‘బాహుబలి: ది కంక్లూజన్’ సినిమాకు వచ్చిన హైప్, ఆ చిత్రానికి జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్, బాక్సాఫీస్ దగ్గర అది రేపిన సంచలనం ఒక చరిత్ర. ఇండియన్ సినిమా స్థాయికి వెయ్యి కోట్ల వసూళ్లు కూడా చాలా ఎక్కువ అనుకున్న సమయంలో ఆ చిత్రం ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఔరా అనిపించింది.
‘దంగల్’ సినిమాను తర్వాత చైనాలో రిలీజ్ చేయడం, అక్కడ అది భారీ వసూళ్లు సాధించి ఓవరాల్గా రూ.2 వేల కోట్ల మార్కును టచ్ చేయడం వల్ల అది ఇండియన్ సినిమాల్లో హైయెస్ట్ గ్రాసర్ అయింది కానీ.. లేదంటే ఇప్పటికీ ‘బాహుబలి-2’నే హైయెస్ట్ ఇండియన్ గ్రాసర్గా నిలిచేది. గతంతో పోలిస్తే టికెట్ల రేట్లు బాగా పెరిగినా, రిలీజ్ చేసే థియేటర్ల సంఖ్య పెరిగినా ఇతర చిత్రాలేవీ కూడా ఇప్పటిదాకా ‘బాహుబలి-2’ వసూళ్లను దాటలేకపోయాయి.
తాజాగా నిర్మాత శోభు యార్లగడ్డ ‘బాహుబలి-2’కు సంబంధించి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం వెల్లడించారు. టికెట్ల అమ్మకాల్లో ‘బాహుబలి-2’ ఘనతను తర్వాత వచ్చిన చిత్రాలేవీ అందుకోలేదని.. అందులో సగానికి మించి టికెట్ల అమ్మకాలు చేయలేకపోయాయని ఆయన వెల్లడించాడు. ‘బాహుబలి-2’కు ఏకంగా 10 కోట్లకు పైగా టికెట్లు అమ్మినట్లు ఆయన వెల్లడించారు.
ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్కు కూడా ఇందులో సగం టికెట్లు మాత్రమే అమ్ముడైనట్లు ఆయన తెలిపారు. ఇండియన్ సినిమాకు సంబంధించి అత్యధిక టికెట్ల అమ్మకాలు జరిగిన సినిమాగా ‘షోలే’ పేరిట రికార్డు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఆ చిత్రానికి 13 కోట్లకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయని.. కానీ ఆ చిత్రం సంవత్సరాల తరబడి ఆడిందని కాబట్టే ఆ ఘనత సాధించిందని.. కానీ ‘బాహుబలి’ తక్కువ థియేట్రికల్ రన్తోనే 10 కోట్ల మార్కును అందుకుందని.. మోడర్న్ సినిమాలో దీన్ని టచ్ చేసే చిత్రమేదీ లేదని ఆయన స్పష్టం చేశారు.
This post was last modified on October 29, 2024 5:10 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…