూనియర్ హత్యకు గురయ్యింది. తమ్ముడిగా భావించే ట్రైగ్వె అనే మరో సింహం కూడా అదే ఘటనలో ప్రాణాలు వదిలింది.
ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఇప్పుడు నెటిజెన్లు సృష్టిస్తున్న స్టోరీ ఏంటంటే బాబ్ జజూనియర్ ప్రాణాలు వదిలాక దాని ఆత్మ మహేష్ బాబుని ఆవహిస్తుందట. తన చావుకు కారణమైన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ఒక నిధికి సంబంధించిన వేట కీలకంగా ఉంటుందట. క్రియేటివిటీ బాగుంది కదూ.
విజయేంద్ర ప్రసాద్ వింటే ఏమైపోతారో కానీ ఇప్పుడీ బాబ్ జూనియర్ ఫోటోని మహేష్ ఫ్యాన్స్ విపరీతంగా షేర్ చేసుకుంటున్నారు. ఇదే తమ హీరో ఫస్ట్ లుక్ అని, ఇకపై ఏదైనా విడుదల చేసే ముందు ప్రీ అనౌన్స్ మెంట్ ఇవ్వాలని ఎలివేషన్లు ఇస్తున్నారు. అంచనాలు అలా ఉన్నాయి మరి.
This post was last modified on October 30, 2024 6:44 pm
వాహనదారులకు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ట్రాఫిక్ రూల్స్కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ..…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…