ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో నెక్స్ట్ బిగ్ రిలీజ్ అంటే.. ‘కంగువ’నే. సూర్య హీరోగా ‘శౌర్యం’ ఫేమ్ శివ రూపొందించిన ఈ చిత్రం నవంబరు 14న భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఇది బేసిగ్గా తమిళ మూవీ అయినా.. తెలుగు, హిందీలో సైతం ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. కొంచెం ముందుగానే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసి పూర్తిగా ప్రమోషన్ల మీద దృష్టిపెట్టింది టీం.
ఆల్రెడీ హైదరాబాద్లో ఈవెంట్ చేశారు. తాజాగా చెన్నైలో తమిళ వెర్షన్ ఆడియో వేడుక జరిగింది. ఈ వేడుకకు సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిథిగా రావాల్సింది. కానీ ఆయన ‘కూలీ’ షూటింగ్లో బిజీగా ఉండడంతో రాలేకపోయారు. కానీ టీం కోసం ఒక వీడియో సందేశాన్ని పంపించారు. అందులో రజినీ సరదాాగా మాట్లాడారు.
శివతో రజినీకాంత్ ‘అన్నాత్తె’ మూవీ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ శివతో రజినీకి మంచి అనుబంధమే ఉంది. ‘అన్నాత్తె’ చేసేటపుడు మనిద్దరం కలిసి ఒక పీరియడ్ మూవీ చేస్తే బాగుంటుందని చెప్పేవాడినని.. బహుశా తన కోసమే అతను ‘కంగువ’ కథ రాసి ఉంటాడని.. చివరికి అది సూర్య, జ్ఞానవేల్ రాజాల దగ్గరికి చేరిందని ఆయన నవ్వుతూ అన్నారు.
‘కంగువ’ ట్రైలర్ అద్భుతంగా ఉందని.. సూర్య గొప్ప నటుడని, అతడికి మంచి విజయం చేకూరాలని రజినీ ఆకాంక్షించారు. నిజానికి ‘కంగువ’ దసరా కానుకగా అక్టోబరు 10న విడుదల కాావాల్సింది. కానీ రజినీ సినిమా ‘వేట్టయన్’ను దసరాకే రిలీజ్ చేయాలని భావించడంతో రజినీ మీద గౌరవంతో తమ చిత్రాన్ని సూర్య అండ్ కో వాయిదా వేసుకున్నారు.
ఈ నేపథ్యంలో ‘కంగువ’ ఆడియో వేడుకకు రజినీ ముఖ్య అతిథిగా రావాలనుకున్నారు. కానీ ఇటీవలే అనారోగ్యం కారణంగా కొన్ని వారాల పాటు ఇంటికే పరిమితమైన సూపర్ స్టార్.. కొన్ని రోజుల నుంచి ‘కూలీ’ చిత్రీకరణకు హాజరవుతున్నారు. అందులో బిజీగా ఉండడంతో ‘కంగువ’ టీంను విష్ చేస్తూ రజినీ వీడియో పంపించారు. ఆయన ఇలా చేయడం అరుదు.
This post was last modified on October 27, 2024 4:00 pm
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…