మాములుగా పెద్ద ప్యాన్ ఇండియా మూవీ వస్తుందంటే దానికి ముందు వెనుకా పోటీ వచ్చేందుకే నిర్మాతలు రిస్క్ తీసుకోరు. అలాంటిది నేరుగా క్లాష్ కి సిద్ధపడటం ఊహించలేం. ఉదాహరణకు దేవర, కల్కి 2898 ఏడి టైంలో ఎవరూ పోటీకి ఇష్టపడలేదు.
దీంతో భారీ ఓపెనింగ్స్ తో పాటు పాజిటివ్ టాక్ రూపంలో వచ్చిన బ్లాక్ బస్టర్ ఫలితం వందల కోట్ల వసూళ్లు కురిపించింది. కంగువకి సైతం అలాంటి వాతావరణం ఆశిస్తున్నారు అభిమానులు. దీని ప్రమోషన్ కోసం ముంబై నుంచి హైదరాబాద్ దాకా కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతున్న సూర్యని ముగ్గురు హీరోలు మాత్రం బాక్సాఫీస్ వద్ద కవ్వించేందుకు రెడీ అవుతున్నారు.
కంగువ వస్తున్న నవంబర్ 14న వరుణ్ తేజ్ ‘మట్కా’ దిగుతోంది. హీరో వరస ఫ్లాపుల్లో ఉన్నప్పటికీ టీజర్ తీసుకొచ్చిన హైప్ వల్ల బిజినెస్ ఎంక్వయిరీలు పెరిగాయని సమాచారం. దర్శకుడు కరుణ కుమార్ మంచి ఇంటెన్స్ మాఫియా డ్రామాని తీశాడనే టాక్ అంతర్గతంగా వినిపిస్తోంది.
మరొకటి అశోక్ గల్లా హీరోగా రూపొందిన అతని రెండో సినిమా ‘దేవకీనందన వాసుదేవ’. హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ అందించిన కథ కావడంతో మార్కెటింగ్ లో ఈ అంశాన్ని బాగా వాడుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరంగా కంగువకి ఇవి కొంచెం స్పీడ్ బ్రేకర్స్ మారడం ఖాయం. ఇంకా పూర్తి పబ్లిసిటీ మొదలుపెట్టలేదు.
ఇక్కడితో కథ అయిపోలేదు. శాండల్ వుడ్ నుంచి శివరాజ్ కుమార్ ‘భైరతి రణగల్’గా వస్తున్నాడు. జైలర్ తెచ్చిన ఇమేజ్ పుణ్యమాని ప్రధాన భాషలు అన్నిటిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. కాకపోతే ఒక రోజు ఆలస్యంగా నవంబర్ 15 రావడం కర్ణాటకలో కంగువకు కొంచెం రిలీఫ్.
ఈ ముగ్గురిని తట్టుకోవడమే కాక కంగువని టీజ్ చేస్తున్న హాలీవుడ్ మూవీ కూడా ఉంది. ఓవర్సీస్ లో ‘గ్లాడియేటర్ 2’ నుంచి ముప్పు పొంచి ఉంది. బాలీవుడ్ లో వివాదాస్పద చిత్రం ‘ది సబర్మతి రిపోర్ట్’ని తక్కువంచనా వేయడానికి లేదు. చూస్తుంటే రెండు వేల కోట్ల టార్గెట్ పెట్టుకున్న కంగువకి ఇవన్నీ పెను సవాళ్లుగా మారబోతున్నాయి.
This post was last modified on October 26, 2024 5:18 am
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…