ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడైన ప్రశాంత్ నీల్ ఇప్పటిదాకా చేసిన సినిమాలు నాలుగే. ఆ నాలుగు సినిమాల్లో కేజీఎఫ్ను ఒకే కథతో రెండు సినిమాలుగా తీశాడు. తొలి చిత్రం ఉగ్రం గురించి మన ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. దాన్ని పక్కన పెట్టి మూడు సినిమాలను చూస్తే అవన్నీ బ్లాక్ థీమ్తోనే సాగాయి. తన సినిమాల పోస్టర్లన్నీ బొగ్గు పులిమినట్లు ఉంటాయి. సినిమాలో విజువల్స్ కూడా అంతే.
కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ చూసినపుడు ఆ థీమ్ చాలా కొత్తగా అనిపించింది. కానీ సలార్ చూసే టైంకి జనాలకు కొంత మొనాటనస్ ఫీలింగ్ వచ్చింది. బ్లాక్ థీమ్ ఓవర్ డోస్ అయిపోయిన ఫీలింగ్ కలిగింది. ఇక ప్రశాంత్ సినిమాల్లో హీరోల ఎలివేషన్లు, యాక్షన్ ఘట్టాలు, ఎడిటింగ్ ప్యాటర్న్స్ కూడా ఒకే స్టయిల్లో సాగుతుంటాయి. దీని వల్ల ప్రశాంత్ సినిమాలన్నీ ఒకే రకంగా నడుస్తున్న ఫీలింగ్ కలుగుతోంది జనాలకు. దీంతో అతను తన తర్వాతి చిత్రానికి వైవిధ్యం చూపించాలని భావిస్తున్నట్లు సమాచారం.
జూనియర్ ఎన్టీఆర్తో తీయబోయే తర్వాతి సినిమాకు కథా నేపథ్యాన్ని ప్రశాంత్ మారుస్తున్నాడట. అలాగే విజువల్గా కూడా ఈ సినిమా భిన్నంగా ఉంటుందని సమాచారం. ఈ చిత్రం వరకు బ్లాక్ థీమ్ను పక్కన పెడుతున్నట్లు యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ప్రశాంత్ ఈ సినిమాలో ప్రయత్నం చేయనున్నాడట. ఇంతకుముందు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో కనిపించిన బ్లాక్ థీమ్.. సినిమాలో ఉండదని సమాచారం.
ఈ చిత్ర షూటింగ్ నవంబరు నెలాఖర్లో మొదలు కావచ్చని తెలుస్తోంది. కానీ తారక్ వెంటనే షూటింగ్కు హాజరు కాడట. ప్రస్తుతం తారక్ వార్-2 షూట్లో బిజీగా ఉన్నాడు. అతను జనవరి నుంచి ప్రశాంత్ సినిమాకు అందుబాటులోకి వస్తాడని సమాచారం. ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్లో నిర్మించనుంది. రిలీజ్ 2026 సంక్రాంతికి ఉండొచ్చు.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…