Movie News

ఫొటో చూసి ప్రియాంక మోహన్‌ నిశ్చితార్థం చేసేశారు

తెలుగు, తమిళం, మలయాళం.. మూడు భాషల్లోనూ సినిమాలు చేస్తూ మంచి ఊపు మీదుంది ప్రియాంక మోహన్. తెలుగులో నాని సరసన నటించిన ‘సరిపోదా శనివారం’ మంచి హిట్టయింది. ఇక దీపావళికి తన నుంచి ‘బ్రదర్’ అనే తమిళ సినిమా రాబోతోంది. ఇంకా ఆమె చేతిలో అరడజను సినిమాల దాకా ఉన్నాయి.

కెరీర్ ఇంత ఊపులో ఉండగా ప్రియాంక నిశ్చితార్థం చేసుకుంటుందని ఎవరైనా అనుకుంటారా? కానీ సోషల్ మీడియాలో ఈ రకంగా గట్టి ప్రచారం జరుగుతోంది. ఇందుక్కారణం ‘బ్రదర్’ సినిమా టీం సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన ఒక పోస్టరే. అందులో జయం రవి, ప్రియాంక మోహన్ పూల దండలతో పెళ్లి జంటలా కనిపిస్తున్నారు. సినిమాలో భాగంగా ఇలా కనిపించిందీ జంట.

కానీ సోషల్ మీడియా జనం మాత్రం ఈ పోస్టర్ చూసి ప్రియాంకకు, జయం రవికి నిశ్చితార్థం జరిగిందని అర్థం చేసుకున్నారు. ఎవరో ఈ మేరకు పుకారు పుట్టించారు. జయం రవి తన భార్య నుంచి విడాకులు తీసుకుంటున్న నేపథ్యంలో ప్రియాంకతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడని అర్థం చేసుకున్నారు. వీరిది సైలెంట్ లవ్ స్టోరీ అని ప్రచారం జరిగిపోయింది. ఈ విషయం తెలిసి పలువురు నేరుగా ప్రియాంకకు ఫోన్ చేసి విషెస్ చెప్పారట. దీంతో ప్రియాంక దీనిపై క్లారిటీ ఇచ్చింది.

‘బ్రదర్’ సినిమా టీం ఇలాంటి ఫోటో రిలీజ్ చేసి తప్పు చేసిందని.. సినిమాలో భాగమైన దాన్ని నిజంగా జనం అనుకుంటున్నారని.. తెలుగు ఇండస్ట్రీ నుంచి కొందరు తనకు ఫోన్ చేసి విష్ చేశారని ఆమె చెప్పింది. ఏదైనా ఫొటో బయటికి వస్తే దాని వెనుక స్టోరీ ఏంటో తెలుసుకోకుండా జనం ఇలా ఎలా ఊహించుకుంటారని ఆమె ప్రశ్నించింది. ‘బ్రదర్’ దీపావళి కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే.

This post was last modified on October 26, 2024 1:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవరకొండా… ఇక ఆ సినిమా దేవుడికేనా?

తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…

7 minutes ago

బిగ్ బాస్-9‌లో ఇతనే పెద్ద సర్ప్రైజ్

ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…

50 minutes ago

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

4 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

4 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

5 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

7 hours ago