ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా పెద్ద సినిమాకు రిలీజ్ డేట్ ఒకటి అనుకున్నప్పుడు వెంటనే దాన్ని ప్రకటించేయాలి. లేదూ ఆలోచిద్దాం అంటూ మీనమేషాలు లెక్కేస్తే ఇంకొకరు ఎగరేసుకుపోతారు. అలాంటిదే ఒకటి జరిగింది.
జనవరి 10 సంక్రాంతికి రావాల్సిన విశ్వంభరని రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కోసం వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కొత్త తేదీని అనౌన్స్ చేయకపోవడంతో అభిమానుల్లో అయోమయం నెలకొంది. కానీ అనఫీషియల్ గా టీమ్ చెప్పిన మాటలను బట్టి మే 9 లాక్ చేయొచ్చని అన్నారు. ఎందుకంటే గ్యాంగ్ లీడర్, జగదేకవీరుడు అతిలోకసుందరి ఆడిన బ్లాక్ బస్టర్ డేట్ ఆది.
తీరా చూస్తే రోజులు గడిచాయి కానీ ట్రైలర్ కొచ్చిన నెగటివ్ రెస్పాన్స్ చూసి విశ్వంభర టీమ్ సైలెంట్ అయ్యింది. ఈలోగా రవితేజ బృందం స్ట్రాటజీ అమలు పరిచింది.
సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సామజవరగమన రచయిత భాను భోగవరపుని దర్శకుడిగా పరిచయం చేస్తున్న సినిమాకి మాస్ జాతర టైటిల్ ని లాక్ చేస్తూ కొత్త పోస్టర్ వదిలారు. ఇడియట్ లోని ఫేమస్ డైలాగు మనదే ఇదంతాని క్యాప్షన్ గా పెట్టారు. 2024 మే 9 నుంచి థియేటర్లలో జాతర ఉంటుందనే రీతిలో రవితేజ ఫ్రెష్ స్టిల్ ఒకటి వదిలారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఎంటర్ టైనర్ ధమాకాని మించి ఉంటుందని సమాచారం.
నిజానికీ మాస్ జాతరని సంక్రాంతికే అనుకున్నారు. అయితే షూటింగ్ లో రవితేజ గాయపడటంతో మూడు నెలలు బ్రేక్ పడింది. ఇటీవలే తిరిగి మొదలుపెట్టారు. అయితే ఆరోగ్యం దృష్ట్యా వేగంగా పరుగులు తీయకుండా చక్కని ప్లానింగ్ తో మెల్లగా పూర్తి చేసేలా సెట్ చేసుకున్నారు. వరస ఫ్లాపులతో డీలా పడ్డ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా మాస్ జాతర రూపొందుతోందట.
హిలేరియస్ గా నవ్వించడంతో పాటు మాస్ ని ఆకట్టుకునే యాక్షన్ బ్లాక్స్ బోలెడు ఉంటాయట. సరే ఏదైతేనేం అన్నయ్య చిరంజీవి కోరుకున్న డేట్ ని తమ్ముడు రవితేజ తీసేసుకున్నాడు. మరి విశ్వంభర బృందం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
తొలి రోజు పూర్తి చేసుకున్న పెద్ది మొత్తం ప్రీమియర్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా 135 కోట్ల గ్రాస్ దాటేసి బలమైన సెకండ్…
అతిలోకసుందరిగా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న శ్రీదేవి అంటే ఎప్పటికీ చెక్కుచెదరని పేరు. అలాంటి గొప్ప నటికి…
తెలంగాణకు రావొచ్చు.. పోవచ్చు.. ఇక్కడ నివసించొచ్చు కానీ, మా రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెడితే ఊరు కునేది లేదంటూ.. పెద్ద…
గ్రాండ్ ఓల్ద్ పార్టీ కాంగ్రెస్ వైఎస్ షర్మిలకు ఝలక్ ఇచ్చింది. షర్మిలను రాజ్యసభకు పంపనున్నట్లు బలమైన వార్తలు వచ్చాక కూడా…
ఏపీలో సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉంది. గుజరాత్ సహా కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన తీర ప్రాంతం(బీచ్) ఏపీలో…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్..తన పార్టీని తెలంగాణలోనూ విస్తరించేందుకు రెడీ అయ్యారు. ఈ విషయాన్ని…