బాలీవుడ్ హీరోయిన్ల పీఆర్ గిమ్మిక్స్ గురించి అప్పుడప్పుడూ వార్తలు బయటికి వస్తుంటాయి. వాళ్లు ఎయిర్ పోర్ట్లో అడుగు పెడితే చాలు సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు వైరల్ అయిపోతుంటాయి. తమకు తెలియకుండా ఇవి జరుగుతున్నట్లు కలరింగ్ ఇస్తుంటారు. కానీ ఇదంతా పీఆర్ టీమ్స్ మహిమ అని సౌత్ హీరోయిన్ ప్రియమణి గతంలో వెల్లడించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఫొటోగ్రాఫర్లను నియమించుకుని సదరు ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యేలా చూసుకుంటారని.. తనకు కూడా ఇలాంటి ఆఫర్లు ఇచ్చారని, కానీ అంగీకరించలేదని ప్రియమణి వెల్లడించింది.
ఇప్పుడు సాయిపల్లవి కూడా ఇలాంటి కామెంట్సే చేసి వార్తల్లో నిలిచింది. బాలీవుడ్ హీరోయిన్లు నిత్యం వార్తల్లో ఉండేందుకు పీఆర్ టీమ్స్ ద్వారా ఎలా ప్రయత్నిస్తారో ఆమె వెల్లడించింది.
తన కొత్త చిత్రం ‘అమరన్’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి మాట్లాడుతూ.. “బాలీవుడ్కు చెందిన ఓ వ్యక్తి ఇటీవల నాకు ఫోన్ చేశారు. నన్ను నేను ప్రమోట్ చేసుకోవడానికి, వార్తల్లో నిలవడానికి పీఆర్ టీంను నియమించుకుంటారా అని అడిగాడు. అలా చేస్తే నేను లైమ్ లైట్లో ఉండగలను. ప్రేక్షకులు తరచూ నా గురించి మాట్లాడుకుంటారు. కానీ దాని వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు అనిపించింది. ఎందుకంటే తరచూ నా గురించి మాట్లాడాలన్నా ప్రేక్షకుల విసుగు వస్తుంది. అందుకే నాకు అలాంటిదేమీ అవసరం లేదని చెప్పేశా” అని చెప్పింది.
సాయిపల్లవి ఎవరి పేర్లూ ప్రస్తావించకపోయినా, ఎవరి మీదా విమర్శలు చేయకపోయినా.. బాలీవుడ్ హీరోయిన్లు ఇలా పీఆర్ టీంలను మెయింటైన్ చేయడం ద్వారా నిత్యం తాము వార్తల్లో ఉండేలా, సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చూసుకుంటారని చెప్పకనే చెప్పినట్లు అయింది. దీంతో సాయిపల్లవి కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతున్నాయి.
This post was last modified on October 25, 2024 7:08 pm
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…