Movie News

సాయిపల్లవి ‘పీఆర్’ వ్యాఖ్యలు వైరల్

బాలీవుడ్ హీరోయిన్ల పీఆర్ గిమ్మిక్స్ గురించి అప్పుడప్పుడూ వార్తలు బయటికి వస్తుంటాయి. వాళ్లు ఎయిర్ పోర్ట్‌లో అడుగు పెడితే చాలు సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు వైరల్ అయిపోతుంటాయి. తమకు తెలియకుండా ఇవి జరుగుతున్నట్లు కలరింగ్ ఇస్తుంటారు. కానీ ఇదంతా పీఆర్ టీమ్స్ మహిమ అని సౌత్ హీరోయిన్ ప్రియమణి గతంలో వెల్లడించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఫొటోగ్రాఫర్లను నియమించుకుని సదరు ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యేలా చూసుకుంటారని.. తనకు కూడా ఇలాంటి ఆఫర్లు ఇచ్చారని, కానీ అంగీకరించలేదని ప్రియమణి వెల్లడించింది.

ఇప్పుడు సాయిపల్లవి కూడా ఇలాంటి కామెంట్సే చేసి వార్తల్లో నిలిచింది. బాలీవుడ్ హీరోయిన్లు నిత్యం వార్తల్లో ఉండేందుకు పీఆర్ టీమ్స్ ద్వారా ఎలా ప్రయత్నిస్తారో ఆమె వెల్లడించింది.

తన కొత్త చిత్రం ‘అమరన్’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి మాట్లాడుతూ.. “బాలీవుడ్‌కు చెందిన ఓ వ్యక్తి ఇటీవల నాకు ఫోన్ చేశారు. నన్ను నేను ప్రమోట్ చేసుకోవడానికి, వార్తల్లో నిలవడానికి పీఆర్ టీంను నియమించుకుంటారా అని అడిగాడు. అలా చేస్తే నేను లైమ్ లైట్లో ఉండగలను. ప్రేక్షకులు తరచూ నా గురించి మాట్లాడుకుంటారు. కానీ దాని వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు అనిపించింది. ఎందుకంటే తరచూ నా గురించి మాట్లాడాలన్నా ప్రేక్షకుల విసుగు వస్తుంది. అందుకే నాకు అలాంటిదేమీ అవసరం లేదని చెప్పేశా” అని చెప్పింది.

సాయిపల్లవి ఎవరి పేర్లూ ప్రస్తావించకపోయినా, ఎవరి మీదా విమర్శలు చేయకపోయినా.. బాలీవుడ్ హీరోయిన్లు ఇలా పీఆర్ టీంలను మెయింటైన్ చేయడం ద్వారా నిత్యం తాము వార్తల్లో ఉండేలా, సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చూసుకుంటారని చెప్పకనే చెప్పినట్లు అయింది. దీంతో సాయిపల్లవి కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతున్నాయి.

Satya

Recent Posts

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

5 hours ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

7 hours ago

నమ్మకం టన్నుల్లో… రామ్ చరణ్ మాటల్లో

విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…

8 hours ago

జ‌గ‌న్‌కు క‌విత మ‌ద్ద‌తిస్తున్నారా?

తెలంగాణ నాయ‌కురాలు, తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున…

8 hours ago

మస్సా మస్సా… లెక్క సరిపోయింది

పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…

8 hours ago

ప‌క్కా మాస్… క‌ల్లు రుచి చూసిన బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తాజాగా క‌ల్లు రుచి చూశారు. వాస్త‌వానికి ఆయ‌న ఇలాంటి వాటికి క‌డు దూరంగా ఉంటారు. అయితే..…

9 hours ago