పెళ్ళిచూపులు చిత్రంతో తెలుగు తెరపైకి దూసుకొచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్. అప్పటిదాకా ఒక మూసలో సాగిపోతున్న తెలుగు సినిమాలోకి అతను కొత్త నీరు తీసుకొచ్చాడు. అప్పటిదాకా అలాంటి కథ, పాత్రలు తెలుగు చిత్రాల్లో అరుదు. చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజయం సాధించిందీ చిత్రం. దీంతో తరుణ్ భాస్కర్ మీద అంచనాలు పెరిగిపోయాయి. కానీ ఆపై తన నుంచి వచ్చిన సినిమాలు మెప్పించలేకపోయాయి.
‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా కూడా కంటెంట్ ఉన్నదే కానీ.. బాక్సాఫీస్ దగ్గర సరైన విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ‘కీడా కోలా’ మూవీ చేశాడు తరుణ్. కానీ అది మరింత నిరాశపరిచింది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టరే అయింది. తరుణ్ అభిమానులు తన నుంచి ఇంకేదో కోరుకుంటున్నారు కానీ.. అది అతనివ్వడం లేదు.
‘పెళ్ళిచూపులు’ తర్వాత తరుణ్ సరైన కాంబినేషన్లు సెట్ చేసుకోలేకపోయాడనే విమర్శా ఉంది. విక్టరీ వెంకటేష్ లాంటి పెద్ద హీరోతో సినిమా కోసం ట్రై చేశాడు కానీ.. వర్కవుట్ కాలేదు. ఐతే ఇప్పుడు తరుణ్ సరైన హీరోతోనే సినిమా చేయబోతున్నాడన్నది తాజా సమాచారం. తన తొలి చిత్ర కథానాయకుడు విజయ్ దేవరకొండతో అతను జట్టు కట్టబోతున్నాడట.
విజయ్ ‘పెళ్ళిచూపులు’ తర్వాత పెద్ద రేంజికి వెళ్లాడు. ఐతే అతను కూడా ప్రస్తుతం డిజాస్టర్ స్ట్రీక్లో ఉన్నాడు. ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతాడని ఆశిస్తున్నారు. దీంతో పాటు దిల్ రాజు ప్రొడక్షన్లో ఓ సినిమా చేస్తున్న విజయ్.. కొత్త చిత్రాన్ని తాజాగా ఒప్పుకున్నట్లు సమాచారం. తరుణ్ భాస్కర్తో తన తర్వాతి సినిమా ఉంటుందట. ఈ కలయికలో సినిమా అంటే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉంటాయి. తరుణ్ మళ్ళీ సరైన సినిమా చేస్తుండడంతో తనకూ మంచి విజయం దక్కుతుందని ఆశిద్దాం.
This post was last modified on October 29, 2024 4:10 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…