‘పుష్ప: ది రూల్’ విడుదల తేదీ దగ్గర పడేకొద్దీ ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇండియా మొత్తం ఎదురు చూస్తున్న సీక్వెల్ కావడం వల్ల దీని గురించి ఏ అప్డేట్ బయటికి వచ్చినా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది. యూనిట్లో ఒక్కొక్కరుగా సినిమా గురించి ఒక రేంజ్లో ఎలివేషన్లు ఇస్తుండడంతో అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి.
ఈ మధ్య ‘పుష్ప-2’ ఫస్టాఫ్ లాక్ చేసిన సందర్భంగా దాని గురించి మేకర్స్ ఒక రేంజిలో చెప్పారు. తాజాగా డిస్ట్రిబ్యూటర్లతో కలిసి ప్రెస్ మీట్లో పాల్గొన్న నిర్మాతలు సినిమా మామూలుగా ఉండదని చెప్పుకొచ్చారు. సినిమాలో చాలా హైలైట్లు ఉన్నాయని.. మూడో పార్ట్కు అదిరిపోయే లీడ్ ఉందని వెల్లడించారు. మరోవైపు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఫస్టాఫ్లో కొన్ని ఎపిసోడ్లు మామూలుగా పేలవని.. ప్రతిదీ ఇంటర్వెల్ బ్యాంగ్ లాగా అనిపిస్తుందని ఎలివేషన్ ఇచ్చాడు.
తాజాగా ‘పుష్ప-2’లో కీలక పాత్ర పోషిస్తున్న యాంకర్ టర్న్డ్ యాక్టర్ అనసూయ ఈ సినిమా గురించి గొప్పగా మాట్లాడింది. ‘బిగ్ బాస్’ షోకు అతిథిగా వచ్చిన ఆమెను పుష్ప-2 గురించి చెప్పమని హోస్ట్ అక్కినేని నాగార్జున అడగ్గా.. మీరు నా వెనుక ఉంటారా మాట్లాడతా అని అనసూయ అంది. సరే అని నాగ్ చెప్పడంతో ‘పుష్ప-2’ గురించి ఆమె మాట్లాడింది. ‘పుష్ప’లో ఇదే క్లైమాక్స్ అనిపించే ఎపిసోడ్ ప్రతి పది నిమిషాలకూ ఒకటి వస్తుందని ఆమె చెప్పింది. ‘పుష్ప-1’ కేవలం ఇంట్రో మాత్రమే అని.. ‘పుష్ప-2’నే అసలు సినిమా అని.. ఇందులోనే చాలా కథ, ఎన్నో ట్విస్టులు ఉంటాయని అనసూయ చెప్పింది.
సినిమా మామూలుగా ఉండదని.. బన్నీ అభిమానులకు గూస్ బంప్స్ గ్యారెంటీ అని ఆమె చెప్పింది. ఇప్పటికే ‘పుష్ప-2’ మీద పెరిగిన అంచనాలు అనసూయ వ్యాఖ్యలతో ఇంకా పీక్స్కు చేరుకునేలా ఉన్నాయి. ఈ చిత్రం డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
ఐపీఎల్ అంటేనే చివరి బంతి వరకు ఉండే ఉత్కంఠ. కానీ ఈసారి ఆ మజా పూర్తిగా తగ్గిపోయింది. పరుగుల వరద…
నిజామాబాద్లో నటరాజ్ అనే ఒక సింగిల్ స్క్రీన్. దాని లీజ్ మార్పు గొడవ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ ఎస్వీసీ…
ఏపీ అధికార పార్టీ జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. సంచలన ప్రకటన చేశారు. పార్టీలో యువతరాన్ని ఆకర్షించేందుకు..…
పాలన విషయంలో మంత్రి లోకేష్ పక్కా ప్లానింగ్తో వ్యవహరిస్తున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయాలను విధానపరమైన అంశాలను కలగాపులగం…
పద్దెనిమిదేళ్ల అవమానాలు, ఎగతాళి మాటలకు బెంగళూరు జట్టు శాశ్వతంగా ముగింపు పలికింది. ఐపీఎల్ చరిత్రలో ట్రోల్స్ కు కేరాఫ్ అడ్రస్…
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఇప్పటికే పాలక మండలి కూడా రద్దయింది. ప్రత్యేక అధికారి పాలనలోకి…