నాగచైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ తండేల్ మీద క్రమంగా ఒత్తిడి పెరిగిపోతోంది. విడుదల తేదీని ప్రకటించడంలో నిర్మాతలు బన్నీ వాస్, అల్లు అరవింద్ చేస్తున్న జాప్యం అభిమానులను అసహనానికి గురి చేస్తోంది.
డిసెంబర్ వద్దనుకుంటే ఖచ్చితంగా సంక్రాంతికి దింపమని, ఎలాగూ నాగార్జున సినిమా పండక్కు లేదు కాబట్టి ఆయన కొడుకుని చూసుకుని మురిసిపోతామని డిమాండ్ చేస్తున్నారు. కానీ రకరకాల కారణాలు తండేల్ ని ఎటు తేల్చుకోనివ్వడం లేదు. దీంతో అన్నివైపులా మద్దెలదరువు అన్నట్టు దర్శకుడితో పాటు టీమ్ నలిగిపోతోంది.
రిస్క్ తీసుకుని సంక్రాంతికి రిలీజ్ చేయాలన్నా గేమ్ చేంజర్, బాలయ్య 109, వెంకటేష్ 76లను తట్టుకోవడం అంత సులభం కాదు. మంచి కంటెంట్ ఉన్నప్పుడు థియేటర్ల విషయంలో రాజీ పడి ఎందుకు రీచ్ తగ్గించుకోవాలనేది గీతా ఆర్ట్స్ ఆలోచన.
దాని బదులు జనవరి చివరి వారం రిపబ్లిక్ డేని టార్గెట్ చేసుకుంటే సోలోగా వచ్చే అడ్వాంటేజ్ తో పాటు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని భావిస్తోంది. కానీ ఇది ఫ్యాన్స్ కు ఇష్టం లేదు. ఒకవేళ అలా చేస్తే మా మద్దతు ఉండదంటూ ఎక్స్ ప్లాట్ ఫామ్ లో మెసేజులు పెడుతున్నారు. ఇంతకీ పూర్తి షూటింగ్ అయిపోయిందో లేదో కూడా సరైన స్పష్టత లేదు.
పోనీ చొరవ తీసుకుని ఏమైనా చెబుదామంటే నాగచైతన్య సైతం అయోమయంలో ఉన్నాడు. ఎందుకంటే ప్రీ ప్రొడక్షన్ దశ నుంచి ఇప్పటిదాకా తండేల్ కోసం విపరీతంగా కష్టపడ్డాడు. కెరీర్ బెస్ట్ అవుతుందనే నమ్మకంతో దేహాన్ని నల్లగా చేసుకుని, హెయిర్ స్టైల్ మార్చుకుని దర్శకుడు చందూ మొండేటి అడిగినదంతా ఇచ్చాడు.
తీరా విపరీతమైన కాంపిటీషన్ లో దిగాల్సి వస్తే అదెంత రిస్కో తనకు తెలియంది కాదు. పైగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, సాయిపల్లవి పెర్ఫార్మన్స్ లాంటి ఎన్నో అంశాలు బజ్ పెంచుతున్నాయి. ఫైనల్ గా తండేల్ త్రాసు ఎటువైపు ఎప్పుడు తిరుగుతుందో తేలాలంటే వేచి చూడాలి.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రముఖ ప్రవచ కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను పాఠ్యాంశాలుగా ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి…
ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…
ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…