నాగచైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ తండేల్ మీద క్రమంగా ఒత్తిడి పెరిగిపోతోంది. విడుదల తేదీని ప్రకటించడంలో నిర్మాతలు బన్నీ వాస్, అల్లు అరవింద్ చేస్తున్న జాప్యం అభిమానులను అసహనానికి గురి చేస్తోంది.
డిసెంబర్ వద్దనుకుంటే ఖచ్చితంగా సంక్రాంతికి దింపమని, ఎలాగూ నాగార్జున సినిమా పండక్కు లేదు కాబట్టి ఆయన కొడుకుని చూసుకుని మురిసిపోతామని డిమాండ్ చేస్తున్నారు. కానీ రకరకాల కారణాలు తండేల్ ని ఎటు తేల్చుకోనివ్వడం లేదు. దీంతో అన్నివైపులా మద్దెలదరువు అన్నట్టు దర్శకుడితో పాటు టీమ్ నలిగిపోతోంది.
రిస్క్ తీసుకుని సంక్రాంతికి రిలీజ్ చేయాలన్నా గేమ్ చేంజర్, బాలయ్య 109, వెంకటేష్ 76లను తట్టుకోవడం అంత సులభం కాదు. మంచి కంటెంట్ ఉన్నప్పుడు థియేటర్ల విషయంలో రాజీ పడి ఎందుకు రీచ్ తగ్గించుకోవాలనేది గీతా ఆర్ట్స్ ఆలోచన.
దాని బదులు జనవరి చివరి వారం రిపబ్లిక్ డేని టార్గెట్ చేసుకుంటే సోలోగా వచ్చే అడ్వాంటేజ్ తో పాటు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని భావిస్తోంది. కానీ ఇది ఫ్యాన్స్ కు ఇష్టం లేదు. ఒకవేళ అలా చేస్తే మా మద్దతు ఉండదంటూ ఎక్స్ ప్లాట్ ఫామ్ లో మెసేజులు పెడుతున్నారు. ఇంతకీ పూర్తి షూటింగ్ అయిపోయిందో లేదో కూడా సరైన స్పష్టత లేదు.
పోనీ చొరవ తీసుకుని ఏమైనా చెబుదామంటే నాగచైతన్య సైతం అయోమయంలో ఉన్నాడు. ఎందుకంటే ప్రీ ప్రొడక్షన్ దశ నుంచి ఇప్పటిదాకా తండేల్ కోసం విపరీతంగా కష్టపడ్డాడు. కెరీర్ బెస్ట్ అవుతుందనే నమ్మకంతో దేహాన్ని నల్లగా చేసుకుని, హెయిర్ స్టైల్ మార్చుకుని దర్శకుడు చందూ మొండేటి అడిగినదంతా ఇచ్చాడు.
తీరా విపరీతమైన కాంపిటీషన్ లో దిగాల్సి వస్తే అదెంత రిస్కో తనకు తెలియంది కాదు. పైగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, సాయిపల్లవి పెర్ఫార్మన్స్ లాంటి ఎన్నో అంశాలు బజ్ పెంచుతున్నాయి. ఫైనల్ గా తండేల్ త్రాసు ఎటువైపు ఎప్పుడు తిరుగుతుందో తేలాలంటే వేచి చూడాలి.
This post was last modified on October 26, 2024 8:37 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…
ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…