Mrunal Thakur
తెలుగు ఎంట్రీని సీతారామం రూపంలో ఘనంగా జరుపుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కి ఆ తర్వాత హాయ్ నాన్న కూడా విజయం సాధించడం ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ఇంకేం టాప్ లీగ్ లోకి వెళ్లిపోతుందనుకున్న టైంలో ది ఫ్యామిలీ స్టార్ ఇచ్చిన షాక్ మాములుగా కొట్టలేదు. దాని వల్లే కెరీర్ డౌన్ కాకపోయినా అవకాశాలు, మార్కెట్ మీద విజయ్ దేవరకొండ మూవీ ప్రభావం చూపించింది. నిజానికి కంగువలో సూర్య సరసన ముందు మృణాల్ నే అనుకున్నారట. అయితే డేట్ల విషయంలో వచ్చిన ఇబ్బంది వల్ల వదులుకోవాల్సి వస్తే ఆ ఛాన్స్ కాస్తా దిశా పటానిని వరించింది.
తీరా చూస్తే కంగువలో తనుండేది చివరి ఇరవై నిముషాలు మాత్రమే అని తేలడంలో ఒకరకంగా మృణాల్ ఠాకూర్ నష్టపోయింది పెద్దగా లేదనే చెప్పాలి. అలాని సూర్యకు జోడి అయ్యే అవకాశం మిస్ కాలేదు. ఆర్జె బాలాజీ దర్శకత్వంలో సూర్య చేయబోయే ఫాంటసీ థ్రిల్లర్ లో మృణాల్ నే ఎంపిక చేసినట్టు లేటెస్ట్ అప్డేట్. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ త్వరలోనే అనౌన్స్ చేయొచ్చు. ప్రస్తుతం కంగువ ప్రమోషన్లలో బిజీగా ఉన్న సూర్య దీని థియేటర్ రన్ అయ్యాక కొత్త సినిమాల అప్డేట్స్ ఇవ్వాలని నిర్ణయించుకోవడంతో అభిమానులు ఇంకో నెల రోజులు ఆగాల్సి ఉంటుంది.
ఇక తెలుగులో చూస్తే మృణాల్ కొత్తగా సైన్ చేసిన ప్రాజెక్టులు లేవు. హిందీలో మాత్రం చెప్పుకోదగ్గ బిజీగానే ఉంది. పూజా మేరీ జాన్, హై జవానీతో ఇష్క్ హోనా హై, సన్ అఫ్ సర్దార్ 2, తుమ్ ఓ హో వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. సౌత్ కంటే ఎక్కువ బాలీవుడ్ కే ప్రాధాన్యం ఇస్తున్న మృణాల్ ఠాకూర్ ఆ మధ్య కల్కి 2898 ఏడిలో చిన్న పాత్ర చేసింది. తమిళ డెబ్యూ ఏకంగా సూర్యతోనే అంటే ఒకరకంగా జాక్ పాటు కొట్టినట్టే. ఇది కూడా భారీ బడ్జెట్ తోనే రూపొందుతోంది. ఇంకో హీరోయిన్ ఉంటుందనే ప్రచారంలో రుక్మిణి వసంత్ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రతిపాదన దశలోనే ఉందని సమాచారం.
This post was last modified on October 25, 2024 5:31 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…