తెలుగు ఎంట్రీని సీతారామం రూపంలో ఘనంగా జరుపుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కి ఆ తర్వాత హాయ్ నాన్న కూడా విజయం సాధించడం ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ఇంకేం టాప్ లీగ్ లోకి వెళ్లిపోతుందనుకున్న టైంలో ది ఫ్యామిలీ స్టార్ ఇచ్చిన షాక్ మాములుగా కొట్టలేదు. దాని వల్లే కెరీర్ డౌన్ కాకపోయినా అవకాశాలు, మార్కెట్ మీద విజయ్ దేవరకొండ మూవీ ప్రభావం చూపించింది. నిజానికి కంగువలో సూర్య సరసన ముందు మృణాల్ నే అనుకున్నారట. అయితే డేట్ల విషయంలో వచ్చిన ఇబ్బంది వల్ల వదులుకోవాల్సి వస్తే ఆ ఛాన్స్ కాస్తా దిశా పటానిని వరించింది.
తీరా చూస్తే కంగువలో తనుండేది చివరి ఇరవై నిముషాలు మాత్రమే అని తేలడంలో ఒకరకంగా మృణాల్ ఠాకూర్ నష్టపోయింది పెద్దగా లేదనే చెప్పాలి. అలాని సూర్యకు జోడి అయ్యే అవకాశం మిస్ కాలేదు. ఆర్జె బాలాజీ దర్శకత్వంలో సూర్య చేయబోయే ఫాంటసీ థ్రిల్లర్ లో మృణాల్ నే ఎంపిక చేసినట్టు లేటెస్ట్ అప్డేట్. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ త్వరలోనే అనౌన్స్ చేయొచ్చు. ప్రస్తుతం కంగువ ప్రమోషన్లలో బిజీగా ఉన్న సూర్య దీని థియేటర్ రన్ అయ్యాక కొత్త సినిమాల అప్డేట్స్ ఇవ్వాలని నిర్ణయించుకోవడంతో అభిమానులు ఇంకో నెల రోజులు ఆగాల్సి ఉంటుంది.
ఇక తెలుగులో చూస్తే మృణాల్ కొత్తగా సైన్ చేసిన ప్రాజెక్టులు లేవు. హిందీలో మాత్రం చెప్పుకోదగ్గ బిజీగానే ఉంది. పూజా మేరీ జాన్, హై జవానీతో ఇష్క్ హోనా హై, సన్ అఫ్ సర్దార్ 2, తుమ్ ఓ హో వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. సౌత్ కంటే ఎక్కువ బాలీవుడ్ కే ప్రాధాన్యం ఇస్తున్న మృణాల్ ఠాకూర్ ఆ మధ్య కల్కి 2898 ఏడిలో చిన్న పాత్ర చేసింది. తమిళ డెబ్యూ ఏకంగా సూర్యతోనే అంటే ఒకరకంగా జాక్ పాటు కొట్టినట్టే. ఇది కూడా భారీ బడ్జెట్ తోనే రూపొందుతోంది. ఇంకో హీరోయిన్ ఉంటుందనే ప్రచారంలో రుక్మిణి వసంత్ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రతిపాదన దశలోనే ఉందని సమాచారం.
This post was last modified on %s = human-readable time difference 5:31 pm
పోటీ విపరీతంగా ఉన్నప్పుడు అపోజిషన్ ని తట్టుకోవడానికి రకరకాల ఎత్తుగడలు వేయాల్సి ఉంటుంది. అందులోనూ బాలీవుడ్ రిలీజ్ కోసం టాలీవుడ్…
దివంగత కాపు నేత వంగవీటి రంగా రాజకీయ వారసుడిగా వంగవీటి రాధా రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. 2004లో కాంగ్రెస్…
బాలీవుడ్ హీరోయిన్ల పీఆర్ గిమ్మిక్స్ గురించి అప్పుడప్పుడూ వార్తలు బయటికి వస్తుంటాయి. వాళ్లు ఎయిర్ పోర్ట్లో అడుగు పెడితే చాలు…
మాజీ మంత్రి కేటీఆర్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతలపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్, ఏపీపీసీసీ అధ్యక్షురాలు మధ్య ఆస్తి వివాదం తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. సొంత…
టీడీపీ ఎమ్మెల్యేలు ఎంత చెబుతున్నా.. వినిపించుకోవడం లేదన్న ఆవేదన సీఎం చంద్రబాబులో కనిపి స్తోంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు కీలక…