ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడైన ప్రశాంత్ నీల్ ఇప్పటిదాకా చేసిన సినిమాలు నాలుగే. ఆ నాలుగు సినిమాల్లో కేజీఎఫ్ను ఒకే కథతో రెండు సినిమాలుగా తీశాడు. తొలి చిత్రం ఉగ్రం గురించి మన ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. దాన్ని పక్కన పెట్టి మూడు సినిమాలను చూస్తే అవన్నీ బ్లాక్ థీమ్తోనే సాగాయి. తన సినిమాల పోస్టర్లన్నీ బొగ్గు పులిమినట్లు ఉంటాయి. సినిమాలో విజువల్స్ కూడా అంతే.
కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ చూసినపుడు ఆ థీమ్ చాలా కొత్తగా అనిపించింది. కానీ సలార్ చూసే టైంకి జనాలకు కొంత మొనాటనస్ ఫీలింగ్ వచ్చింది. బ్లాక్ థీమ్ ఓవర్ డోస్ అయిపోయిన ఫీలింగ్ కలిగింది. ఇక ప్రశాంత్ సినిమాల్లో హీరోల ఎలివేషన్లు, యాక్షన్ ఘట్టాలు, ఎడిటింగ్ ప్యాటర్న్స్ కూడా ఒకే స్టయిల్లో సాగుతుంటాయి. దీని వల్ల ప్రశాంత్ సినిమాలన్నీ ఒకే రకంగా నడుస్తున్న ఫీలింగ్ కలుగుతోంది జనాలకు. దీంతో అతను తన తర్వాతి చిత్రానికి వైవిధ్యం చూపించాలని భావిస్తున్నట్లు సమాచారం.
జూనియర్ ఎన్టీఆర్తో తీయబోయే తర్వాతి సినిమాకు కథా నేపథ్యాన్ని ప్రశాంత్ మారుస్తున్నాడట. అలాగే విజువల్గా కూడా ఈ సినిమా భిన్నంగా ఉంటుందని సమాచారం. ఈ చిత్రం వరకు బ్లాక్ థీమ్ను పక్కన పెడుతున్నట్లు యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ప్రశాంత్ ఈ సినిమాలో ప్రయత్నం చేయనున్నాడట. ఇంతకుముందు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో కనిపించిన బ్లాక్ థీమ్.. సినిమాలో ఉండదని సమాచారం.
ఈ చిత్ర షూటింగ్ నవంబరు నెలాఖర్లో మొదలు కావచ్చని తెలుస్తోంది. కానీ తారక్ వెంటనే షూటింగ్కు హాజరు కాడట. ప్రస్తుతం తారక్ వార్-2 షూట్లో బిజీగా ఉన్నాడు. అతను జనవరి నుంచి ప్రశాంత్ సినిమాకు అందుబాటులోకి వస్తాడని సమాచారం. ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్లో నిర్మించనుంది. రిలీజ్ 2026 సంక్రాంతికి ఉండొచ్చు.
This post was last modified on October 30, 2024 9:49 am
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…