Movie News

ఫొటో చూసి ప్రియాంక మోహన్‌ నిశ్చితార్థం చేసేశారు

తెలుగు, తమిళం, మలయాళం.. మూడు భాషల్లోనూ సినిమాలు చేస్తూ మంచి ఊపు మీదుంది ప్రియాంక మోహన్. తెలుగులో నాని సరసన నటించిన ‘సరిపోదా శనివారం’ మంచి హిట్టయింది. ఇక దీపావళికి తన నుంచి ‘బ్రదర్’ అనే తమిళ సినిమా రాబోతోంది. ఇంకా ఆమె చేతిలో అరడజను సినిమాల దాకా ఉన్నాయి.

కెరీర్ ఇంత ఊపులో ఉండగా ప్రియాంక నిశ్చితార్థం చేసుకుంటుందని ఎవరైనా అనుకుంటారా? కానీ సోషల్ మీడియాలో ఈ రకంగా గట్టి ప్రచారం జరుగుతోంది. ఇందుక్కారణం ‘బ్రదర్’ సినిమా టీం సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన ఒక పోస్టరే. అందులో జయం రవి, ప్రియాంక మోహన్ పూల దండలతో పెళ్లి జంటలా కనిపిస్తున్నారు. సినిమాలో భాగంగా ఇలా కనిపించిందీ జంట.

కానీ సోషల్ మీడియా జనం మాత్రం ఈ పోస్టర్ చూసి ప్రియాంకకు, జయం రవికి నిశ్చితార్థం జరిగిందని అర్థం చేసుకున్నారు. ఎవరో ఈ మేరకు పుకారు పుట్టించారు. జయం రవి తన భార్య నుంచి విడాకులు తీసుకుంటున్న నేపథ్యంలో ప్రియాంకతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడని అర్థం చేసుకున్నారు. వీరిది సైలెంట్ లవ్ స్టోరీ అని ప్రచారం జరిగిపోయింది. ఈ విషయం తెలిసి పలువురు నేరుగా ప్రియాంకకు ఫోన్ చేసి విషెస్ చెప్పారట. దీంతో ప్రియాంక దీనిపై క్లారిటీ ఇచ్చింది.

‘బ్రదర్’ సినిమా టీం ఇలాంటి ఫోటో రిలీజ్ చేసి తప్పు చేసిందని.. సినిమాలో భాగమైన దాన్ని నిజంగా జనం అనుకుంటున్నారని.. తెలుగు ఇండస్ట్రీ నుంచి కొందరు తనకు ఫోన్ చేసి విష్ చేశారని ఆమె చెప్పింది. ఏదైనా ఫొటో బయటికి వస్తే దాని వెనుక స్టోరీ ఏంటో తెలుసుకోకుండా జనం ఇలా ఎలా ఊహించుకుంటారని ఆమె ప్రశ్నించింది. ‘బ్రదర్’ దీపావళి కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే.

This post was last modified on October 26, 2024 1:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`చ‌లానా` పడిందా… బ్యాంక్ నుండి మనీ కట్

వాహ‌న‌దారుల‌కు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహ‌నాలు న‌డుపుతూ..…

26 minutes ago

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

6 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

8 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

9 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

9 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

11 hours ago