‘పుష్ప: ది రూల్’ విడుదల తేదీ దగ్గర పడేకొద్దీ ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇండియా మొత్తం ఎదురు చూస్తున్న సీక్వెల్ కావడం వల్ల దీని గురించి ఏ అప్డేట్ బయటికి వచ్చినా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది. యూనిట్లో ఒక్కొక్కరుగా సినిమా గురించి ఒక రేంజ్లో ఎలివేషన్లు ఇస్తుండడంతో అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి.
ఈ మధ్య ‘పుష్ప-2’ ఫస్టాఫ్ లాక్ చేసిన సందర్భంగా దాని గురించి మేకర్స్ ఒక రేంజిలో చెప్పారు. తాజాగా డిస్ట్రిబ్యూటర్లతో కలిసి ప్రెస్ మీట్లో పాల్గొన్న నిర్మాతలు సినిమా మామూలుగా ఉండదని చెప్పుకొచ్చారు. సినిమాలో చాలా హైలైట్లు ఉన్నాయని.. మూడో పార్ట్కు అదిరిపోయే లీడ్ ఉందని వెల్లడించారు. మరోవైపు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఫస్టాఫ్లో కొన్ని ఎపిసోడ్లు మామూలుగా పేలవని.. ప్రతిదీ ఇంటర్వెల్ బ్యాంగ్ లాగా అనిపిస్తుందని ఎలివేషన్ ఇచ్చాడు.
తాజాగా ‘పుష్ప-2’లో కీలక పాత్ర పోషిస్తున్న యాంకర్ టర్న్డ్ యాక్టర్ అనసూయ ఈ సినిమా గురించి గొప్పగా మాట్లాడింది. ‘బిగ్ బాస్’ షోకు అతిథిగా వచ్చిన ఆమెను పుష్ప-2 గురించి చెప్పమని హోస్ట్ అక్కినేని నాగార్జున అడగ్గా.. మీరు నా వెనుక ఉంటారా మాట్లాడతా అని అనసూయ అంది. సరే అని నాగ్ చెప్పడంతో ‘పుష్ప-2’ గురించి ఆమె మాట్లాడింది. ‘పుష్ప’లో ఇదే క్లైమాక్స్ అనిపించే ఎపిసోడ్ ప్రతి పది నిమిషాలకూ ఒకటి వస్తుందని ఆమె చెప్పింది. ‘పుష్ప-1’ కేవలం ఇంట్రో మాత్రమే అని.. ‘పుష్ప-2’నే అసలు సినిమా అని.. ఇందులోనే చాలా కథ, ఎన్నో ట్విస్టులు ఉంటాయని అనసూయ చెప్పింది.
సినిమా మామూలుగా ఉండదని.. బన్నీ అభిమానులకు గూస్ బంప్స్ గ్యారెంటీ అని ఆమె చెప్పింది. ఇప్పటికే ‘పుష్ప-2’ మీద పెరిగిన అంచనాలు అనసూయ వ్యాఖ్యలతో ఇంకా పీక్స్కు చేరుకునేలా ఉన్నాయి. ఈ చిత్రం డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on October 28, 2024 7:41 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…