‘పుష్ప: ది రూల్’ విడుదల తేదీ దగ్గర పడేకొద్దీ ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇండియా మొత్తం ఎదురు చూస్తున్న సీక్వెల్ కావడం వల్ల దీని గురించి ఏ అప్డేట్ బయటికి వచ్చినా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది. యూనిట్లో ఒక్కొక్కరుగా సినిమా గురించి ఒక రేంజ్లో ఎలివేషన్లు ఇస్తుండడంతో అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి.
ఈ మధ్య ‘పుష్ప-2’ ఫస్టాఫ్ లాక్ చేసిన సందర్భంగా దాని గురించి మేకర్స్ ఒక రేంజిలో చెప్పారు. తాజాగా డిస్ట్రిబ్యూటర్లతో కలిసి ప్రెస్ మీట్లో పాల్గొన్న నిర్మాతలు సినిమా మామూలుగా ఉండదని చెప్పుకొచ్చారు. సినిమాలో చాలా హైలైట్లు ఉన్నాయని.. మూడో పార్ట్కు అదిరిపోయే లీడ్ ఉందని వెల్లడించారు. మరోవైపు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఫస్టాఫ్లో కొన్ని ఎపిసోడ్లు మామూలుగా పేలవని.. ప్రతిదీ ఇంటర్వెల్ బ్యాంగ్ లాగా అనిపిస్తుందని ఎలివేషన్ ఇచ్చాడు.
తాజాగా ‘పుష్ప-2’లో కీలక పాత్ర పోషిస్తున్న యాంకర్ టర్న్డ్ యాక్టర్ అనసూయ ఈ సినిమా గురించి గొప్పగా మాట్లాడింది. ‘బిగ్ బాస్’ షోకు అతిథిగా వచ్చిన ఆమెను పుష్ప-2 గురించి చెప్పమని హోస్ట్ అక్కినేని నాగార్జున అడగ్గా.. మీరు నా వెనుక ఉంటారా మాట్లాడతా అని అనసూయ అంది. సరే అని నాగ్ చెప్పడంతో ‘పుష్ప-2’ గురించి ఆమె మాట్లాడింది. ‘పుష్ప’లో ఇదే క్లైమాక్స్ అనిపించే ఎపిసోడ్ ప్రతి పది నిమిషాలకూ ఒకటి వస్తుందని ఆమె చెప్పింది. ‘పుష్ప-1’ కేవలం ఇంట్రో మాత్రమే అని.. ‘పుష్ప-2’నే అసలు సినిమా అని.. ఇందులోనే చాలా కథ, ఎన్నో ట్విస్టులు ఉంటాయని అనసూయ చెప్పింది.
సినిమా మామూలుగా ఉండదని.. బన్నీ అభిమానులకు గూస్ బంప్స్ గ్యారెంటీ అని ఆమె చెప్పింది. ఇప్పటికే ‘పుష్ప-2’ మీద పెరిగిన అంచనాలు అనసూయ వ్యాఖ్యలతో ఇంకా పీక్స్కు చేరుకునేలా ఉన్నాయి. ఈ చిత్రం డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on %s = human-readable time difference 7:41 pm
‘ఆర్ఎక్స్ 100’ మూవీతో అరంగేట్రంలోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు అజయ్ భూపతి. ఆ తర్వాత తన నుంచి వచ్చిన…
తెలంగాణ రాజకీయాల్లో జున్వాడ రేవ్ పార్టీ(పోలీసులు చెబుతున్న ప్రకారం) వ్యవహారం తీవ్ర రగడకు దారి తీసింది. రేవ్ పార్టీ అనంతరం…
వైసీపీ రహస్యాలను బట్టబయలు చేసేందుకు కూటమి సర్కారు సిద్ధమైంది. వైసీపీ హయాంలో సుమారు 320కి పైగా రహస్య జీవోలు ఇచ్చారన్న…
2025 సంక్రాంతికి గేమ్ ఛేంజర్ తో పాటు వెంకటేష్ 76 రిలీజ్ చేయాలనే ఒత్తిడి నిర్మాత దిల్ రాజు మీద…
ఈ రోజుల్లో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ రీల్స్ మోజులో పడుతున్నారు. తమలో దాగి ఉన్న నైపుణ్యాలను చాటేందుకు…
గుంటూరు కారం తర్వాత మహేష్ బాబుని మళ్ళీ తెరమీద చూడలేమని బెంగపడుతున్న అభిమానులను రిలీఫ్ దక్కే శుభవార్త రాబోతోందట. అశోక్…