ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా పెద్ద సినిమాకు రిలీజ్ డేట్ ఒకటి అనుకున్నప్పుడు వెంటనే దాన్ని ప్రకటించేయాలి. లేదూ ఆలోచిద్దాం అంటూ మీనమేషాలు లెక్కేస్తే ఇంకొకరు ఎగరేసుకుపోతారు. అలాంటిదే ఒకటి జరిగింది.
జనవరి 10 సంక్రాంతికి రావాల్సిన విశ్వంభరని రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కోసం వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కొత్త తేదీని అనౌన్స్ చేయకపోవడంతో అభిమానుల్లో అయోమయం నెలకొంది. కానీ అనఫీషియల్ గా టీమ్ చెప్పిన మాటలను బట్టి మే 9 లాక్ చేయొచ్చని అన్నారు. ఎందుకంటే గ్యాంగ్ లీడర్, జగదేకవీరుడు అతిలోకసుందరి ఆడిన బ్లాక్ బస్టర్ డేట్ ఆది.
తీరా చూస్తే రోజులు గడిచాయి కానీ ట్రైలర్ కొచ్చిన నెగటివ్ రెస్పాన్స్ చూసి విశ్వంభర టీమ్ సైలెంట్ అయ్యింది. ఈలోగా రవితేజ బృందం స్ట్రాటజీ అమలు పరిచింది.
సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సామజవరగమన రచయిత భాను భోగవరపుని దర్శకుడిగా పరిచయం చేస్తున్న సినిమాకి మాస్ జాతర టైటిల్ ని లాక్ చేస్తూ కొత్త పోస్టర్ వదిలారు. ఇడియట్ లోని ఫేమస్ డైలాగు మనదే ఇదంతాని క్యాప్షన్ గా పెట్టారు. 2024 మే 9 నుంచి థియేటర్లలో జాతర ఉంటుందనే రీతిలో రవితేజ ఫ్రెష్ స్టిల్ ఒకటి వదిలారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఎంటర్ టైనర్ ధమాకాని మించి ఉంటుందని సమాచారం.
నిజానికీ మాస్ జాతరని సంక్రాంతికే అనుకున్నారు. అయితే షూటింగ్ లో రవితేజ గాయపడటంతో మూడు నెలలు బ్రేక్ పడింది. ఇటీవలే తిరిగి మొదలుపెట్టారు. అయితే ఆరోగ్యం దృష్ట్యా వేగంగా పరుగులు తీయకుండా చక్కని ప్లానింగ్ తో మెల్లగా పూర్తి చేసేలా సెట్ చేసుకున్నారు. వరస ఫ్లాపులతో డీలా పడ్డ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా మాస్ జాతర రూపొందుతోందట.
హిలేరియస్ గా నవ్వించడంతో పాటు మాస్ ని ఆకట్టుకునే యాక్షన్ బ్లాక్స్ బోలెడు ఉంటాయట. సరే ఏదైతేనేం అన్నయ్య చిరంజీవి కోరుకున్న డేట్ ని తమ్ముడు రవితేజ తీసేసుకున్నాడు. మరి విశ్వంభర బృందం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
This post was last modified on October 30, 2024 4:53 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…