Movie News

‘బాహుబలి-2’లో ‘ఆర్ఆర్ఆర్’ సగమేనట

‘బాహుబలి: ది కంక్లూజన్’ సినిమాకు వచ్చిన హైప్, ఆ చిత్రానికి జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్, బాక్సాఫీస్ దగ్గర అది రేపిన సంచలనం ఒక చరిత్ర. ఇండియన్ సినిమా స్థాయికి వెయ్యి కోట్ల వసూళ్లు కూడా చాలా ఎక్కువ అనుకున్న సమయంలో ఆ చిత్రం ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఔరా అనిపించింది.

‘దంగల్’ సినిమాను తర్వాత చైనాలో రిలీజ్ చేయడం, అక్కడ అది భారీ వసూళ్లు సాధించి ఓవరాల్‌గా రూ.2 వేల కోట్ల మార్కును టచ్ చేయడం వల్ల అది ఇండియన్ సినిమాల్లో హైయెస్ట్ గ్రాసర్ అయింది కానీ.. లేదంటే ఇప్పటికీ ‘బాహుబలి-2’నే హైయెస్ట్ ఇండియన్ గ్రాసర్‌గా నిలిచేది. గతంతో పోలిస్తే టికెట్ల రేట్లు బాగా పెరిగినా, రిలీజ్ చేసే థియేటర్ల సంఖ్య పెరిగినా ఇతర చిత్రాలేవీ కూడా ఇప్పటిదాకా ‘బాహుబలి-2’ వసూళ్లను దాటలేకపోయాయి.

తాజాగా నిర్మాత శోభు యార్లగడ్డ ‘బాహుబలి-2’కు సంబంధించి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం వెల్లడించారు. టికెట్ల అమ్మకాల్లో ‘బాహుబలి-2’ ఘనతను తర్వాత వచ్చిన చిత్రాలేవీ అందుకోలేదని.. అందులో సగానికి మించి టికెట్ల అమ్మకాలు చేయలేకపోయాయని ఆయన వెల్లడించాడు. ‘బాహుబలి-2’కు ఏకంగా 10 కోట్లకు పైగా టికెట్లు అమ్మినట్లు ఆయన వెల్లడించారు.

ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్‌కు కూడా ఇందులో సగం టికెట్లు మాత్రమే అమ్ముడైనట్లు ఆయన తెలిపారు. ఇండియన్ సినిమాకు సంబంధించి అత్యధిక టికెట్ల అమ్మకాలు జరిగిన సినిమాగా ‘షోలే’ పేరిట రికార్డు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఆ చిత్రానికి 13 కోట్లకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయని.. కానీ ఆ చిత్రం సంవత్సరాల తరబడి ఆడిందని కాబట్టే ఆ ఘనత సాధించిందని.. కానీ ‘బాహుబలి’ తక్కువ థియేట్రికల్ రన్‌తోనే 10 కోట్ల మార్కును అందుకుందని.. మోడర్న్ సినిమాలో దీన్ని టచ్ చేసే చిత్రమేదీ లేదని ఆయన స్పష్టం చేశారు.

This post was last modified on October 29, 2024 5:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ద ప్రభాస్ రిటర్న్స్… టికెట్ ధరలు నార్మల్

నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…

38 minutes ago

శ్రీలీల కోరుకున్న బ్రేక్ దొరికిందా

సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…

1 hour ago

ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే రచ్చే

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…

2 hours ago

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

5 hours ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

7 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

7 hours ago